జగన్‌కు గుదిబండ విజయసాయిరెడ్డేనట..!

వైఎస్ జగన్మోహన్ రెడ్డికి గుదిబండ ఎవరైనా ఉన్నారా అంటే.. అది విజయసాయిరెడ్డేనని తేల్చేశారు సీపీఐ సీనియర్ నేత నారాయణ. ఉన్నది ఉన్నట్లు.. మనసులో ఏదీ దాచుకోకుండా మాట్లాడే..రాజకీయ నేతల్లో సీపీఐ నారాయణకు ఓ ప్రత్యేకత ఉంది. ఇటీవలి కాలంలో ఆయన ఢిల్లీ కి పరిమితమయ్యారు. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో పెద్దగా కనిపించడం లేదు.. వినిపించడం లేదు. కానీ ఇప్పుడు పోలవరం విషయంలో జరుగుతున్న రగడపై… తనదైన మార్క్ లో స్పందించారు. పోలవరంపై నిధులను ఎలా ఆదా చేశారో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టును క్విడ్ ప్రోకో పాలసీ వెంటాడుతోందన్నారు. పోలవరం పనులు ఆగిపోవడంతో వడ్డీలు పెరిగి మళ్లీ అక్కడికే వస్తుందని తేల్చారు.

అవినీతి లేని పాలన, నీతి, నిజయితీ అంటూ.. ప్రభుత్వం ప్రతీ రోజూ సుభాషితాలు వల్లె వేస్తూండటంపైనా.. నారాయణ సెటైర్లు వేశారు. జగన్ ప్రభుత్వం అవినీతి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదన్నారు. విజయసాయిరెడ్డి ట్విట్టర్ చేస్తున్న వ్యాఖ్యలు, ఆయన తెర వెనుక చేస్తున్న పనులను ఉద్దేశించి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్‌ను ఎప్పటికైనా విజయసాయిరెడ్డే ముంచుతారన్నట్లుగా మాట్లాడారు. ఇప్పటికైనా కక్ష రాజకీయాలను పక్కన పెట్టి అభివృద్ధి చేయాలని సలహా ఇచ్చారు.

విజయసాయిరెడ్డి వ్యవహారంపై.. మొదటి నుంచి వైసీపీలో ఓ రకమైన అభిప్రాయం ఉంది. ఆయన జగన్ కు అత్యంత సన్నిహితుడు.. జగన్ ఆయనను తప్ప ఇంకెవర్నీ నమ్మరన్న అభిప్రాయం కూడా ఉంది. అందుకే.. బయటకు చెప్పుకోరు కానీ… జగన్మోహన్ రెడ్డి జైలుకెళ్లడానికి కారణం.. విజయసాయిరెడ్డేనని గుసగుసలు వినిపిస్తూ ఉంటాయి. ఈ క్రమంలో ఆయన ఇటీవలి కాలంలో చాలా సెల్ఫ్ గోల్స్ చేసుకుంటున్నారు. ఐటీ గ్రిడ్ కేసులో.. ఆయన వేసిన స్కెచ్.. ఈసీ దగ్గర రిజిస్టర్ చేసేశారు. ఉద్యోగాల గురించి గొడవ జరుగుతున్న సమయంలో… అన్నీ తమ కార్యకర్తలకే ఇప్పించుకున్నామని నేరుగా ప్రకటించారు. ఈ క్రమంంలోనే… విజయసాయిరెడ్డి మరోసారి జగన్ పుట్టి ముంచుతాడన్న అభిప్రాయంలో సీపీఐ నారాయణ ఈ వ్యాఖ్యలు చేశారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ధర్మారెడ్డి కోసం ఆలిండియా రూల్స్ మారిపోతాయ్ !

టీటీడీ ఈవో ధర్మారెడ్డికి మరోసారి డిప్యూటేషన్ పొడిగించారు. రిటైరయ్యే వరకూ అంటే జూన్ 30వ తేదీ వరకూ ఆయన డిప్యూటేషన్ లోనే ఉంటారు. ఇప్పటికే రెండు సార్లు...

పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థుల కోసం బీజేపీ, బీఆర్ఎస్ వెదుకులాట!

బీఆర్ఎస్ ను చుట్టుముడుతున్న సమస్యలు అన్నీ ఇన్నీ కావు. లోక్ సభ ఎన్నికలతో కిందా మీదా పడుతున్న సమయంలోనే మూడు ఉమ్మడి జిల్లాల్లో ప్రభావం చూపేలా మరో ఉపఎన్నిక వచ్చి పడింది....

ఎక్స్‌క్లూజీవ్‌: బెల్లంకొండ‌తో అనుప‌మ‌

అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ త‌న జోరు చూపిస్తోంది. టిల్లు స్క్వేర్‌తో హిట్టు కొట్టాక‌, ఆ ఉత్సాహం మ‌రింత‌గా పెరిగిపోయింది. వ‌రుస‌గా కొత్త సినిమాల‌పై సంత‌కాలు పెడుతోంది. తాజాగా బెల్లంకొండ శ్రీ‌నివాస్ తో జోడీ క‌ట్ట‌డానికి...

22మంది ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ లోకి హరీష్..!?

బీఆర్ఎస్ ట్రబుల్ షూటర్ హారీష్ రావు కాంగ్రెస్ లో చేరనున్నారా..? 20-22 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరనున్నారని ప్రచారం జరుగుతుండగా..ఆ ఎమ్మెల్యేల వెనక బీఆర్ఎస్ ముఖ్య నేత హరీష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close