నేరాంధ్రప్రదేశ్ : నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో రిపోర్ట్ !

ఆంధ్రప్రదేశ్‌లో నేరాల సంఖ్య పెరుగుతూ పోతోంది. ప్రభుత్వం శాంతి భద్రతలను కాపాడుతున్నామని చెబుతున్నప్పటికీ ఆ పరిస్థితులు ఎక్కడా కనిపించడం లేదు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం 2019తో పోలిస్తే 2020లో నేరాల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. ఏకంగా 63శాతం మేర పెరిగాయంటే మామూలు విషయం కాదు. జాతీయ స్థాయిలోనూ పెరిగాయి.అయితే ఆ సగటు 23 శాతం మాత్రమే ఉంది. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పనితీరుపై తీవ్రమైన విమర్శలు వస్తున్న సమయంలో ఈ నివేదిక వెలుగులోకి రావడం చర్చనీయాంశం అవుతోంది.

డబ్లింగ్ స్టేజ్‌కి నేరాలు !

2019లో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 1 లక్షా 45, 751 కేసులు నమోదయ్యాయి. వీటిలో ఐపీసీతో పాటు స్థానిక చట్టాల కింద నమోదైన కేసులు ఉన్నాయి. అదే 2020లో ఈ కేసుల సంఖ్య 2 లక్షల 38వేల 105కి చేరింది. అంటే దాదాపుగా ఒక్క ఏడాదిలోనే లక్ష కేసులు అదనంగా నమోదయ్యాయి. స్థానిక చట్టాలపై నమోదైన కేసులను తీసేసి.. ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ల కింద నమోదు చేసిన కేసులను చూసినా 58 శాతానికిపైగా కేసుల నమోదు ఉంది. ఇది దేశంలో అత్యధిక వృద్ధి. దేశంలో అత్యధిక నేరాలు జరుగుతున్న రాష్ట్రాల జాబితాలో 2019లో ఏపీ 12వ స్థానంలో ఉండేది. ఈ ఏడాది మూడు స్థానాలు పెరిగి 9వ స్థానానికి వచ్చింది. దేశంలో అతి పెద్ద రాష్ట్రాల్లో జరగనన్ని నేరాలు , ఘోరాలు ఏపీలో జరుగుతున్నాయని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వెల్లడించినట్లయింది.

ఏపీలో ఘోరం జరగని రోజంటూ ఉందా !?

ఆంధ్రప్రదేశ్‌లో ఘోరం జరగనిరోజు ఉండటం లేదు. చిన్నపిల్లలు, మహిళలు, రాజకీయ దాడులు, రాజకీయ కేసులు ఇలా ఏదో ఒక అంశంతో అలజడి రేగుతూనే ఉంది. వందల కొద్దీ కేసులు పెడుతూనే ఉంది. సంచలనం సృష్టించిన ఘటనల్లో బాధితులకు ప్రజాధనాన్నే పరిహారంగా ఇస్తున్న ప్రభుత్వం నిందితులకు శిక్షలు విధించడంలో మాత్రం ఆసక్తి చూపించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఏపీలో నేరాలు చేయాలన్న వారికి ధీమా దొరుకుతోందని ఆ ప రిస్థితికి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదికలే కారణమన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

ప్రభుత్వం, పోలీసుల వైఫల్యం వల్ల నేరగాళ్ల గుప్పిట్లోకి ప్రజలు !

పోలీసులు పూర్తిగా రాజకీయ పరమైన విధి నిర్వహణకు అంకితమైపోయారన్న ఆరోపణలు ఉన్నాయి. రాజకీయ పరమైన కేసులు పెట్టి ప్రతిపక్ష నేతలను అరెస్ట్ చేయడానికి తప్ప ఇక దేనికీ వారు పని చేయడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. సాక్షాత్తూ డీజీపీనే ప్రతిపక్షాలు అంటూ మాట్లాడటం వివాదాస్పదమయింది. కారణం ఏదైనా అటు పోలీసుల వైఫల్యమో.. ఇటు ప్రభుత్వ స్వార్థమో కానీ… ప్రజలు మాత్రం నేరగాళ్ల గుప్పిట్లో చిక్కుకున్నారని.. రాష్ట్రం నేరాంధ్రప్రదేశ్ అయిందన్న ఆరోపణలకు బలం చేకూర్చేలా ఈ నివేదిక ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇంటలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీ బదిలీ !

ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాను ఈసీ బదిలీ చేసింది. వెంటనే వీరిని రిలీవ్ చేయాలని ఆదేశించింది. వీరిద్దర్నీ ఎన్నికలకు సంబంధం లేని విధుల్లో నియమించాలని స్పష్టం...

ప్రతినిధి.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

నారా రోహిత్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా... 'ప్ర‌తినిధి 2'. జ‌ర్న‌లిస్ట్ మూర్తి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడి మార‌డం, ఎన్నిక‌ల సీజన్‌లో విడుద‌ల అవుతుండడం వ‌ల్ల ఈ సినిమాపై ఫోక‌స్ పెరిగింది....

అమితాబ్ బ‌చ్చన్ ‘హైటు’ పెంచిన నాగ అశ్విన్‌

స్టార్ డ‌మ్ లోనే కాదు, హైట్ లోనూ అమితాబ్ బ‌చ్చ‌న్‌ని కొట్టేవాళ్లే లేరు. బాలీవుడ్ స్టార్స్‌ల‌లో ఆయ‌న అత్యంత పొడ‌గ‌రి. ఆయ‌న ఎత్తు.. ఆర‌డుగుల రెండు అంగుళాల పైమాటే. అయితే... 'క‌ల్కి' కోసం...

సెంచరీకి చేరువలో చింతమనేనిపై కేసులు..!!

చింతమనేని ప్రభాకర్...మాస్ లీడర్. ఆయన ఆహార్యం కూడా అలాగే ఉంటుంది. ఎన్నికల్లో టీడీపీ తరఫున దెందులూరు నుంచి పోటీ చేస్తోన్న చింతమనేని ప్రభాకర్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close