తమ ఫిర్యాదులపై ఈసీ చర్యలు లేవన్న కన్నా

ఏపీ భాజపా అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఉత్తరప్రదేశ్ ఎంపీ జీవీఎల్ నర్సింహారావుతో సహా కొంతమంది భాజపా నేతలు ఈసీని కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం కన్నా మాట్లాడుతూ… హాస్పిటళ్లలో పెద్ద ఎత్తున ధనం నిల్వలు ఉన్నాయని తాము ఫిర్యాదులు చేస్తే సోదాలు జరగడం లేదన్నారు. డబ్బు పంపిణీ యథేచ్ఛగా జరుగుతోందనీ ఫోన్లు చేసినా, ఫిర్యాదులు ఇచ్చినా ఎలక్షన్ కమిషన్ నుంచి స్పందన లేదని విమర్శించారు. ఎలక్షన్ కమిషన్ చర్యల్లేవని తాము మొత్తుకుంటా ఉంటే, ఈసీని పార్టీలకు అంటగట్టి విమర్శలు చేయడం చంద్రబాబు నాయుడి సహజ గుణమని విమర్శించారు కన్నా.

వాళ్ల అవసరాలకు అనుగుణంగా చంద్రబాబు డ్రామాలు వేస్తున్నారన్నారు. ఈ డ్రామాలకు తెర పడుతోందనీ, ప్రజలు తెర దించుతున్నారన్నారు. గోబెల్స్ ప్రచారం చేయడంలో నంబర్ వన్ తెలుగుదేశం పార్టీ అని విమర్శించారు కన్నా. తమ చిత్తశుద్ధిని, ప్రయత్నాన్ని నీరు గార్చడానికి చేసే ప్రయత్నాలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. తమకు ఎక్కడి నుంచీ ఆదేశాలూ సూచనలూ రాలేదనీ, తాము వచ్చి ఫిర్యాదు చేస్తున్నామన్నారు. ఎలక్షన్ కమిషన్ కి అత్యధిక సంఖ్యలో ఫిర్యాదులు ఇచ్చింది తమ పార్టీ అని కన్నా అన్నారు.

తమ ఫిర్యాదులను పట్టించుకోలేదని అంటున్నారుగానీ, డీజీపీ వెహికల్ ని తనిఖీ చేశారు కదా అని విలేకరి అడిగితే… అదంతా డ్రామా అని కొట్టిపారేశారు కన్నా. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈసీకి ఫిర్యాదు నేపథ్యంలోనే ఢిల్లీ నుంచి మీకు సంకేతాలు వచ్చాయా, అందుకే వచ్చారా అని విలేకరులు అడిగితే కన్నా తీవ్రంగా స్పందించారు. ఎవరో చెబితే రాలేదనీ, అలా అన్నవాడు బుద్ధిలేనివాడనీ, తాము స్వయంగా నిర్ణయం తీసుకుని వచ్చామని చెప్పారు. కన్నాతో పాటు ఇతర భాజపా నేతల కామెంట్స్ పై.. నో కామెంట్స్.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close