వివేకా మ‌ర‌ణంపై రాజ‌కీయం మొద‌లుపెట్టింది ఎవ‌రు..?

వైయ‌స్ వివేకానంద రెడ్డి మృతిపై రాజ‌కీయం మొద‌లైపోయింద‌నే అనాలి! మొద‌లుపెట్టింది కూడా సాక్షాత్తూ వైకాపా వారే! వివేకా మ‌ర‌ణంలో ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌, ఆదినారాయ‌ణ రెడ్డి, పులివెందుల టీడీపీ ఎమ్మెల్యే స‌తీష్ ల ప్ర‌మేయం ఉందంటూ వైయ‌స్ బావ‌మ‌రిది ర‌వీంద్ర‌నాథ్ రెడ్డి ఆరోపించారు. ఇక‌, ఎంపీ విజ‌య‌సాయి రెడ్డి అయితే మ‌రో అడుగు ముందుకు వేసి… వైయస్ రాజారెడ్డి మ‌ర‌ణం నుంచి ప్ర‌స్థావించ‌డం మొద‌లుపెడుతూ, టీడీపీ మీద అనుమానాలు రేకెత్తించే సంచలన ఆరోపణలు చేశారు.

విజ‌యసాయిరెడ్డి మాట్లాడుతూ… 1998 నుంచే వైయ‌స్సార్ కుటుంబాన్ని స‌మూలంగా లేకుండా చేసేందుకే టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు ప్ర‌య‌త్నిస్తున్నారంటూ తీవ్రంగా ఆరోపించారు! ఇప్పుడు జ‌రిగిన వివేకా హ‌త్య దాన్లో భాగమే అన్నారు. దీన్లో చాలా స్ప‌ష్టంగా సీఎం, లోకేష్‌, ఆదినారాయ‌ణ రెడ్డి పాత్ర ఉంద‌న్నారు. ఆదినారాయ‌ణ రెడ్డి రాజ‌కీయ భ‌విష్య‌త్తు దెబ్బ‌తింటుంద‌నే ఉద్దేశంతోనే ఇది చేయించార‌న్నారు. ఈ హ‌త్య‌పై ద‌ర్యాప్తున‌కు సిట్ వేశార‌నీ, దానిపై న‌మ్మ‌కం లేద‌నీ, సీబీఐ విచార‌ణ‌కు డిమాండ్ చేస్తామ‌న్నారు విజ‌య‌సాయి. తెలుగుదేశం పార్టీ హ‌త్యా రాజ‌కీయాల‌ను మాత్ర‌మే న‌మ్ముకుంద‌నీ, వైకాపా ఎప్పుడూ అలా వ్య‌వ‌హ‌రించ‌లేద‌న్నారు. రాజారెడ్డి మ‌ర‌ణం ఎన్నిక‌ల ముందే జ‌రిగింద‌నీ, వైయ‌స్సార్ మ‌ర‌ణం కూడా ఎన్నిక‌ల త‌రువాత జ‌రిగింద‌న్నారు. ఆయ‌న అందించే సుప‌రిపాల‌న‌, ప్ర‌జ‌లు చూపుతున్న ఆద‌ర‌ణ‌ని చూసి భ‌రించ‌లేక ఎలిమినేట్ చేయ‌డం జ‌రిగింద‌న్నారు! ఆ త‌రువాత‌, జ‌గ‌న్ పొందుతున్న ప్ర‌జాద‌ర‌ణ చూడలేక… విశాఖ విమానాశ్ర‌యంలో హ‌త్యాయ‌త్నం జ‌రిగింద‌న్నారు. వివేకానంద రెడ్డి కూడా నిత్యం ప్ర‌జ‌ల్లో ఉంటున్నారనీ, ఆయ‌న ఉంటే ఆదినారాయ‌ణ రెడ్డి రాజ‌కీయ మ‌నుగ‌డ‌కు ప్ర‌మాద‌మ‌ని ఆయ‌న్నీ ఎలిమినేట్ చేయ‌డం జ‌రిగింద‌న్నారు!

హ‌త్యా రాజ‌కీయాలు చేయ‌డం త‌మ‌కు అల‌వాటు లేదంటూనే ఇవ‌న్నీ మాట్లాడారు విజ‌య‌సాయిరెడ్డి! నాటి రాజారెడ్డి మ‌ర‌ణం నుంచి ఇప్ప‌టివ‌ర‌కూ జ‌రిగిన ఘ‌ట‌న‌ల‌న్నింటినీ టీడీపీ కుట్ర‌గానే ఆయ‌న ఆరోపించ‌డం విశేషం. వైయ‌స్సార్ ప్ర‌మాద‌వశాత్తూ మ‌ర‌ణిస్తే… దాన్ని కూడా కుట్ర అనేశారు! ఇక‌, జ‌గ‌న్ కోడి క‌త్తి కేసు ప్ర‌త్యేకంగా చెప్పాల్సిందే లేదు. దాని మీద ఎంత‌టి రాజ‌కీయ ల‌బ్ధికి ప్ర‌య‌త్నించారో ప్ర‌జ‌ల‌కు తెలుసు. ఇప్పుడు… వైయ‌స్ వివేకానంద రెడ్డి మ‌ర‌ణాన్ని కూడా అదే డైరెక్ష‌న్ లో చ‌ర్చ‌నీయాంశం చేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నారు విజ‌య‌సాయి. దీన్ని ఏ త‌ర‌హా రాజ‌కీయం అనాలి…?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close