తిరుమలలో కూడా గంజాయి – ఇదీ ఏపీ పరిస్థితి !

తిరుమలలో ఓ కాంట్రాక్ట్ ఉద్యోగి నుంచి గంజాయి స్వాధీనం చేసుకోవడం అక్కడ పెద్ద ఎత్తున దందా జరుగుతోందని పోలీసులు గుర్తించడంతో శ్రీవారి భక్తులు నివ్వెర పోతున్నారు. ఎంతో పవిత్రంగా ఉండాల్సిన తిరుమల కొండపై ఇలా గంజాయి దందా కూడా జరుగుతోందంటే.. పరిస్థితి ఎంత తీవ్రంగా మారిపోయిందోనని ఆందోళన చెందుతున్నారు. నిజానికి తిరుమలకు వెళ్లి వచ్చే ప్రతి భక్తుడు.. టీటీడీ నిర్వహణపై తీవ్ర విమర్శలు చేస్తూంటారు. కనీసం మంచి నీళ్లు కూడా దొరకని పరిస్థితికి తెచ్చారని మండిపడుతూ ఉంటారు.

ఇక ఎప్పుడూ సామాన్య భక్తులకు ప్రాధాన్యం అని ప్రకటిస్తూంటారు. కానీ రద్దీ లేకపోయినా కంపార్టుమెంట్లలో గంటల తరబడి వెయిట్ చేయిస్తూంటారు. కంపార్లుమెంట్లలో నీళ్లు కూడా ఇవ్వరు కానీ.. బయట వ్యక్తులు వచ్చి ప్రైవేటు వ్యాపారాలు.. తినుబండారాలు అమ్ముతూ ఉంటారు. అత్యంత దారుణంగా టీటీడీ నిర్వహణ ఉందని.. విజిలెన్స్ నిస్సహాయం అయిపోయిందని విమర్శలు వస్తున్న సమయంలో గంజాయి దందా గురించి బయటపడింది.

రాష్ట్రం మొత్తం గంజాయి దందా ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే తిరుమలకూ వస్తుందని ఎవరూ అనుకోలేదు. ఇతర రాష్ట్రాల్లో కంటెయినర్లలో పట్టుబడుతున్న గంజాయి ఏపీ నుంచే రవాణా అవుతోంది. ఇతర రాష్ట్రాల్లో పట్టుబడుతోంది కానీ ఏపీలో మాత్రం పట్టుబడటం లేదు.దీంతో దేశంలో ఏపీ పరువు పోతోంది. ఇతర రాష్ట్రాల పోలీసులు వచ్చి ఇక్కడ సోదాలు చేస్తున్నారు. గంజాయి వ్యాపారంలో ఎవరో పెద్దలు ఉండబట్టే పైకి ప్రకటనలు..లోపల మాత్రం ఇంత పెద్ద దందా జరుగుతోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

మెకానిక్ గా మారిన మాస్ కా దాస్

ఈమ‌ధ్యే 'గామి'గా ద‌ర్శ‌న‌మిచ్చాడు విశ్వ‌క్‌సేన్‌. త‌న కెరీర్‌లో అదో వెరైటీ సినిమా. ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు, విమ‌ర్శ‌కుల మెచ్చుకోళ్లూ ద‌క్కాయి. త‌ను న‌టించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి' విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇప్పుడు మ‌రో...

“చెంగిచెర్ల” మీదుగా బీజేపీ ఎలక్షన్ ప్లాన్లు !

మేడ్చల్ నియోజకవర్గం చెంగిచెర్ల గ్రామంలో హోలీ పండుగ సందర్భంగా ఘర్షణ జరిగింది. డీజే పాటలు పెట్టుకొని హోలీ సంబరాలు చేసుకుంటుండగా.. మరో వర్గానికి చెందిన వారు ఆ పాటలు ఆపాలని కోరారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close