జగన్ తేడా చూపిస్తోంది అక్కడే..!

ఆలయ అర్చకులకు వంశపారంపర్య హక్కులు సక్రమింపజేసేలా ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఒక్క తిరుమల శ్రీవారి ఆలయం మినహా అన్ని ధార్మిక సంస్థల అర్చకులకు ఈ వంశపారంపర్య హక్కులు సంక్రమించేలా ఏపీ ప్రభుత్వం ఈ ఉత్తర్వులలో పేర్కొంది. నిజానికి ఈ హక్కులు కల్పించాలనే నిర్ణయాన్ని చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా తీసుకున్నారు. నాడు చంద్రబాబుతో సన్నిహితంగా ఉన్న సమయంలో.. బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పదవి పొందిన ఐవైఆర్ కృష్ణారావు.. ఈ విషయాన్ని దగ్గరుండి చూసుకున్నారు. జీవో నెంబర్ 76కు ప్రాధమిక స్థాయి నోటిఫికేషన్ విడుదలయింది. అయితే.. ఆ తర్వాత ఐవైఆర్ చంద్రబాబుకు వ్యతిరేకమయ్యారు. రమణదీక్షితులు… రాజకీయ కారణాలతో ప్రభుత్వంపై ఆరోపణలు ప్రారంభించారు. అర్చక సంఘాలు కొన్ని వైసీపీకి మద్దతుగా మారడంతో.. ఆ ప్రయత్నం అక్కడితోనే ఆగిపోయింది.

ఆలయాల అర్చకులకు వారసత్వ ప్రయోజనం ఉన్నా 1987లో అప్పటి ప్రభుత్వం ఈ ప్రయోజనాలను రాష్ట్రవ్యాప్తంగా రద్దు చేసింది. దీంతో అరకొర వేతనాలు, విరాళాలతో కాలం గడుపుతూ వచ్చేవారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక 2007లో వారసత్వం పునరుద్ధరణపై కసరత్తు చేశారు. కొన్ని అభ్యంతరాల నేపధ్యంలో ముందడుగు పడలేదు. అనంతరం 2014లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక 2017లో తిరిగి ఈ విషయంపై దృష్టి సారించారు. జీవో 76 విడుదల చేసి వారసత్వ పునరుద్ధరణకు చర్యలు తీసుకున్నారు. జీవో నెంబర్ 76 ప్రాధమిక నోటిఫికేషన్ జీవో ఇచ్చినప్పుడు.. సీఎంవోలోని కొంత మంది అధికారులు అడ్డుపడ్డారన్న ప్రచారం జరిగింది. టీటీడీకి సంబంధం లేకుండా.., ఇతర ఆలయాలన్నింటికీ వర్తింపచేస్తూ ఆదేశాలు ఇవ్వాలని బ్రాహ్మణ నేతలు కోరుతూ వచ్చారు. దీనిపై చంద్రబాబు పలుమార్లు సమావేశమయ్యారు. కానీ.. నిర్ణయం తీసుకోలేదు.

ఈ లోపు ఎన్నికలు వచ్చాయి. జగన్ అర్చకులకు వంశపారంపర్య హక్కు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అప్పటికే గత ప్రభుత్వం కసరత్తు మొత్తం చేసి ఉండటంతో… ఇప్పుడు ఆదేశాలు జారీ చేసేశారు. అంటే.. చంద్రబాబు.. నిర్ణయం తీసుకోకుండా నాన్చారు.. కానీ జగన్ మాత్రం.. చంద్రబాబు సర్కార్ తెచ్చిన  జీవో 76కు సవరణలు చేసి సోమవారం నోటిఫికేషన్‌ జారీ చేసేసింది. క్రెడిట్ అంతా… జగన్ ఖాతాలో పడిపోయింది. చంద్రబాబు సమావేశాలతో నాన్చడం వల్ల… చివరికి జగన్ కే మేలు జరిగిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. నిర్ణయాలు తీసుకునేందుకు కూలంకుషంగా చర్చించడం కరెక్టే కానీ.. అలా చర్చించిన తర్వాత కూడా నిర్ణయాలు తీసుకోపోవడం.. వల్ల ఏం జరుగుతుందో.. ఈ వ్యవహారంలో తేలిపోయిందనే కామెంట్లు టీడీపీలోనే వినిపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చిలుకూరుకు పోటెత్తిన భక్తులు…ఫుల్ ట్రాఫిక్ జామ్

కోరిన కోరికల్ని తీర్చే సుప్రసిద్ధ చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలకు భక్తులు పోటెత్తారు. ఆలయ సిబ్బంది అంచనా వేసిన దానికంటే పది రేట్లు ఎక్కువగా రావడంతో క్యూలైన్లు అన్ని నిండిపోయాయి. ఆలయానికి...

అచ్చెన్నాయుడు అన్నీ అలా కలసి వస్తున్నాయంతే !

ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు అన్నీ అలా కలసి వస్తున్నాయి. ఆయన ప్రత్యర్థి .. దువ్వాడ శ్రీనివాస్.. భార్య చేతిలోనే పదే పదే ఓడిపోతున్నారు. తాజాగా మరోసారి ఆయన భార్య రంగంలోకి దిగారు....

‘పారిజాత ప‌ర్వం’ రివ్యూ: సినిమా తీయ‌డం ఓ క‌ళ‌!

Parijatha Parvam movie review తెలుగు360 రేటింగ్: 1.5/5 'కిడ్నాప్ చేయ‌డం ఓ క‌ళ‌'... అనే కాన్సెప్ట్‌తో రూపొందించిన చిత్రం 'పారిజాత ప‌ర్వం'. దాన్ని బ‌ట్టి ఇదో కిడ్నాప్ క‌థ‌ అని ముందే అర్థం చేసుకోవొచ్చు....

ఉద్యోగం ఊస్టింగ్ ? వెంకట్రామిరెడ్డి ఇక జగన్ సేవకే.. !

ఏపీ సచివాలయ ఉద్యోగ సంఘం నేత వెంకట్రామిరెడ్డిని సస్పెండ్ చేసింది ఈసీ. ఆయన వైసీపీ కోసం ఎన్నికల ప్రచారం చేయడంతో నిర్ణయం తీసుకుంది. అంతే కాదు ఆయనను అమరావతి దాటి వెళ్లవద్దని ఉత్తర్వులు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close