రాజమండ్రి పుష్కర్ ఘాట్ వద్ద అగ్ని ప్రమాదం

రాజమండ్రి పుష్కరాలలో మరొక అపశ్రుతి జరిగింది. బుదవారం రాత్రి 7.30-8.00గంటల మధ్య పుష్కర్ ఘాట్ కి దగ్గరలో ఉన్న గోకవరం బస్టాండ్ వద్ద ఒక చిన్న హోటల్లో గ్యాస్ లీకయి సిలిండర్ పేలిపోవడంతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడి క్షణాలలో చుట్టుపక్కలకు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో ఎవరూ చనిపోలేదు కానీ నలుగురు వ్యక్తులకి తీవ్ర గాయలయినట్లు సమాచారం. సమీపంలో ఉన్న మూడు పోలీస్ వాహనాలు, ఒక ఆటో రిక్షా, కొన్ని దుఖాణాలు మంటల్లో కాలిపోయాయి. అక్కడే ఉన్న పోలీసులు చాలా నేర్పుగా చురుకుగా వ్యవహరిస్తూ ప్రజలను, అక్కడ పార్కింగ్ చేసిన ఇతర వాహనాలను ఒక క్రమపద్దతిలో ప్రమాద స్థలం నుండి దూరంగా తరలించడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ సంగతి తెలుసుకొన్న అగ్నిమాపక సిబ్బంది క్షణాలలో అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తెస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు ఆ ప్రాంతం చుట్టూ బ్యారికేడ్స్ ఏర్పాటు చేశారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సహా కొందరు అధికారులు హుటాహుటిన అక్కడికి చేరుకొని ప్రజలకి దైర్యం చెపుతూ పోలీసులకి, పుష్కర నిర్వాహకులకి తగిన సూచనలు చేస్తున్నారు. ఈ ప్రమాదం గురించి ఎటువంటి పుకార్లు నమ్మవద్దని ఎవరూ తీవ్రంగా గాయపడలేదని, ప్రాణ నష్టం జరగలేదని కనుక ఎవరూ ఆందోళన చెందవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీడియా ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేసారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నాలుగైదు సినిమాలకు అడ్వాన్సులు – గెలిచినా పవన్ బిజీనే !

పవన్ కల్యాణ్ ఎన్నికల తర్వాత కూడా తీరిక లేకుండా ఉంటారు. అయితే రాజకీయాలతో కాదు. సినిమాలతో. పవన్ కల్యాణ్ పిఠాపురంలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా తన ఆస్తులు,...

మేనిఫెస్టో మోసాలు : చేసింది జలయజ్ఞం కాదు జలభగ్నం !

వైఎస్ఆర్ జలయజ్ఞం.. వైఎస్ఆర్ కలలు కన్నారు. ఆ యజ్ఞాన్ని పూర్తి చేస్తాం. పోలవరం, వెలిగొండ యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తాం. రక్షిత మంచినీరు, సాగునీరు కల నిజం చేస్తాం. చెరువులను పునరుద్ధరిస్తాం .. జలకళను...

కాంగ్రెస్ కు అడ్వాంటేజ్ గా హరీష్ రావు సవాళ్ళు..!?

బీఆర్ఎస్ అధికారం కోల్పోయాక అటు కేసీఆర్, ఇటు హరీష్ రావు రాజకీయ వ్యూహాలు తేలిపోతున్నాయి. ప్రత్యర్ధులను కట్టడి చేసేందుకు చేస్తోన్న వ్యాఖ్యలు బీఆర్ఎస్ కు మేలు చేయకపోగా...అధికార కాంగ్రెస్ కు ఫేవర్ చేసేలా...

ఎడిటర్స్ కామెంట్ : ఆన్ లైన్ ఎలక్షన్స్ !

ఇండియాలో కేజీ బియ్యం రూ. వంద పలుకుతుంది కానీ ఒక్క జీబీ డేటా మాత్రం ఐదు రూపాయలకే వస్తుంది. మీరు సమయం అంతా యూట్యూబ్ వీడియోలు.. సోషల్ మీడియా మీదే గడపుతామంటే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close