పిన్నెల్లి అరెస్టుకు సీఈసీ డెడ్ లైన్ !

మాచర్ల ఎమ్మెల్యే ఈవీఎం ధ్వంసం చేసిన వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇంత చేసినా కేసు కూడా నమోదు చేయకపోవడంతో ఎన్నికల సంఘం తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దీంతో ఢిల్లీలోని సీఈసీ కార్యాలయం వెంటనే స్పందించింది. సీఈవో ముఖేష్ కుమార్ మీనాకు నోటీసులు పంపింది. ఆ వీడియోలో ఉన్నది ఎమ్మెల్యే నా.. ఎమ్మెల్యే అయితే ఇంకా కేసు ఎందుకు పెట్టలేదు.. ఎందుకు అరెస్టు చేయలేదో చెప్పాలని స్పష్టం చేసింది.

తక్షణం చర్యలు తీసుకుని ఐదు గంటల లోపు నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. అంటే క్రిమినల్ కేసు నమోదు చేసి అరెస్టు చేసిన విషయాన్ని ఐదు గంటల కల్లా సీఈసీకి తెలియచేయాల్సి ఉంది. ఈ విషయాన్ని డీజీపీపి సీఈవో తెలియచేశారు. దీంతో పిన్నెల్లి అరెస్టుకు ప్రత్యేక బృందాల్ని హైదరాబాద్ కు పంపారు. కానీ ఆయన ఆజ్ఞాతంలోకి వెళ్లారు. ప్రత్యేక బృందాల సమాచారం ఆయనకు చేరుతూండటంతో.. ఎప్పటికప్పుడు తప్పించుకుంటున్నారు.

ఐదు గంటలలోపు పిన్నెల్లిని అరెస్టు చేయలకపోతే వ్యవస్థలు మొత్తం విఫలమైనట్లే. వ్యవస్థల్లో ఉన్న మనుషుల ద్వారా తాను అనుకున్నట్లుగా చేయిస్తున్న వైసీపీ పెద్దలు పిన్నెల్లిని కాపాడుతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు పిన్నెల్లిని అరెస్టు చేయలేకపోతే.. ఏపీలో వ్యవస్థలు ఎంతగా దిగజారిపోయాయో దేశానికి తెలుస్తుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎన్టీఆర్ ఫౌండేషన్ కి 2 కోట్ల రూపాయలు భారీ విరాళం ఇచ్చిన మన్నవ మోహనకృష్ణ

నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదగా 2 కోట్ల రూపాయల చెక్కుని అందచేసిన మన్నవ మోహనకృష్ణ ఎన్టీఆర్ ట్రస్ట్ అనుబంధ విభాగమైన అమెరికా ఎన్టీఆర్ ఫౌండేషన్ కి నాట్స్ మాజీ అధ్యక్షుడు(USA),...

10లక్షల హోటల్ రూమ్… లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవితపై ఈడీ సంచలన ఆరోపణలు

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై సప్లిమెంటరీ చార్జీషీట్ ను దాఖలు చేసిన ఈడీ మరోసారి సంచలన అభియోగాలను నమోదు చేసింది. ఈ లిక్కర్ స్కామ్ లో 1100...

వైసీపీకి 123 సీట్లు వస్తాయని నాకు సమాచారం : పరిపూర్ణానంద

రాజకీయాలపై ఆశలు పెట్టుకున్న స్వాములు రాగద్వేషాలకు అతీతులేమీ కాదు. దానికి పరిపూర్ణానందనే సాక్ష్యం. హిందూపురం లోక్ సభ సీటు తనకు దక్కనివ్వలేదని రగిలిపోతున్న ఆయన ఎగ్జిట్ పోల్ చెప్పారు. హిందూపురం అసెంబ్లీకి ఇండిపెండెంట్...

సుప్రీంకోర్టు చెప్పినా తప్పే : సజ్జల

వైసీపీ నేతలు తాము ఏది చెస్తే అది.. ఏం చెబితే అది మాత్రమే ఫైనల్ అనుకునే స్టేజ్ కి వెళ్లిపోయారు. చివరికి సుప్రీంకోర్టు తీర్పును సైతం ... వాళ్లు చెబితే కరెక్టా అని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close