అచ్చెన్నను క్షమించేసిన ప్రివిలేజ్ కమిటీ ! ?

అచ్చెన్నాయుడును అసెంబ్లీలోకి అడుగు పెట్టకుండా వేటు వేస్తారన్న ప్రచారం తేలిపోయింది. ప్రివిలేజ్ కమిటీ ముందు ఆయన వ్యక్తిగతంగా హాజరయ్యారు. స్పీకర్‌పై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని.. ఒక వేళ తన వ్యాఖ్యలతో ఎవరైనా బాధపడి ఉంటే వెనక్కి తీసుకుంటానని చెప్పారు. ఆ సమయంలో అచ్చెన్నాయుడు పేరుతో వచ్చిన ప్రెస్ నో‌ట్ విషయంలో ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే తాను దాన్ని రెడీ చేసి ఆఫీసులో ఉంచానని తనకు తెలియకుండానే బయటకు వచ్చిందని వివరణ ఇచ్చారు.

ఈ అంశంపై ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ కాకాణి గోవర్ధన్ రెడ్డి కూడా స్పందించారు. తాను చేసిన వ్యాఖ్యలను ఉప సంహరించుకుంటున్నానని అచ్చెన్నాయుడు వివరణ ఇచ్చారని తెలిపారు. తాను ప్రెస్‌నోట్ ఆఫీసులో పెడితే తన సంతకం లేకుండానే రిలీజ్ అయిందని చెప్పారన్నారు. పొరపాటు జరిగిందని అచ్చెన్నాయుడు విచారం వ్యక్తం చేశారని ఈ వివాదాన్ని తాను పొడిగించదల్చుకోలేదని.. తన వ్యాఖ్యలను ఉప సంహరించుకుంటున్నానని అచ్చెన్న చెప్పినందున వివరణను మిగిలిన సభ్యులకూ పంపుతామన్నారు.

సభ్యుల అభిప్రాయాల మేరకు అచ్చెన్నపై విషయాన్ని ఏం చేయాలనే దానిపై నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. వ్యక్తిగతంగా హాజరు కావడానికి గతంలో అచ్చెన్న నిరాకరించారు. అయితే ఈ సారి మాత్రం హాజరై వివాదానికి ముగింపునివ్వాలనుకోవడంతో సాఫీగాసమావేశం జరిగిపోయింది. సాధారణంగా అసెంబ్లీలో ఎలాంటి వివాదాలు వచ్చినా క్షమాపణ లేదా విచారం వ్యక్తం చేయడంతో ముగిసిపోతాయి. అచ్చెన్న వివాదం కూడా అలాగే ముగిసింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close