తెలంగాణ నాయ‌కుల‌పై రాహుల్ కి న‌మ్మ‌కం లేదా..?

అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల‌తో తెలంగాణ కాంగ్రెస్ నేత‌ల మాట‌ల‌పై పార్టీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీకి న‌మ్మ‌కం పోయిందా..? అంటే, అవున‌నే అనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలో రాష్ట్ర నేత‌లు ఇచ్చిన ఫీడ్ బ్యాక్ మీదే ఆయ‌న ఆధార‌ప‌డ్డారు. రాష్ట్రంలో కేసీఆర్ స‌ర్కారుపై తీవ్ర వ్య‌తిరేక‌త ఉంద‌నీ, కాంగ్రెస్ గెలుపు న‌ల్లేరు మీద న‌డ‌కనీ… ఇలా చాలా నివేదిక‌లు పీసీసీ నుంచి ఏఐసీసీకి వెళ్లాయి. అంతేకాదు, అసెంబ్లీ నియోజ‌క వ‌ర్గాల అభ్య‌ర్థుల ఎంపికపై కూడా పీసీసీ అభిప్రాయాన్నే ప్రామాణికంగా తీసుకున్నారు రాహుల్‌. పీసీసీ త‌యారు చేసి పంపించిన అభ్య‌ర్థుల జాబితానే ప‌క్కాగా న‌మ్మి.. టిక్కెట్లు కేటాయించేశారు! అయితే, ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే… లోక్ స‌భ ఎన్నిక‌లకు వచ్చేసరికి తెలంగాణ అభ్య‌ర్థుల ఎంపిక‌లో రాహుల్ చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నార‌ట‌!

లోక్ స‌భ అభ్య‌ర్థుల ఎంపిక‌లో ఎలాంటి పొర‌పాట్ల‌కూ ఆస్కారం ఉండ‌కూడ‌ద‌ని రాహుల్ భావించారని, అందుకే ఆయ‌నే స్వ‌యంగా తెలంగాణ అభ్య‌ర్థుల ఎంపిక‌పై జాగ్ర‌త్తలు తీసుకున్నార‌ని స‌మాచారం. ముగ్గురు స‌భ్యుల‌తో ఒక ప్ర‌త్యేక క‌మిటీని రాహుల్ తెలంగాణ పంపించార‌ని స‌మాచారం. ఆ క‌మిటీ 17 లోక్ స‌భ నియోజ‌క వ‌ర్గాల్లో ప‌ర్య‌టించి, క్షేత్ర‌స్థాయిలో వాస్త‌వాల‌పై అధ్య‌య‌నం చేసి, పార్టీ తరఫున ఎవ‌రు అభ్య‌ర్థిగా ఉంటే మంచిద‌నే అభిప్రాయాన్ని ప్ర‌జ‌ల నుంచే తెలుసుకుంటుంద‌ని తెలుస్తోంది. ఆ నివేదిక ఆధారంగా రాహుల్ టీమ్ ఇప్ప‌టికే 17 మందితో ఒక జాబితాను త‌యారు చేసిన‌ట్టు సమాచారం.

ఈ జాబితా గురించి రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిటీకి తెలీద‌ని అంటున్నారు! రాష్ట్ర క‌మిటీ పంపిన నివేదిక‌ను ప‌క్క‌న‌పెట్టుకుని… రాహుల్ టీమ్ త‌యారు చేసిన నివేదిక‌లో పేర్ల‌ను పోల్చి చూసుకున్నాక‌నే అభ్య‌ర్థుల ఎంపిక జ‌రిగింద‌ని పార్టీ వ‌ర్గాల నుంచి ఇప్పుడు వినిపిస్తోంది. మొత్తానికి, తెలంగాణ రాష్ట్ర నేత‌లు ఇచ్చే నివేదిక‌ల మీద రాహుల్ ఈసారి ఆధార‌ప‌డ‌టం లేదు! మ‌రి, ఈ అంశాన్ని టి. కాంగ్రెస్ నాయ‌కులు ఎలా చూస్తారో చూడాలి! రాహుల్ సొంత నిర్ణయంగా దీన్ని తీసుకుంటారా, లేదా పనితీరు మార్చుకోవాల్సిన అవసరాన్ని రాహుల్ పరోక్షంగా బలంగా చెప్పారని నేతలు భావిస్తారా అనేది చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఢిల్లీకి చిరు.. రేపే ప‌ద్మ ప్ర‌దానం

మెగాస్టార్‌ చిరంజీవిని ఇటీవ‌ల ప‌ద్మ విభూష‌ణ్ పుర‌స్కారం వ‌రించిన సంగ‌తి తెలిసిందే. ఈ పుర‌స్కార ప్ర‌దానోత్స‌వం రేపు ఢిల్లీలో జ‌ర‌గ‌బోతోంది. ఈ సంద‌ర్భంగా చిరు ఢిల్లీ బ‌య‌ల్దేరారు. ఆయ‌న‌తో పాటుగా సురేఖ‌, రామ్...

విదేశాలకు వెళ్తా… కోర్టు అనుమతి కోరిన జగన్

విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ కోర్టును కోరారు ఏపీ సీఎం జగన్. లండన్ వెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వాలని కోరారు. ఈ నెల 17 నుంచి జూన్ 1 మధ్య విదేశాలకు వెళ్లేందుకు...

వైన్స్ బంద్… ఆ ఒక్క షాప్ మాత్రం ఓపెన్

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోరు తుది అంకానికి చేరుకుంది. మరో మూడు రోజుల్లో ప్రచార పర్వం ముగియనున్న నేపథ్యంలో రాష్ట్రమంతటా మద్యం దుకాణాలు రెండు రోజులపాటు మూతబడనున్నాయి. ఈ నెల 11న...

పోలింగ్ ముగిసిన తర్వాత ఫ్యామిలీతో విదేశాలకు జగన్

పోలింగ్ ముగిసిన వెంటనే విదేశీ పర్యటనకు వెళ్లాలని జగన్ నిర్ణయించుకున్నారు. పదమూడో తేదీన పోలింగ్ ముగుస్తుంది. ఆ తర్వాత లెక్కలు చూసుకుని పదిహేడో తేదీన విమానం ఎక్కాలనుకుంటున్నారు. ఈ మేరకు ఇప్పటికే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close