గ్రేటర్ కాంగ్రెస్ లో నయా జోష్ !

సార్వత్రిక ఎన్నికల్లో దారుణంగా దెబ్బతిన్న కాంగ్రెస్ పార్టీ, గత వైభవాన్ని సొంతం చేసుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తుంది. నిరుటి ఎన్నికల్లో నగర పరిధిలో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ గెలవలేదు. దీంతో గ్రేటర్ ఎన్నికల్లో పార్టీ పరస్థితి ఎలా ఉంటుందోనని నాయకులు, కార్యకర్తలు కొంత కాలంగా సందిగ్ధంలో పడ్డారు. అయితే, సీమాంధ్రుల ఓట్ల తొలగింపుపై మర్రి శశిధర్ రెడ్డి చేసిన పోరాటం కాంగ్రెస్ కు కొంత వరకూ కొత్త ఇమేజి తెచ్చింది. ఆయన చొరవ వల్లే ఈసీ అధికారులు విచారణకు వచ్చారు. పెద్ద సంఖ్యలో ఓట్ల తొలగింపు ఆగిందంటే అందుకు కాంగ్రెస్ నాయకుడి ప్రయత్నమే కారణమంటూ ఇప్పుడు ఆ పార్టీ కేడర్ చెప్పుకుంటోంది.

ఎన్నికల ప్రక్రియను కుదించడం, రిజర్వేషన్ల వెల్లడి జాప్యం చేయడం, ప్రతిపక్షాలకు ప్రచారానికి సమయం ఇవ్వకుండా చేయడానికి ప్రయత్నించడం ద్వారా తెరాస ప్రభుత్వం అక్రమాలకు పాల్పడుతోందని కాంగ్రెస్ పార్టీ గట్టిగా ప్రతిఘటించింది. ప్రకటనలకే పరిమితం కాకుండా శశిధర్ రెడ్డి న్యాయ పోరాటానికి సిద్ధపడ్డారు. ఆయన చొరవ వల్లే ఈ అంశం హైకోర్టు వరకూ వెళ్లింది. ప్రక్రియ కుదింపుపై స్టే వచ్చింది. ప్రజాస్వామ్య బద్ధంగా, నిబంధనల ప్రకారం ఎన్నికల నిర్వహణకు కోర్టు ఆదేశించింది. ఇది తమకు పెద్ద విజయమని కాంగ్రెస్ వారు గొప్పగా చెప్పుకుంటున్నారు.

గత ఏడాది ఎన్నికల తర్వాత నగరంలో పార్టీకి కొత్త ఉత్తేజం తేవడానికి గట్టి ప్రయత్నం పెద్దగా జరగలేదు. అసలు గ్రేటర్ అధ్యక్షుడే పార్టీలో ఉంటారో, తెరాసలో చేరుతారో అనే చర్చ జరిగింది. దానం నాగేండర్ కారు ఎక్కబోతున్నారని చాలా సార్లు ప్రచారం జరిగింది. రకరకాల ఊహాగానాలు వచ్చాయి. తెరాస మంత్రులతో కూడా ఆయన భేటీ అయ్యారని వదంతులు వచ్చాయి. దానం మాత్రం మొదటి నుంచీ తాను కాంగ్రెస్ లోనే ఉంటానని స్పష్టం చేస్తున్నారు. గిట్టని వారు పుట్టించే వదంతులు నమ్మ వద్దని పదే పదే స్పష్టం చేశారు. అయినా, ఒక మైండ్ గేములో భాగంగా ప్రత్యర్థులు ఈ ప్రచారం చేశారని దానం వర్గీయులు భావిస్తున్నారు. ఆయన సిసలైన కాంగ్రెస్ వాది అని అనుచరులు బల్లగుద్ది చెప్తున్నారు. అన్నట్టే ఆయన పార్టీ బలోపేతానికి ప్రస్తుతం ప్రయత్నాల్లో ఉన్నారు.

అయితే, శశిధర్ రెడ్డి పోరాటం కాంగ్రెస్ కు నూతనోత్తేజం ఇచ్చిందని ఆ పార్టీ రాష్ట్ర స్థాయి నాయకులు కూడా భావిస్తున్నారు. విద్యావంతులైన ఓటర్లను ఆలోచింపచేసే ఈ పరిణామాం మేలు చేస్తుందంటున్నారు. పైగా ఈ పోరాటం ద్వారా సీమాంధ్రుల మనసు గెల్చుకున్నామని వారు అంచనా వేస్తున్నారు. ఓట్ల తొలగింపుపై చేసిన పోరాటం వల్ల సీమాంధ్ర ఓట్లలో చాలా వరకు హస్తం గుర్తుకే పడతాయనేది కాంగ్రెస్ వారి ఆశ.

ఓట్లు, సీట్లు ఎన్ని వస్తాయనేది పక్కనబెడితే, కొత్త జోష్ మాత్రం వచ్చిందని కాంగ్రెస్ వారు సంబరపడుతున్నారు. గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ కోసం పోటీ కూడా బాగానే ఉంది. గట్టిగా కష్టపడితే మంచి ఫలితాలు సాధించ వచ్చనే కాంగ్రెస్ నేతల అంచనాలు నిజమవుతాయో లేదో చూద్దాం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...
video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

ప్రియదర్శి తాటతీసే ‘డార్లింగ్’

హనుమాన్ విజయం తర్వాత నిర్మాత నిరంజన్ రెడ్డి కొత్త సినిమా ఖరారు చేశారు. ప్రియదర్శి హీరోగా ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి డార్లింగ్ అనే టైటిల్ పెట్టారు. అశ్విన్ రామ్ దర్శకుడు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close