మ‌నోజ్ ద‌గ్గ‌ర ఇంకా వీడియోలు ఉన్నాయా?

మంచు ఇంట్లో… అన్నాద‌మ్ముల గొడ‌వ‌తో కాక పుట్టిన సంగ‌తి తెలిసిందే. శుక్ర‌వారం మ‌నోజ్ ఓ వీడియో విడుద‌ల చేయ‌డంతో… విష్ణుతో త‌న‌కున్న విబేధాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. శుక్ర‌వారం అంతా ఇదే హాట్ టాపిక్‌. ఆ త‌ర‌వాత‌.. మ‌నోజ్ సోష‌ల్ మీడియాలో ఆ వీడియో డిలీట్ చేశాడు. మోహ‌న్‌బాబు కూడా వెంట‌నే రంగంలోకి దిగి డామేజ్ కంట్రోల్ చేయ‌డానికి ప్ర‌య‌త్నించారు. `అన్న‌ద‌మ్ముల మ‌ధ్య గొడ‌వ‌లు కామ‌న్‌` అని మంచు ల‌క్ష్మీ స‌ర్ది చెబుతోంది. అయితే.. మ‌నోజ్ ద‌గ్గ‌ర ఇంకొన్ని వీడియోలు ఉన్నాయ‌ని, త్వ‌ర‌లోనే వాటిని సైతం సోష‌ల్ మీడియాలో పెట్ట‌బోతున్నాడ‌న్న‌ది ఇన్ సైడ్ వ‌ర్గాల టాక్‌.

మంచు సోద‌రుల మ‌ధ్య విబేధాలు ఇప్ప‌టివి కావు. ఎప్ప‌టి నుంచో న‌డుస్తున్న‌వే. అవ‌న్నీ..నివురుగ‌ప్పిన నిప్పులా ఉండేవి. నిన్న ఒకేసారి భ‌గ్గుమ‌న్నాయి. మ‌నోజ్ విడుద‌ల చేసిన వీడియో ఇప్ప‌టిది కాద‌న్న‌ది స‌న్నిహిత వ‌ర్గాల మాట‌. ఇలాంటి వీడియోలు మ‌నోజ్ ద‌గ్గ‌ర చాలా ఉన్నాయ‌ట‌. వాటిని సైతం మ‌నోజ్ సోష‌ల్ మీడియాలో పెట్టేస్తాడేమో అన్న‌ది మంచు కుటుంబ స‌భ్యుల ఆందోళ‌న‌. మోహ‌న్ బాబు క్ర‌మ‌శిక్ష‌ణ‌కు ప్రాణం ఇచ్చే మ‌నిషి. అందుకే.. వెంట‌నే ఈ వ్య‌వ‌హారంపై స్పందించారు. విష్ణు, మ‌నోజ్‌ల‌తో ఆయ‌న మాట్లాడిన‌ట్టు, ఇక మీద‌ట ఎలాంటి ర‌చ్చ చేయ‌కుండా ఇద్ద‌రికీ న‌చ్చ చెప్పిన‌ట్టు టాక్‌. ఈ గొడ‌వ‌లు ఇక్క‌డితే ఆగిపోతే సంతోష‌మే. ఇంకాస్త ముదిరితే.. ఆ మిగిలిన వీడియోలు సైతం బ‌య‌ట‌కు వ‌స్తాయ‌ని ఇన్ సైడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏబీపీ సీఓటర్ సర్వే : బీఆర్ఎస్‌కు ఒక్కటే !

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి మంచి జోరు మీద ఉన్న కాంగ్రెస్ పార్టీకి లోక్ సభ ఎన్నికల్లో గట్టి పోటీ ఎదురయినప్పటికీ పది వరకూ లోక్ సభ సీట్లను గెల్చుకునే అవకాశం...

ఏబీపీ సీఓటర్ సర్వే : టీడీపీ కూటమికి 20, వైసీపీకి 5 లోక్‌సభ సీట్లు

ఎన్డీఏ కూటమి బలం రోజు రోజుకు పెరుగుతోంది. వైసీపీపై వ్యతిరేకత అంతకంతకూ పెరుగుతోందని సర్వేల వెల్లడిస్తున్నయి. అత్యంత ఖచ్చితంగా సర్వేలు, ఒపీనియన్ పోల్స్ వెల్లడిస్తుందని పేరున్న ఏబీపీ- సీఓటర్ ఎన్నికలకు ముందు నిర్వహించిన...

సునీత సాక్ష్యాలకు పాత ఆరోపణలే అవినాష్ రెడ్డి కౌంటర్ !

వివేకా హత్య కేసులో సునీత జస్టిస్ ఫర్ వివేకా పేరుతో పెడుతున్న ప్రెస్ మీట్లు వెల్లడిస్తున్న సంచనల విషయాలతో అవినాష్ రెడ్డికి మైండ్ బ్లాంక్ అవుతోంది. స్పందించకపోతే నిజం అని...

రాయి కేసు : లీకులిచ్చి జగన్ పరువు తీసిన పోలీసులు !

అనవసర డ్రామాలతో భద్రతా వైఫల్యమని పోలీసుల్ని చేతకాని వాళ్లుగా చేస్తున్నారని కోపం వచ్చిందేమో కానీ విజయవాడ పోలీసులు వైసీపీతో పాటు జగన్ పరువు తీసే లీకులు మీడియాకు ఇచ్చారు. జగన్ పై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close