ఉపఎన్నికలలో తెరాస పోటీ చేస్తే అది అహంభావమా?

ఖమ్మం జిల్లా పాలేరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రామిరెడ్డి వెంకట రెడ్డి మృతి కారణంగా జరుగుతున్న ఉపఎన్నికలలో తెరాస అభ్యర్ధిగా మంత్రి తుమ్మల నాగేశ్వర రావుని నిలపడంపై కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీనియర్ రాజకీయ నేత వెంకట రెడ్డి మృతి కారణంగా జరుగుతున్న ఈ ఉపఎన్నికలలో ఆయన భార్య సుచరితా రెడ్డి పోటీ చేస్తున్నప్పుడు, సంప్రదాయాన్ని మన్నించి ఆమె ఏకగ్రీవం ఎన్నికయ్యేందుకు సహకరించకుండా, తెరాస పోటీ చేయాలనుకోవడం అహంకారమేనని విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న తెరాసకు ఈ ఉపఎన్నికలలో పాలేరు ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పాలని కోరారు.

ఎవరయినా ఒక ఎమ్మెల్యే చనిపోయినప్పుడు అతని లేదా ఆమె కుటుంబ సభ్యులు పోటీ చేయదలచుకొంటే వారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు అన్ని పార్టీలు సహకరించడం కేవలం ఒక సంప్రదాయమే తప్ప రాజ్యాంగం నియమం కాదు. కనుక ఈ ఉపఎన్నికలలో తెరాస పోటీ చేయాలనుకోవడం ప్రజాస్వామ్యబద్ధమే అవుతుంది తప్ప అహంకారం కాదు. రాజకీయ పార్టీలు క్రమేణా తమ నైతిక విలువలను దిగజార్చుకొంటున్నప్పుడు ఇటువంటి ఆలోచనలను, పరిణామాలను కూడా అంగీకరించడం నేర్చుకోవలసి ఉంటుంది.

ఈ ఉపఎన్నికలలో సానుభూతి ఓటు కాంగ్రెస్ పార్టీకి సానుకూల అంశంగా ఉంటుంది కనుక దానిని వినియోగించుకొని ఈ సీటుని మళ్ళీ దక్కించుకోగలిగినట్లయితే అధిష్టానం ముందు మెప్పు పొందవచ్చు అలాగే రాష్ట్రంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ హవా మొదలయిందని గొప్పలు చెప్పుకోవచ్చు. అందుకే అంత తహతహలాడుతోంది కానీ విజయపడంలో దూసులుపోతున్న తెరాసను డ్డీకొని గెలవగలమోలేదోననే భయం కూడా ఉన్నందునే అన్ని పార్టీల మద్దతు కోరుతోంది. నిజానికి ఈ ఉపఎన్నికలలో తెరాస పోటీ చేయకూడదు అని కోరుకొనే బదులు, దానిని డ్డీ కొని గెలిచి చూపిస్తే కాంగ్రెస్ పార్టీ బలం అందరికీ చాటుకొనే అవకాశం ఉంటుంది. అందుకోసం కాంగ్రెస్ పార్టీ సానుభూతి ఓట్లను పిండుకొని, ప్రతిపక్ష పార్టీల మద్దతు స్వీకరించినా పరువాలేదు కానీ గెలిచి చూపించాలి. గాలికి పోయే పేలాలు కృష్ణార్పణం అన్నట్లుగా ఈ ఉపఎన్నికలలో వైకాపా పోటీ చేసినా ఎలాగు గెలవలేమని గ్రహించడంతో తెలివిగా నైతిక విలువలను పాటిస్తూ కాంగ్రెస్ అభ్యర్ధికి పూర్తి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించేసింది. మరి తెదేపా కూడా ఆ పేలాల ఆప్షన్ ఉపయోగించుకొంటే సేఫ్ గా ఎస్కేప్ అయిపోవచ్చు లేకుంటే ఈసారి ఓడిపోతే దానికి తెలంగాణాలో ప్రజలు మంగళహారతి ఇచ్చేసారని ప్రచారం మొదలవవచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close