ఆ చిన్నమాటతో కాంగ్రెస్ పార్టీని బ్రతికించారు

చిరంజీవి తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు కూడా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని చెప్పి, తాను బీజేపీలో చేరబోతున్నారనే పుకార్లకు ఈరోజు ముగింపు పలికారు. అందుకు మిగిలిన అందరి కంటే కాంగ్రెస్ పార్టీయే ఎక్కువ సంతోషించి ఉంటుంది. ఎందుకంటే సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినప్పటి నుండి అయన పార్టీ వ్యవహారాలకి దూరంగా ఉంటూ తన 150వ సినిమాపైనే ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారు. ఈ మధ్య కాలంలో రాష్ట్రంలో పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోతున్నా కూడా ఆయన అసలు పట్టించుకోలేదు. పార్టీని కాపాడుకోవాలనే ప్రయత్నాలు చేయలేదు. ఆయన నోటితో చెప్పకపోయినా పార్టీలో కొనసాగడం ఇష్టం లేనట్లే వ్యవహరిస్తున్నారు. పైగా ఈ మధ్య కాలంలో ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ కి మళ్ళీ దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నట్లు కనబడుతుండటంతో మీడియాలో ఊహాగానాలు మొదలయ్యాయి. కానీ ఇవ్వాళ్ళ ఆయన వాటికి ముగింపు పలుకుతూ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని స్పష్టంగా చెప్పడంతో కాంగ్రెస్ పార్టీకి ఏనుగంత బలం వచ్చినట్లయింది.

ఆయన ప్రస్తుతం పార్టీ కోసం పనిచేయకపోయినా పార్టీలోనే ఉంటారనే నమ్మకం, దైర్యం కలిగించారు కనుక ప్రస్తుతానికి కాపు కులస్థులను ఆకట్టుకోవడానికి ఇక తెదేపా, వైకాపాలతో కాంగ్రెస్ పార్టీ పోటీ పడనవసరం లేదు. అలాగే ఆయన అభిమానులు కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటారనే నమ్మకం ఏర్పడింది. వచ్చే ఎన్నికల వరకు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏవిధంగా తయారవుతుందో ఇప్పుడే చెప్పడం కష్టం కానీ చిరంజీవి మళ్ళీ సినిమాలలో ప్రజలను ఆకట్టుకొని తన ‘మెగాస్టార్’ పేరుని మళ్ళీ నిలబెట్టుకోగలిగితే అది కాంగ్రెస్ పార్టీకి కొంత వరకు ఉపయోగపడవచ్చును. అయితే వచ్చే ఎన్నికల సమయం నాటికి కూడా రాష్ట్రంలో, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇలాగే ఉన్నట్లయితే చిరంజీవి తన మాటపై నిలబడతారో లేదో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎక్స్ క్లూజీవ్‌: బెల్లంకొండ రూ.50 కోట్ల సినిమా

బెల్లంకొండ శ్రీ‌నివాస్ ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్నాడు. త‌ను హీరోగా చేస్తున్న `టైస‌న్ నాయుడు` సెట్స్‌పై ఉంది. 'చావు క‌బురు చ‌ల్ల‌గా' ద‌ర్శ‌కుడితో 'కిష్కింద పురి' అనే ఓ సినిమా చేస్తున్నాడు....

ప‌వ‌న్ కోసం మెగా హీరోలు వ‌స్తారా?

ప‌వ‌న్ క‌ల్యాణ్ పిఠాపురం నుంచి ఎం.ఎల్‌.ఏగా పోటీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈసారి ప‌వ‌న్‌ని ఎలాగైనా ఏపీ అసెంబ్లీలో చూడాల‌న్న‌ది మెగా అభిమానుల ఆశ‌. జ‌న‌సైనికులు కూడా బాగా క‌ష్ట‌ప‌డుతున్నారు. ప‌వ‌న్‌కు క‌నీసం...

‘రత్నం’ రివ్యూ: అంతా ర‌క్త‌సిక్తం

Rathnam Movie Telugu Review తెలుగు360 రేటింగ్ : 2/5 -అన్వ‌ర్‌ విశాల్ కు పేరు తీసుకొచ్చినవి యాక్షన్ సినిమాలే. యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరు... దర్శకుడు హరి. ఈ ఇద్దరూ కలసి ఇప్పటికే రెండు సినిమాలు...

జగన్ తండ్రిని కూడా వదల్లేదా..? షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అసలు రాజకీయం ఇప్పుడు స్టార్ట్ చేశారు.వైఎస్సార్ కు వారసురాలు జగన్ రెడ్డి కాదని బలంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నది తను...

HOT NEWS

css.php
[X] Close
[X] Close