ముందు ఈడీ కేసులే..!

ముందుగా సీబీఐ కేసుల విచారణే చేపట్టాలని.. వాటిని కొట్టేస్తే ఈడీ కేసులను కూడా కొట్టేసినట్లేనని వాదించిన వైసీపీ చీఫ్, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి లాయర్లకు చుక్కెదురైంది. ఆ మేరకు దాఖలు చేసిన పిటిషన్లను కోర్టు తిరస్కరించడమే కాదు.. ముందుగా ఈడీ కేసుల్లోనే విచారణ జరుపుతామని స్పష్టం చేసింది. ఈ మేరకు జగన్‌ అక్రమాస్తుల కేసులో సీబీఐ, ఈడీ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. సీబీఐ కేసులతో సంబంధం లేకుండా ఈడీ కేసుల విచారణ చేపట్టవచ్చని కోర్టు స్పష్టం చేసింది. సీబీఐ ఛార్జిషీట్లు తేలిన తర్వాతే ఈడీ కేసుల విచారణ జరపాలన్న జగన్‌ తరపు లాయర్‌ వాదనను సీబీఐ, ఈడీ కోర్టు తోసిపుచ్చింది.

సీబీఐ, ఈడీ ఛార్జిషీట్లలో నేరాభియోగాలు వేర్వేరని తేల్చింది. ఈ మేరకు ఈడీ వాదనతో ఏకీభవించింది. ఈడీ కేసులను ముందుగా విచారణ చేపడతామని… ఈడీ కేసుల్లో అభియోగాల నమోదును ప్రారంభించాలని నిర్ణయించింది. కేసు విచారణ ఈనెల 21కి వాయిదా వేసింది. అరబిందో, హెటెరో విషయంలో ఈడీ చార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకుని.. నిందితులందరికీ కోర్టు సమన్లు జారీ చేసింది. అయితే జగన్మోహన్ రెడ్డి తప్ప.. అందరూ హాజరయ్యారు. ముందుగా సీబీఐ కేసుల విచారణ జరిగితే.. ఎలాగోలా ఆలస్యమో… మరో విధంగానే బయట పడవచ్చనుకున్న జగన్ లాయర్లు.. ఈడీ కోర్టు నిర్ణయం మింగుడు పడనిదే.

సీబీఐ పూర్తిగా క్విడ్ ప్రో కో వ్యవహారాలపై విచారణ జరుపుతుంది. ఈడీ మనీలాండరింగ్ తోపాటు.. ఇతర చట్ట విరుద్ధమైన లావాదేవీలపై కేసులు నమోదు చేసింది. ఈ కేసులో అభిపోయాగాల నమోదు ప్ర్కరియ ప్రారంభమైతే.. విచారణ ఊపందుకున్నట్లేనని న్యాయవాద వర్గాలు చెబుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్ తండ్రిని కూడా వదల్లేదా..? షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అసలు రాజకీయం ఇప్పుడు స్టార్ట్ చేశారు.వైఎస్సార్ కు వారసురాలు జగన్ రెడ్డి కాదని బలంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నది తను...

భయపెడుతోన్న ఎండలు…వాతావరణ శాఖ బిగ్ అలర్ట్

ఎండలతో తెలుగు రాష్ట్రాలు కుతకుత ఉడుకుతున్నాయి. బయటకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు. పగలూ, సాయంత్రం అనే తేడా లేకుండా ఉక్కపోత సెగలు పుట్టిస్తోంది.ఈ క్రమంలోనే వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. రానున్న...

ఈవీఎం, వీవీ ప్యాట్ పిటిషన్లపై సుప్రీం కీలక తీర్పు

లోక్ సభ ఎన్నికల వేళ ఈవీఎం-వీవీప్యాట్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. వీవీప్యాట్‌ స్లిప్పులతో ఈవీఎం ద్వారా పోలైన ఓట్లను వందశాతం సరిపోల్చాలనే పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. జస్టిస్...

పోలింగ్ ముగిసిన తర్వాత ట్యాపింగ్ కేసులో అసలైనఅరెస్టులు !

ఎన్నికల హడావుడి తగ్గిన తర్వాత ట్యాపింగ్ కేసులో ఎన్నో బ్రేక్ డాన్సులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా పనిచేసిన ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close