యూరీ ఎఫెక్ట్స్: పాక్ తో కటీఫ్ షురూ

పఠాన్ కోట్ దాడి ప్రభావం నుంచి పాకిస్తాన్ తెలివిగా తప్పించుకోగలిగింది కానీ యూరీ దాడులకి ఆ దేశం మూల్యం చెల్లించవలసి వస్తోంది. ఆ దేశానికిచ్చిన ‘మోస్ట్ ఫేవర్డ్ నేషన్’ హోదాని రద్దు చేయాలని భారత ప్రభుత్వం భావిస్తున్నట్లు తాజా సమాచారం.

భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కూడా పాకిస్తాన్ తో క్రికెట్ ఆడకూడదని నిర్ణయించుకొంది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ తీరుని నిరసిస్తూ ఆ దేశంతో ఆడవలసిన ద్వైపాక్షిక సిరీస్ ని రద్దు చేసుకొంటున్నట్లు బీసీసీఐ చైర్మన్ అనురాగ్ ఠాకూర్ ట్వీట్ చేశారు. భారత్-పాక్ ద్వైపాక్షిక సిరీస్ 2007లో జరిగింది. మళ్ళీ త్వరలో మరో సిరీస్ ఆడేందుకు రెండు దేశాల క్రికెట్ బోర్డులు ఆలోచిస్తున్న సమయంలో ఈ ఘటన జరుగడంతో క్రికెట్ సంబంధాలు కటీఫ్ అయ్యాయి.

ముంబైలో స్థిరపడి హిందీ సినిమాలలో నటిస్తున్న పాక్ నటీనటులు అందరూ 48గంటలలోగా భారత్ విడిచి వెళ్ళిపోవాలని లేకుంటే తామే వారిని దేశం నుంచి బయటకి తరిమేస్తామని మహారాష్ట్రకి చెందిన నవనిర్మాణ్ సేనకి అనుబంద సంస్థ చిత్రపట్ కర్మచారిసేన హెచ్చరించింది.

పాకిస్తాన్ ఉగ్రవాద దేశమని భారత్ చేస్తున్న వాదనకి మద్దతుగా ఇద్దరు అమెరికన్ సెనేటర్స్ అమెరికన్ కాంగ్రెస్ (పార్లమెంటు)లో బుధవారం ఒక బిల్లుని ప్రవేశపెట్టారు. ఉగ్రవాదంపై అధ్యయనం చేసేందుకు ఏర్పాటు చేయబడిన హౌస్ సబ్-కమిటీ చైర్మన్ టెడ్-పో ఆ బిల్లుని స్వయంగా కాంగ్రెస్ లో ప్రవేశపెట్టడం విశేషం. దానికి రోహ్ర్ బెచర్ అనే మరో సెనేటర్ మద్దతు పలికారు.

‘పాకిస్తాన్ విశ్వసించదగ్గ స్నేహితుడు కాదు. అమెరికా శత్రువులకి ఆ దేశం చాలా కాలంగా సహాయ సహకారాలు అందిస్తూ మనల్ని మోసం చేస్తూనే ఉంది. ఒబామా బిన్ లాడెన్ కాపాడటం మొదలుకొని హకానీ నెట్ వర్క్ తో దాని రహస్య సంబంధాల వరకు అన్నిటిలో పాకిస్తాన్ హస్తం ఉందని స్పష్టం అయ్యింది. అమెరికాని మోసం చేస్తున్న పాకిస్తాన్ కి ఇక ఆర్ధిక సహాయం చేయడం ఆపివేసి దానిని ఉగ్రవాదం ప్రోత్సహిస్తున్న దేశంగా ప్రకటించాలి,” అని ఆ బిల్లులో పేర్కొన్నారు. అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ కూడా పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ని హెచ్చరించారు. ముఖ్యంగా పాక్ అణ్వాయుదాల భద్రత విషయంలో గట్టిగానే హెచ్చరించారు.

