ఏపీ సచివాలయంలో పది మందికి వైరస్..!

ఆంధ్రప్రదేశ్ సచివాలయం కరోనా గుప్పిట్లో చిక్కుకుంది. ఆంధ్రప్రదేశ్ సీఎం పేషీలో పని చేసే ఓ అధికారి డ్రైవర్‌కు కూడా కరోనా నిర్ధారణ అయింది. మొత్తంగా ఇప్పటి వరకూ పది మంది సచివాలయ ఉద్యోగులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. నిన్న ఒక్కరోజే.. ఐదుగురికి వైరస్ సోకినట్లుగా తేలింది. ప్రధానమైన విభాగాల్లో పని చేసేవారు కావడంతో.. ఉద్యోగులు టెన్షన్‌కు గురవుతున్నారు. ఇప్పటి వరకూ పది మంది ఉద్యోగులకు పాజిటివ్ వచ్చింది. లాక్‌డౌన్ 4.0 నుంచి.. ప్రభుత్వ కార్యాలయాల్లో వంద శాతం హాజరు ఉండాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. వర్క్ ఫ్రం హోం వెసులుబాటు ఉన్న వారు కూడా.. ఆఫీసులకు రావాలని హెచ్‌వోడీలు ఆదేశాలిచ్చారు.

హైదరాబాద్‌లో ఇరుక్కుపోయిన ఉద్యోగులకు.. తెలంగాణ సర్కార్ పర్మిషన్ తీసుకుని ప్రత్యేకంగా బస్సులు వేశారు. ఇలా హైదరాబాద్ నుంచి వచ్చిన వారిలో ఐదుగురికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. వారి ద్వారా వచ్చిందో.. మరో విధంగా సోకిందో కానీ.. మరో ఐదు మందికి లెక్క తేలింది. ఇప్పటికే తమ శాఖలోని ఉద్యోగులకు కరోనా పాజిటివ్ రావడంతో.. వ్యవసాయశాఖ ఉన్నతాధికారి పూనం మాలకొండయ్య.. తమ శాఖ ఉద్యోగులకు రెండు వారాల పాటు వర్క్ ఫ్రం హోం ప్రకటించారు. ఇప్పటికిప్పుడు… సచివాలాయాన్ని శానిటైజ్ చేసి.. మళ్లీ విధి నిర్వహణకు సిద్ధం చేస్తున్నారు.

మరికొంత మంది ఉద్యోగుల టెస్టుల వివరాలు రావాల్సి ఉంది. ఇదే విధంగా కరోనా కేసులు పెరిగితే… సచివాలయాన్ని కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించాల్సి వస్తుందన్న ఆందోళన అధికారవర్గాల్లో వ్యక్తమవుతోంది. అయితే ఐసీఎంఆర్ నిబంధనల సడలింపు ఇవ్వడంతో.. సచివాలయం మూసివేయడం లాంటివేమీ ఉండవని అంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కోమ‌టిరెడ్డిలో మ‌రో కోణం… కొడుకు పేరుతో సేవ!

నిత్యం ఆరోప‌ణ‌లు, ప్ర‌త్యారోప‌ణ‌లు... వేలాది మంది కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు.. హ‌డావిడి. వైఎస్ హాయం నుండి వేగంగా ఎదిగిన మంత్రి కోమటిరెడ్డి, సేవా కార్య‌క్ర‌మాల్లోనూ నేనున్నా అని అండ‌గా ఉంటారు. ముఖ్యంగా కోమ‌టిరెడ్డి కుమార్...

పెద్దపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా వెంకటేష్ నేత..?

తెలంగాణలో డబుల్ డిజిట్ స్థానాలపై కన్నేసిన బీజేపీ ప్రచారంలో వెనకబడిన అభ్యర్థులను మార్చాలని నిర్ణయం తీసుకోనుందా..? సర్వేలతో ఎప్పటికప్పుడు రాష్ట్రంలో పరిస్థితిని తెలుసుకుంటున్న జాతీయ నాయకత్వం పెద్దపల్లి లోక్ సభ అభ్యర్థిని మార్చనుందా..?...

మూడు రోజులు బయటకు రాకండి… వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..!

తెలుగు రాష్ట్రాల్లో భానుడు ఉగ్రరూపం ప్రదర్శిస్తున్నాడు. రానున్న మరో మూడు రోజులపాటు 3 నుంచి 5 డిగ్రీల సెంటిగ్రేడ్ ల అధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ...

నా కొడుకును ఉరి తీయండి… మాజీ ఎమ్మెల్యే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

తెలంగాణ‌లోనే సంచ‌ల‌నం సృష్టిస్తున్న బీఆర్ఎస్ నేత‌, మాజీ ఎమ్మెల్యే ష‌కీల్ కొడుకు హిట్ అండ్ ర‌న్ కేసుల‌పై ష‌కీల్ స్పందించారు. ఓ కేసులో బెయిల్ రాగానే మ‌రో కేసు తెర‌పైకి తీసుక‌రావ‌టం వెనుక...

HOT NEWS

css.php
[X] Close
[X] Close