ఆరుగురు కొత్త వైసీపీ ఎమ్మెల్సీలు వీళ్లే..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఆరుగురు ఎమ్మెల్సీ అభ్యర్థులను సీఎం జగన్ ఖరారు చేశారు. ఇటీవల మరణించిన వైసీపీ ప్రజాప్రతినిధులు చల్లా రామకృష్ణారెడ్డి, బల్లి దుర్గాప్రసాదరావు కుమారులకు ఎమ్మెల్సీలుగా చాన్సిచ్చారు. చల్లా రామకృష్ణారెడ్డి ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయనపదవిని ఆయన కుమారుడు భగీరథరెడ్డికి ఇచ్చారు. బల్లి దుర్గా ప్రసాదరావు తిరుపతి ఎంపీగా ఉన్నారు. ఆయన చనిపోయారు. అయితే ఎంపీ సీటును జగన్ ఫిజియోధెరపిస్ట్‌గా పని చేసిన వ్యక్తికి ఇవ్వాలని నిర్ణయించడంతో… దుర్గా ప్రసాదరావు కుమారుడు కల్యాణ్ చక్రవర్తికి ఎమ్మెల్సీ ఇచ్చారు.

ఇక శ్రీకాకుళం నేత దువ్వాడ శ్రీనివాస్, కడప జిల్లా నేత సి. రామచంద్రయ్య, విజయవాడకు చెందిన మైనార్టీ నేత కరీమున్నీసా, మహ్మద్ ఇక్బాల్‌లకు మిగిలిన స్థానాలు కేటాయించారు. ఇందులో మహ్మద్ ఇక్బాల్ సిట్టింగ్ ఎమ్మెల్సీ. ఆయన హిందూపురం ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. దువ్వాడ శ్రీనివాస్ కూడా.. టెక్కలిలో అచ్చెన్నాయుడుపై పోటీ చేసి ఓడిపోయారు. ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో ఆయన దూకుడైన ప్రవర్తనతో వివాదాస్పదమయ్యారు. ఆయన తన రాజకీయంతో హైకమాండ్‌ను ఆకట్టుకున్నారు. సి. రామచంద్రయ్య రకరకాల పార్టీలు మారి.. గత ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. పదవి కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడాయనకు అవకాశం ఇచ్చారు.

ఆరు ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి ఎన్నికల నామినేషన్ల దరఖాస్తుకు నాలుగో తేదీ ఆఖరు. మార్చి 15న పోలింగ్‌ జరుగుతుంది. ఇవన్నీ.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలే. ఒక్కో ఎమ్మెల్సీ గెలవడానికి 30 మంది వరకూ ఎమ్మెల్యేలు కావాలి. విపక్షాలకు అంతటి బలం లేకపోవడంతో ఆరుగురు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం ఖాయం. గత ఎన్నికలకు ముందు టిక్కెట్లు ఇవ్వలేకపోయిన వారికి.. పార్టీలో చేరిన వారికి పెద్ద ఎత్తున ఎమ్మెల్సీ హామీలు ఇచ్చారు. అయితే కొత్తగా వస్తున్న పదవులన్నీ… ఇలా చనిపోయిన నేతల వారసులకు.. ఓడిపోయిన నేతలకు ఇస్తూండటంతో చాలా మంది నిరాశకు గురవుతున్నారు. కానీ అడిగే ధైర్యం ఎవరూ చేయలేకపోతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close