ఏపీ అబ్బాయిల్లో క్రూరత్వం పెరిగిపోయిందంటున్న వాసిరెడ్డి పద్మ..!

ఆంధ్రప్రదేశ్‌లో అమ్మాయిలపై ప్రేమోన్మాదుల దాడులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అత్యంత దారుణంగా హత్యలు చేస్తున్నారు. ఒక ఘటన మరిచిపోక ముందే మరో ఘటన జరుగుతోంది. ఇలా ఎందుకు జరుగుతోందనే దానికి ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ.. వినూత్నమైన కారణం చెప్పారు.. అదేమిటంటే.. అబ్బాయిల్లో క్రూరత్వం పెరిగిపోవడమట,. అబ్బాయిల్లో క్రూరత్వం ఎలా పెరిగిపోయిందో.. నర్సరావుపేట డిగ్రీ విద్యార్థిని అనూష హత్య ఘటన చూస్తే తెలిసిపోతోందని ఆమె బాధపడ్డారు. విష్ణువర్థన్ రెడ్డి అనే యువకుడు.. అనూషను చంపేశాడు. నిన్నంతా అనూష బంధువులు ఏడు గంటల పాటు పల్నాడు రోడ్డును దిగ్భంధించి నిరసన తెలిపినా ఎవరూ పట్టించుకోలేదు.

రాత్రికి సీఎం జగన్ రూ. పది లక్షల నష్టపరిహారం ప్రకటించడంతో ఈ రోజు అందరూ బయటకు వచ్చారు. వాసిరెడ్డి పద్మ.. అనూష స్వగ్రామానికి వెళ్లి పరామర్శించారు. ఏపీలో వరుస ఘటనలు జరుగుతున్నా.. ఆడపిల్లలకు ఎందుకు రక్షణ కల్పించలేకపోతున్నారనే మౌలికమైన ప్రశ్నకు సమాధానాన్ని పక్కన పెట్టి… అబ్బాయిల్లో క్రూరత్వం పెరిగిందని కారణం చెప్పుకొచ్చారు. ఆడపిల్ల అంటే చులకనభావం ఏర్పడిందని.. కాలేజ్ లకు .. ఆఫీసులకు వెళ్లాలా లేదా అన్న సందిగ్ధంలో పడేలా ఉందని చెప్పుకొచ్చారు. 21 రోజుల్లో ఉరిశిక్ష పడితే చూడాలని అందరూ కోరుకుంటున్నారని.. ఎన్ కౌంటర్ చేయాలన్న డిమాండ్స్ వస్తున్నాయని చెప్పుకొచ్చారు.

ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు వెళ్లడం… బాధితుల్ని పరామర్శించి రావడం తప్ప… వాసిరెడ్డి పద్మ ప్రత్యేకంగా చేస్తున్న పనులేం లేవన్న విమర్శలు ఉన్నాయి. మహిళా కమిషన్ చైర్మన్ అంటే వేధింపులకు గురవుతున్న వారికి రక్షణ కల్పించాలి. కానీ పరామర్శల కోసమే ఆ పదవిని వినియోగిస్తున్నారు. అమ్మాయిలు, మహిళలపై వేధింపులకు పాల్పడుతున్న వారిపై కఠినమైన చర్యలు తీసుకోకపోవడంతో నేరం చేసేవారిలో ధైర్యం పెరుగుతోంది. ఫలితంగా నేరాలు పెరిగిపోతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

ఐటెమ్ గాళ్‌…. పెద్ద స‌మ‌స్యే!

ఇది వ‌ర‌కు ఏ సినిమాలో ఏ హీరోయిన్‌ని తీసుకోవాలా? అని ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డేవారు. అనుకొన్నంత స్థాయిలో, సంఖ్య‌లో హీరోయిన్లు లేక‌పోవ‌డం, స్టార్ హీరోల క్రేజ్‌కు స‌రిప‌డా క‌థానాయిక‌లు దొర‌క్క‌పోవ‌డంతో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close