“ధర్టీ ఇయర్స్‌కి ఫృధ్వీ”కి బుద్దొచ్చిందట !

చాలా కాలం పాటు కష్టపడి సినిమాల్లో కమెడియన్‌గా ఓ స్థాయికి అలా చేరుకున్న సమయంలో ఇలా పాలిటిక్స్‌లో వేరు పెట్టి నానా రచ్చ చేసేసిన “ధర్టీ ఇయర్స్‌కి ఫృధ్వీ” ఇప్పుడు ఎక్కడా కనిపించట్లా. ఆయనకు అవకాశాలు రావడం ఎప్పుడో మానేశాయి. రాజకీయంలోనూ ఆయనను ఆమడ దూరంలో పెడుతున్నారు. పట్టించుకునేవారు లేరు. దీంతో ఇప్పుడు ఆయనకు ఏం చేయాలో తెలియడం లేదు. కనీసం కడుపు నింపిన వృత్తి అయినా చేసుకుందామని ఇప్పుడు కాళ్ల బేరానికి వస్తున్నారు. బుద్ది వచ్చిందంటూ లెంపలు వేసుకుంటున్నారు.

2019 ఎన్నికల సమయంలో వైసీపీకి ఫృధ్వీ ప్రచారం చేశారు. కొంత మంది ఆర్టిస్టుల గుంపును తీసుకుని విస్తృతంగా తిరిగారు. మామూలుగా తిరిగితే ఎవరికీ అభ్యంతరం ఉండేది కాదు. తాను వైసీపీకి ప్రచారం అంటే ఇతర పార్టీలను.. ఆ పార్టీ నేతలను బండ బూతులు తిట్టడమే ప్రచారం అనుకున్నారు. అడ్డూ అదుపూ లేకుండా రెచ్చిపోయారు. చివరికి మెగా ఫ్యామిలీనీ వదల్లేదు. ఆయన అలాఅందర్నీ తిట్టడం వైసీపీ పెద్దలకు నచ్చిందేమో కానీ.. తర్వాత ఎస్వీబీసీ చైర్మన్ పదవి ఇచ్చారు. ఇచ్చింత కాలం నిలబెట్టుకోలేకపోయారు. వైసీపీలోనే కుట్రలు చేసి ఆయనను బయటకు పంపేశారు. అప్పట్నుంచి ఫృధ్వీ పరిస్థితి రెంటికి చెడ్డ రేవడి అయిపోయింది.

ఒకప్పుడు రోజుకు రూ. ఐదు లక్షల వరకూ తీసుకున్న స్థాయికి వెళ్లిన ఫృధ్వీకి ఇప్పుడు వేషాలు కరువయ్యాయి. ఏం చేయాలో తెలియక తంటాలు పడుతున్నారు. వైసీపీ నేతలు పట్టించుకోవడం లేదు. ఉపాధి చూపించే అవకాశం లేదు. ఇటు ఇండస్ట్రీలో ఆయన చేసిన వ్యవహారాలు ఇంకా సమసిపోలేదు. అందుకే బుద్దొచ్చిందంటూ చాన్సిచ్చిన ప్రతీ మీడియాముందు చెబుతున్నారు. కానీ ఆయన చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తం చేసుకున్నా.. క్షమిస్తారేమో కానీ.. మళ్లీ నెత్తిన పెట్టుకునే అవకాశం మాత్రం ఉండదనేది ఎక్కువ మంది అభిప్రాయం. ఎగిరెగిరిపడితే చివరికి ఏమవుతుందో ఫృధ్వీ పరిస్థితే సాక్ష్యమని చెప్పుకునేందుకు ఉపయోగపడతారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కర్ణాటకపై బీజేపీ నజర్..ఏక్ నాథ్ షిండే సంచలన వ్యాఖ్యలు..!!

మరోసారి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే బీజేపీయేతర ప్రభుత్వాలను కూల్చుతుందని ప్రచారం జరుగుతోన్న వేళ మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. మహారాష్ట్రలో లాగే కర్ణాటకలోనూ...

వన్స్ మోర్ ‘సుచి లీక్స్’: ఈసారి ధనుష్, జీవీ ప్రకాష్

సినిమా వార్తలని ఫాలో అయ్యేవారికి సుచీ లీక్స్ గురించి పరిచయం అవసరం లేదు. 'సుచీ లీక్స్‌' పేరుతో కోలీవుడ్‌లో దుమారం రేపారు సింగర్‌ సుచిత్ర. అప్పట్లో ఆమె నుంచి వచ్చిన...

పుష్ప ఇంపాక్ట్.. బన్నీ ఫుల్ క్లారిటీ

సినిమా ప్రభావం ఖచ్చితంగా సమాజంపై వుంటుందని కొందరి అభిప్రాయం. సమాజంలో ఉన్నదే సినిమాలో ప్రతిబింబిస్తుందని మరికొందరి మాట. సినిమాని సినిమాగా చుస్తారానినేది ఇంకొందరి వాదన. హీరో అల్లు అర్జున్ కూడా ఇదే అభిప్రాయాన్ని...

తీహార్ జైలుకు బాంబు బెదిరింపు… ఆందోళనలో కవిత అభిమానులు..?

అత్యంత భద్రత నడుమ ఉండే తీహార్ జైలుకు బాంబు బెదిరింపు రావడం తీవ్ర కలకలం రేపుతోంది. జైలును పేల్చేస్తామంటూ ఆగంతకులు మెయిల్ చేయడంతో అధికారులు అలర్ట్ అయి పోలీసులకు సమాచారం అందించారు. ఆగంతకుల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close