తొలి అడుగు వ‌ర్మ‌దే!

అక్టోబ‌రు 15 నుంచి థియేట‌ర్లు తెర‌చుకుంటున్నాయి. అయినా నిర్మాత‌ల‌లో ఉత్సాహం లేదు. ఎప్ప‌టిలా థియేట‌ర్లకు జ‌నం వ‌స్తారా, రారా? అనే భ‌యాలు వెంటాడుతున్నాయి. అక్టోబ‌రు 15న థియేట‌ర్లు తెర‌చుకున్నా, కొత్త సినిమాలేవీ రావ‌ని విశ్లేష‌కులు తేల్చేస్తున్నారు. అయితే…. వ‌ర్మ నుంచి తొలి అడుగు ప‌డ‌బోతోంది. అక్టోబ‌రు 15నే త‌న సినిమాని విడుద‌ల చేయ‌డానికి వ‌ర్మ రెడీ అయిపోయాడు. లాక్ డౌన్ స‌మ‌యంలో చాలా సినిమాలు తీసేసి ప‌క్క‌న పెట్టుకున్నాడు వ‌ర్మ‌. అందులో `క‌రోనా వైర‌స్‌` ఒక‌టి. ఈ సినిమాకి అక్టోబ‌రు 15న విడుద‌ల చేస్తున్న‌ట్టు వ‌ర్మ ప్ర‌క‌టించాడు. లాక్ డౌన్ త‌ర‌వాత‌.. విడుద‌ల అవుతున్న తొలి సినిమా ఇదే. పైగా ఇదీ క‌రోనా నేప‌థ్యంలో సాగే సినిమానే. మొత్తానికి వ‌ర్మ నుంచి తొలి అడుగు ప‌డ‌బోతోంది. మిగిలిన వాళ్లు వ‌ర్మ‌ని అనుస‌రిస్తారా, అనుక‌రిస్తారా.. ఆగి ఆలోచిస్తారా అన్న‌దే తేలాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close