దుబ్బాకలో చెమటోడుస్తున్న కాంగ్రెస్ సీనియర్లు..!

కాంగ్రెస్ సీనియర్లలో ఐక్యత లేదు కానీ… దుబ్బాకలో మాత్రం ఎవరికి వారు కష్టపడి.. తమ ప్రతాపం చూపించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అగ్రనేతలంతా తలా ఓ మండలం బాధ్యత తీసుకోవడంతో.. ఆయా మండలాల్లో మెజార్టీ తెప్పించాల్సిన అవసరం ఏర్పడింది. దీంతో వారంతా.. శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం పీసీసీ అధ్యక్ష రేస్ నడుస్తోంది. ఈ రేసులో నెగ్గాలంటే… కొత్తగా తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జ్ అయిన మాణిగం ఠాకూర్‌ని మెప్పించాలి. ఆయనను మెప్పించాలంటే.. పొగడ్తలతో కావడంలేదు. పనితీరుతోనే సాధ్యం. ఆ విషయం ఇప్పటికే సీనియర్లకు స్పష్టమయింది. అందుకే.. దుబ్బాకలో చెమటోడుస్తున్నారు.

గత ఉప ఎన్నికల్లో ఎవరూ పెద్దగా బాధ్యతలు తీసుకునేవారు కాదు. కానీ దుబ్బాకలో మాత్రం సీన్ మారిపోయింది. మాణిగం ఠాగూర్ స్వయంగా ఎన్నకిల ప్రచారంలో పాల్గొంటున్నారు. రేవంత్ రెడ్డికి మిర్దొడ్డి మండల బాధ్యతలు అప్పగించారు. ఆ మండలం టీఆర్ఎస్‌కు కంచుకోటల లాంటిది.. అయినప్పటికీ.. రేవంత్ నిరాశపడలేదు. తన టీమ్‌ను తెప్పించుకుని వ్యూహాలు పన్నుతున్నారు. శరవేగంగాప్రచారం చేస్తున్నారు. టీఆర్ఎస్ కన్నా ఒక్క ఓటు అయినా మెజార్టీ తేవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇక అభ్యర్థిని తన చాయిస్‌గా ఎంపిక చేసి టిక్కెట్ ఇప్పించుకున్న మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ తొగుట మండల బాధ్యత తీసుకున్నారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి దొల్తాబాద్ మండలంలో ప్రచారం చేస్తున్నారు. అధికార పార్టీ కంటే 100 ఓట్లు ఎక్కువే తెస్తా అని శపధం చేశారు.

ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా దుబ్బాక మండల బాధ్యతలు తీసుకున్నారు. నలుగురూ ఇప్పుడూ… పోటీ పడుతున్నారు. ఎవరికి వారు తమ మండలంలో మెజార్టీ తీసుకు వచ్చి… పీసీసీ రేసులో ముందుండాలని అనుకుంటున్నారు. ఎవరు మెజార్టీ సాధిస్తారో.. ఎవరికి అందలందక్కుతుందో.. ఎన్నికల ఫలితాల తర్వాతే తేలే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏడు మండలాలు కాదు. ఐదు గ్రామాలే అంటున్న కాంగ్రెస్ !

కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోల ఐదు గ్రామాల ప్రస్తావన తీసుకు వచ్చింది. ఏపీలోని ఐదు గ్రామాలను తెలంగాణలో కలుపుతామని ప్రకటించింది. దీంతో కొత్త వివాదం ప్రారంభమయింది. ఇది ఓ రకంగా గట్టు తగాదా...

నిరాసక్తంగా జగన్ ప్రచారం – ఆశలు వదిలేసుకున్నట్లే !

ఏపీ సీఎం జగన్ ప్రచారానికి కూడా పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. రెండు, మూడు రోజులకో సారి తాడేపల్లి ప్యాలెస్ కు పరిమితమవుతున్నారు. ప్రచార సభల్ని పరిమితం చేసుకుంటున్నారు. ఎన్నికల షెడ్యూల్...

ఒంగోలు లోక్‌సభ రివ్యూ : డబ్బుతొ గెలిచేస్తానని చెవిరెడ్డి లెక్కలు

ఒంగోలు ఎంపీ సీటు హాట్ కేకులా మారింది. ఆగర్భ శ్రీమంతుడైన మాగుంట శ్రీనివాసులరెడ్డి టీడీపీ తరపున పోటీ చేస్తూండగా.. ఎన్నికల అఫిడవిట్‌లోనూ పెద్దగా ఆస్తులు,. ఆదాయం చూపించలేని చెవిరెడ్డి భాస్కర్...

మహబూబ్‌నగర్‌లో కాంగ్రెస్‌ను ఓడిస్తే రేవంత్ ను ఓడించినట్లే !

తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో విపక్షాల రాజకీయం రేవంత్ రెడ్డి చుట్టూ తిరుగుతోంది. ఆయనను దెబ్బకొట్టాలని చాలా ప్రయత్నం చేస్తున్నారు. సొంత నియోజకవర్గం అయిన మహబూబ్ నగర్ లోక్ సభలో ఓడిస్తే ఆయనకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close