రాష్ట్రపతి పాలనలో ఎన్నికలు సజావుగా జరిగేవన్న జీవీఎల్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొత్తకొత్త డ్రామాలకు తెర తీస్తున్నారు అన్నారు ఉత్తప్రదేశ్ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు. మీడియాతో ఆయన మాట్లాడుతూ… చంద్రబాబు చేసిన స్టంట్ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ఉందన్నారు. ఏ నాయకుడైనా ఎన్నికలు సక్రమంగా జరగాలని కోరుకుంటున్నారనీ, కానీ చంద్రబాబు నాయుడు… అవినీతి సొమ్మును పంచేందుకు ఎందుకు అవకాశం ఇవ్వడం లేదని దిగజారుడు మాటలు మాట్లాడటం రాజకీయ దివాలాకోరుతనానికి నిదర్శనమన్నారు.

ఎన్నికల్లో ఓడిపోతామని తెలిసి, పార్టీలతో పోటీ చెయ్యలేక సంస్థలపై పడుతున్నారన్నారు జీవీఎల్. ఓటమిని ముందుగా అంగీకరించినట్టుగా తెలుస్తోందన్నారు. పట్టుమని పదిమంది అధికారులను కూడా బదిలీ చెయ్యకపోతే అది చాలా చిన్న మార్పు మాత్రమే అవుతుందన్నారు. ‘ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులకి.. రాష్ట్ర ప్రభుత్వం లేకుండా రాష్ట్రపతి పాలనలో ఎన్నికలు జరిగితేనే సజావుగా జరిగేవి’ అన్నారు జీవీఎల్. అయితే, అటువంటివి తాము డిమాండ్ చెయ్యలేదన్నారు.

ప్రతిపక్షాలు చెప్పిన అధికారులను తప్పించారు అంటే, అధికారంలో ఉన్న మీరే కదా దుర్వినియోగం చేసేదన్నారు జీవీఎల్. అధికారులను తప్పించారనే కంటే, ప్రతిపక్షాల ఫిర్యాదుల మేరకు ఇవి జరిగాయన్న ఏడుపులా ఉందన్నారు. ఈ ఎన్నికల్లో మీ ఓటమి తప్పదనీ, ప్రతిపక్ష పార్టీ హోదా కూడా తెలుగుదేశం పార్టీకి రాదనీ, పోలింగ్ జరిగే సమయంలో కూడా మరికొన్ని డ్రామాలకు టీడీపీ తెర తీస్తుందనీ, కాబట్టి వ్యవస్థ అంతా అప్రమత్తంగా ఉండాలని ఏపీ ఎన్నికల అధికారులకు యూపీ ఎంపీ సూచించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు, ప్రచారపర్వం ముగిసిన తరువాత ఈ తరహాలో విమర్శలు చెయ్యొచ్చా లేదా అనేది ఈ సెఫాలజిస్టుకి తెలుసో తెలీదో ఆయనకే తెలియాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

రేవంత్ రెడ్డి యార్క‌ర్… ప్ర‌తిప‌క్షాలు క్లీన్ బౌల్డ్ అయిన‌ట్లేనా?

గ‌త కొంత‌కాలంగా బీఆర్ఎస్ రైతుల చుట్టూ రాజకీయం మొద‌లుపెట్టింది. పంట ఎండిపోతుంద‌ని, సాగుకు విద్యుత్ అంద‌టం లేద‌ని, ధాన్యం కొనుగోలు ఏమైంద‌ని, రుణమాఫీపై మౌనం ఎందుకు అంటూ నేత‌లంతా మూకుమ్మ‌డిగా రేవంత్ స‌ర్కారుపై...

‘మై డియర్ దొంగ’ రివ్యూ: స‌హ‌నం దొంగిలించేశాడు

అభినవ్ గోమఠం అంటే నవ్విస్తాడనే నమ్మకం ఏర్పడింది. ఒకవైపు క్యారెక్టర్ రోల్స్ చేస్తూనే మెయిన్ లీడ్ గా కూడా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పుడాయన టైటిల్ రోల్ లో 'మై డియర్ దొంగ' సినిమా...

4 చోట్ల టీడీపీ అభ్యర్థుల మార్పు ?

తెలుగుదేశం పార్టీ నలుగురు అభ్యర్థులను మార్చాలని నిర్ణయించుకుంది. నరసాపురం సిట్టింగ్ ఎంపీ అయిన కనుమూరు రఘురామకృష్ణరాజు ఉండి అసెంబ్లీ నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దింపడం దాదాపు ఖాయమే. మంతెన రామరాజుకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close