కోర్టుల ద్వారానే కేసీఆర్ అవినీతిపై విచారణ..!?

తెలంగాణ సీఎం కేసీఆర్ అవినీతిపై కోర్టుల్లో పిటిషన్లు వేయడమే తదుపరి వ్యూహంగా భారతీయ జనతా పార్టీ ముందుకెళ్తోంది. ఈ అంశాన్ని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్.. ఢిల్లీలో మీడియ ప్రతినిధులకు నేరుగానే చెప్పారు. కేసీఆర్‌ అవినీతి చిట్టా తమ చేతిలో ఉందని అన్ని ఆధారాలతో తాము కోర్టుల్లో పిటిషన్లు వేస్తామని చెబుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేల అక్రమాలు, అవినీతిని బయటపెడతామని ప్రకటించారు. కొద్ది రోజుల నుంచి కేసీఆర్ అవినీతిపై కేంద్రం కూడా ఆరా తీస్తోందన్న ప్రచారం జరుగుతోంది. ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా పోటీ చేసే వారికి టీఆర్ఎస్ ఆర్థిక సాయం చేస్తోందన్న ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి.

తెలంగాణలో చేపట్టిన భారీ ప్రాజెక్టులు.. చేసిన ఖర్చుపై గతంలో కేంద్రం వివరాలు కోరింది. వాస్తవానికి బీజేపీ వ్యూహం కూడా.. తమకు ఎదురు తిరిగే నేతలపై అవినీతి ఇతర కేసులతో కట్టడి చేస్తుంది. అది బీహార్ లో లాలూ దగ్గర్నుంచి తమిళనాడులో శశికళ వరకూ అదే జరుగుతోంది. అదే సమయంలో బీజేపీతో సన్నిహితంగా ఉంటారనుకున్న నేతలపై పెద్ద పెద్ద కేసులున్నా.. పెద్దగా కదలిక ఉండటం లేదు. నిన్నామొన్నటి వరకూ తెలంగాణ సీఎం కేసీార్.. కేంద్ర పెద్దలతో సన్నిహితంగానే ఉన్నారు. ఇటీవలి కాలంలోనే ఆయన బీజేపీని బద్మాష్ అంటున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పోరాటం చేస్తున్నాననంటున్నారు. ఇప్పుడు… బీజేపీ.. అవినీతి అంశాన్ని హైలెట్ చేస్తోంది.

నేరుగా కేంద్రం.. విచారణకు ఆదేశిస్తే.. దాన్ని రాజకీయం అంటారు కాబట్టి.. కోర్టుల ద్వారానే… కేసీఆర్ పైవిచారణ ప్రారంభిస్తే.. కక్ష సాధింపులు.. కుట్ర అనే వాటికి అవకాశం ఉండదని అంటున్నారు. మొత్తానికి ముందు ముందు తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కోర్టుల్లో పిటిషన్ల పరీక్ష ఎదురయ్యే అవకాశం ఎక్కువగానే కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close