ఆ బోటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది పర్యాటక మంత్రేనా..?

దేవీపట్నం దగ్గర లాంచీ గల్లంతయిన ఘటనలో.. సంచలనాత్మక విషయాలు మెల్లగా బయటకు వస్తున్నాయి. అసలు ఐదు లక్షల క్యూసెక్కుల ప్రవాహం ఉన్నప్పటికీ.. ఆ బోటును గోదావరిలోకి ఎలా అనుమతించారన్నదానిపై ఇప్పటికీ సందేహం అలాగే ఉంది. అయితే.. లాంచీ సర్వీసును నడపవద్దని… స్థానిక ఎస్సై బోటు నిర్వాహకుల్ని హెచ్చరించారని… అయితే మంత్రి అవంతి శ్రీనివాస్ ఫోన్ చేయడంతో.. ఏం చేయలేక వెళ్లనిచ్చారని.. విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. మాజీ ఎంపీ హర్షకుమార్ ఇదే విషయాన్ని మీడియాకు వెల్లడించారు. ప్రమాదం జరిగిన బోటులో … 93 ఉన్నారని ఆయన అంటున్నారు. పర్యాటకుల సంఖ్యను కూడా తక్కువ చేసి చెబుతున్నారని.. బోటును బయటకు తీసే అవకాశం ఉన్నప్పటికీ.. ఉద్దేశపూర్వకంగానే… తీయడం లేదని హర్షకుమార్ సంచలన ఆరోపణలు చేస్తున్నారు.

నిన్నటిదాకా బోటు ఎక్కడ ఉందో తెలియదన్నట్లుగా అధికారులు చేసిన ప్రచారం తప్పని.. సోమవారమే.. కనిపెట్టారని… కానీ తెలియనట్లు నటించారని అంటున్నారు. ప్రమాదంపై విచారణకు సీనియర్ అధికారిని నియమించాలని హర్షకుమార్ డిమాండ్ చేస్తున్నారు. బోటు యజమాని కోడిగుడ్ల వెంకటరమణ విశాఖకు చెందిన వ్యక్తే. బోటు ప్రమాదం జరిగినప్పటి నుండి ఆయన పరారీలో ఉన్నారు. పట్టుకునే ప్రయత్నాలు సీరియస్ గా చేయలేదు. అదే సమయంలో… మంత్రి అవంతి శ్రీనివాస్… మొట్టమొదటగా.. ఈ ప్రమాదం గురించి తెలిసిన తరవాత చేసిన ఆరోపణ.. ఆ బోటుకు టీడీపీనే అనుమతి ఇచ్చిందని. ఎవరైనా … ముందుగా… బాధ్యతగల మంత్రిగా సహాయ చర్యల గురించి ఆలోచిస్తారు కానీ… మంత్రి మాత్రం.. టీడీపీ అనుమతి ఇచ్చిందని… తమ తప్పేం లేదని చెప్పుకునే ప్రయత్నం చేశారు.

తాను ఫోన్ చేయడం వల్లే బోటు కదిలిందనే విషయం బయటపడుతుందనే… అవంతి ఇలాంటి విమర్శలు చేశారని… టీడీపీ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బోటు ప్రమాదం ఘటనలో ఇప్పటికీ… అసలు తప్పెవరిదో ప్రభుత్వం తేల్చే ప్రయత్నం చేయలేదు. కమిటీలు.. మెజిస్టిరియల్ విచారణల ప్రకటనలు మాత్రం వచ్చాయి. కానీ బోటు యజమానిని కూడా అరెస్ట్ చేయలేకపోయారు. ఇప్పుడు.. మంత్రి అవంతి శ్రీనివాస్ పేరే బయటకు రావడంతో దీనిపై వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ప్రభుత్వానికి ఏర్పడింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close