రాష్ట్రపతికీ గౌరవం ఇవ్వకపోతే ఇంకెవరికి ఇస్తారు?

పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు మొదలయ్యే ముందు ఆనవాయితీ ప్రకారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఉభయసభల సభ్యులను ఉద్దేశ్యించి చేసిన ప్రసంగంలో సభ్యులు అందరూ ప్రజలు తమకు అప్పగించిన బాధ్యతలను గుర్తుంచుకొని ఈ పార్లమెంటు సమావేశాలలో ప్రజా సమస్యలపై అర్ధవంతమయిన చర్చలు జరిగేందుకు సహకరించాలని కోరారు. కానీ ఆయన సూచించిన ఆ సలహా కాంగ్రెస్, దాని మిత్రపక్షాల చెవులకి చేరినట్లు లేదు.

ఆయన తన ప్రసంగం ముగించిన మరు క్షణమే కాంగ్రెస్ పార్టీ ఎంపిలో స్పీకర్ వద్దకు దూసుకువచ్చి ఆయన ప్రసంగాన్ని తప్పుపడుతూ నినాదాలు చేయడం మొదలుపెట్టారు. ఆయన ప్రసంగం తమకు చాలా నిరాశ కలిగించిందని, అందులో ప్రజలను ఆకట్టుకొనే నినాదాలు తప్ప బొత్తిగా పస లేదని కాంగ్రెస్ ఎంపి రాజీవ్ శుక్లా అన్నారు. స్పీకర్ పోడియం వద్దకు దూసుకువచ్చిన మరొక కాంగ్రెస్ పార్టీ ఎంపి అశ్విని కుమార్ “ప్రభుత్వానికి ఒక దశదిశ లేదని రాష్ట్రపతి ప్రసంగంలో స్పష్టమయింది. ఏ మాత్రం ఆసక్తి కలిగించని, పసలేని ప్రసంగం అది,” అని అన్నారు. వారితో ఇంకా చాలా మంది కాంగ్రెస్ పార్టీ సభ్యులు జతకలిసి నినాదాలు చేస్తూ సభలో నానా రభస చేసారు.

నిజానికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తే. ఆయన కాంగ్రెస్ పార్టీ ద్వారానే ఆ స్థాయికి ఎదగగలిగారు. తను ఆ స్థాయికి ఎదిగేందుకు కాంగ్రెస్ పార్టీయే కారణం కనుక ఆయనకు పార్టీ పట్ల చాలా అభిమానం, గౌరవం ఉన్నాయి. అలాగే అయన కాంగ్రెస్ పార్టీలో, యూపీఏ ప్రభుత్వం ఎన్ని ఉన్నత పదవులలో పనిచేసినప్పటికీ పార్టీలో అందరితోను చాలా గౌరవంగా, చాలా స్నేహపూర్వకంగా మెలిగేవారు. కనుక కాంగ్రెస్ పార్టీలో అందరూ ఆయనని చాలా గౌరవిస్తారు. కానీ ఆయన ఆనవాయితీ ప్రకారం తన క్రింద పనిచేస్తున్న ప్రభుత్వం తరపున పార్లమెంటులో ప్రసంగించితే దానినీ కాంగ్రెస్ పార్టీ సభ్యులు తప్పు పడుతున్నారు. ఆయనని సభలో గౌరవించలేకపోయారు.

కాంగ్రెస్ పార్టీకి మోడీ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంటే ఉండవచ్చును. కానీ ఆ కారణంగా రాష్ట్రపతి పట్ల అవమానకరంగా ప్రవర్తించనవసరం లేదు. ఆయన ప్రసంగాన్ని తప్పుపడుతూ సభలో ఆయన ముందే అసభ్యంగా మాట్లాదనవసరం లేదు. సభ నుండి ఆయన వెళ్లిపోయిన తరువాత, ఆయన ప్రసంగంతో తాము ఏకీభవించడం లేదని ఒకే ఒక ముక్క చెపితే సరిపోయేది. అందరికీ గౌరవంగా ఉండేది. కానీ మోడీ ప్రభుత్వాన్ని వ్యతిరేకించడమే పనిగా పెట్టుకొన్న కాంగ్రెస్ పార్టీ, ప్రణబ్ ముఖర్జీ తమతో కలిసి నాలుగు దశాబ్దాల సుదీర్గ కాలం పనిచేసారనే సంగతిని, ప్రస్తుతం ఆయన రాష్ట్రపతిగా మాట్లాడుతున్నారనే కనీస గౌరవం కూడా కనబరచకుండా ఆయన పట్ల చాలా అనుచితంగా ప్రవర్తించారు. రాష్ట్రపతికి కూడా గౌరవించలేని కాంగ్రెస్ నేతలు ఇంకెవరిని గౌరవించగలరు?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close