జగన్‌కి కోర్టులో షాక్ తప్పదన్న మాజీ సీఎస్..!

ప్రభుత్వాలు నియమించే కమిటీలు.. ప్రభుత్వానికి ఏమి కావాల్సి ఉంటే..అవి రాసిస్తాయి. అలా రాసిచ్చేవారితోనే కమిటీలు ఏర్పాటు చేస్తారు. సహజంగా జరిగేది ఇదే. అలా అని ఆ కమిటీలు ఇచ్చే రిపోర్టుల్లో ఏముంటుందో.. ముందే ఏ ప్రభుత్వ పెద్ద కానీ.. అధికారులు కానీ.. మంత్రులు కానీ చెప్పరు. అలా చెబితే… ఆ కమిటీ విశ్వసనీయత ప్రశ్నార్థమవుతుంది. దాన్ని చూపించి.. నిర్ణయాలు తీసుకుంటే.. కోర్టుల్లో షాక్ తగులుతుంది. ఇదే పరిస్థితి జగన్‌కు ఎదురవుతుందని.. అంటున్నారు మాజీ చీఫ్ సెక్రటరీ ఐవైఆర్ కృష్ణారావు. ఆయన సోషల్ మీడియాలో ఈ విషయాన్ని నిస్సంకోచంగా ప్రకటించారు. సీఎంతో పాటు మంత్రులు కూడా… కమిటీల విశ్వసనీయతను దెబ్బతీశారని.. కోర్టుల్లో ఇబ్బందికర పరిణామాలు ఎదుర్కోక తప్పదని తేల్చేశారు.

జీఎన్ రావు కమిటీ రిపోర్ట్ రెండు మూడు రోజుల్లో వస్తుందనగా.. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో మూడు రాజధానుల కాన్సెప్ట్ ప్రకటించారు. విచిత్రంగా.. జీఎన్ రావు కూడా అదే రిపోర్ట్ ఇచ్చారు. ఆ తర్వాత బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ కూడా.. అదే తరహా నివేదిక ఇస్తుందని మంత్రులు పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. విశాఖలోనే రాజధాని ఉంటుందని ప్రకటించారు. అలాగే… బోస్టన్ గ్రూప్ కూడా.. నివేదిక ఇచ్చింది. దాంతో.. అవన్నీ.. జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లు రాసుకొచ్చిన కమిటీలని.. ప్రజల్లోనూ అభిప్రాయం ఏర్పడిపోయింది.

ఈ రెండు కమిటీల నివేదికలను పరిశీలించి.. ప్రభుత్వం తరపున నియమించిన హైపవర్ కమిటీ నివేదిక ఇస్తుందని.. జగన్మోహన్ రెడ్డి చెబుతున్నారు. అసలు ప్రభుత్వం చెబుతున్నదే.. ఈ రెండు కమిటీలు నివేదికల రూపంలో ఇచ్చినప్పుడు.. హైపవర్ కమిటీ మాత్రం మరో రకంగా ఎందుకు అనుకుంటుంది..? ఇవన్నీ.. కోర్టుల్లో ప్రభుత్వానికి చిక్కులు తెచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం రాజ్యాంగ వ్యతిరేకంగా.. కమిటీలతో.. కావాల్సిన విధంగా రిపోర్టులు తెప్పించుకుని.. నిబంధనలు ఉల్లంఘించిందనే అభిప్రాయం ఏర్పడటానికి కారణం అవుతున్నాయి. ఐవైఆర్ చెప్పిన దాని ప్రకారం.. జగన్ కు షాక్ తప్పదేమో..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

పదేళ్ల తర్వాత ఓయూపై స్పందించిన కేసీఆర్

తెలంగాణ ఉద్యమ సమయంలో నిత్యం ఓయూను పలవరించిన కేసీఆర్.. గద్దెనెక్కాక ఒక్కసారి కూడా ఓయూను సందర్శించలేదు. విద్యార్థులు రోడ్డెక్కి ప్రొఫెసర్లను నియమించాలని,స్కాలర్ షిప్స్ పెంచాలని, వసతి గృహాల్లో నాణ్యమైన ఆహారం అందించాలని డిమాండ్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close