కేసీఆర్‌కు కొత్త తలనొప్పులు తెస్తున్న మాజీ డిప్యూటీ సీఎం !

బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ మహిళా సర్పంచ్ ప్రెస్ మీట్ పెట్టి ఎమ్మెల్యే రాజయ్య తనను లొంగదీసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. ఇది సంచలనంగా మారింది. స్టేషన్ ఘన్ పూర్ నుంచి గెలిచిన రాజయ్య తెలంగాణ తొలి డిప్యూటీ సీఎంగా వ్యవహరించారు. తర్వాత అవినీతి ఆరోపణల పేరుతో ఆయనను బర్తరఫ్ చేశారు కానీ.. మళ్లీ టిక్కెట్ ఇచ్చారు కేసీఆర్. అయితే ఆయన మాత్రం తన సహజ సిద్దమైన వ్యవహారశైలి మార్చుకోలేదు. ప్రతీ సారి వివాదాల్లోకి ఎక్కుతూనే ఉన్నారు. ముఖ్యంగా మహిళలతో ఆయన వ్యవహరించే తీరు సోషల్ మీడియాలో ఎన్ని సార్లు వైరల్ అయిందో చెప్పాల్సిన పని లేదు.

తాజాగా ఓ మహిళా సర్పంచ్ చేసిన ఆరోపణలతో… రాజయ్య వ్యవహారం వైరల్ అయింది. ఆయనపై కక్షతోనే రాజకీయ కారణాలతోనే సర్పంచ్ ఆరోపణలు చేశారని ఎవరూ అనుకోవడం లేదు. దీనికి కారణం రాజయ్య బ్యాక్ గ్రౌండే. అయితే ఆయన మాత్రం తన సహజ సిద్ధమైన రాజకీయ వాదనతో డిఫెండ్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తనపై రాజకీయ కుట్ర జరుగుతోందని.. సొంత పార్టీ లో వాళ్లే కుట్ర చేస్తున్నారని అన్నీ కేసీఆర్, కేటీఆర్ కు చెబుతానని చెప్పుకొచ్చారు.

మహిళా రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో కవిత దీక్ష చేస్తున్న సమయంలో బీఆర్ఎస్ లో ఇలా ఓ మహిళా సర్పంచ్ వేధింపుల ఆరోపణలతో తెర మీదకు రావడంతో విపక్షాల అవకాశంగా అందిపుచ్చుకున్నాయి. బీఆర్ఎస్ లోనే పరిస్థితి ఇలా ఉంటే రాష్ట్రంలో ఇంకెలా ఉందో చెప్పాల్సిన పని ఏముందని ప్రశ్నిస్తున్నారు. రాజయ్య వ్యవహారం ఇప్పుడు బీఆర్ఎస్ అధినేతకు కొత్త తలనొప్పులు తెచ్చి పెడుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close