యూరోపియన్ పార్లమెంట్ అధ్యక్షుడు రీసజర్డ్ సీజర్ కూడా పాకిస్తాన్ని చాలా తీవ్రంగా హెచ్చరించారు. బలూచిస్తాన్ పాక్ సేనలు ప్రజలని హింసించడం మానుకాకుంటే పాకిస్తాన్ పై ఆర్ధిక, రాజకీయ ఆంక్షలు విధిస్తామని హెచ్చరించారు.

భారత్ తో సహా ప్రపంచ దేశాలు ఇంత ఒత్తిడి చేస్తున్నా పాక్ ప్రభుత్వం ఏమాత్రం వెనుకంజ వేయకుండా జోరుగా యుద్ద సన్నాహాలు చేస్తూ భారత్ ని కవ్విస్తూనే ఉంది. భారత్ వైపున్న పాక్ ఉత్తర సరిహద్దు ప్రాంతాలలో పాక్ యుద్దవిమానాలు తెగ తిరుగుతున్నాయి. అందుకోసం ఆ ప్రాంతం మీదుగా సాధారణ విమానాల రాకపోకలని పాక్ ప్రభుత్వం నిషేదించడంతో చాలా విమానాలు రద్దు అయ్యాయి. ఆ ప్రాంతంలో ఎం-1, ఎం-2 అనే రెండు ప్రధాన రహదారులపై వాహనాల రాకపోకలని నిలిపివేసి, ఆ రోడ్లపైనే యుద్ద విమానాలు దింపుతూ, టేకాఫ్ చేస్తూ యుద్దసన్నాహాలు చేస్తోంది. భారత్ ని ఎదుర్కోవడానికి తమ సైన్యం సిద్దంగా ఉందని ఆ దేశ సైన్యాధ్యక్షుడు రహెల్ షరీఫ్ ప్రకటించారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న ఆ వైమానిక కసరత్తు ఐదేళ్ళకోసారి సాధారణంగా జరిగేదే తప్ప యుద్దసన్నాహాలు కావని ఒక పాక్ సైనికాధికారి ఆ దేశంలో ప్రముఖ ఇంగ్లీష్ దినపత్రిక డాన్ కి చెప్పారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ స్థానాల్లో ఇద్దరేసి అభ్యర్థులకు బీజేపీ బీ ఫాం..!?

పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది.పోటీ చేసే అభ్యర్థులకు గెలుపు వ్యూహాలను చేరవేస్తూనే..మరోవైపు పార్టీ పరంగా ఎలాంటి వ్యూహాలను అనుసరించాలో అన్నింటిని పక్కా ప్లాన్ తో అమలు చేస్తోంది....

కేసీఆర్ బస్సులో లిఫ్ట్.. ఎంట్రీ వేరే లెవల్..!!

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వినియోగిస్తోన్న బస్సు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కేసీఆర్ సౌలభ్యం కోసం బస్సును కొత్త టెక్నాలజీతో అప్డేట్ చేయడంతో బస్సు డిజైన్ ఆకట్టుకుంటోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసాక కేసీఆర్...

రియల్లీ గ్రేట్..50 మందిని కాపాడిన బాలుడు

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని ఫార్మా కంపెనీ అగ్ని ప్రమాద ఘటనలో ఓ బాలుడి సాహసం 50మందిని ప్రాణాపాయం నుంచి కాపాడింది. భారీగా మంటలు ఎగిసిపడటంతో ప్రమాదంలో చిక్కుకొని ఆపన్నహస్తం కోసం...

పిఠాపురంపైకి అసాంఘిక శక్తుల దండయాత్ర !

ఒక్కడిని ఒక్కరంటే ఒక్కర్ని ఓడించడానికి అన్ని రకాల మాఫియాల్ని రంగంలోకి దించుతోంది వైసీపీ. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెట్టడమే కాదు.. నకిలీ మద్యంతో ముంచెత్తుతున్నారు. బయట నుంచి ఎర్ర చందనం స్మగ్లర్లు,...

HOT NEWS

css.php
[X] Close
[X] Close