పటేల్స్‌కు రిజర్వేషన్ ఇచ్చేది లేదని తేల్చిచెప్పిన గుజరాత్ సీఎం

హైదరాబాద్: గుజరాత్‍‌లోని పటేల్ సామాజికవర్గం ఆ మధ్య రిజర్వేషన్‌కోసం తీవ్రస్థాయిలో ఉద్యమం నడిపిన సంగతి తెలిసిందే. 25 ఏళ్ళుకూడా లేని హార్థిక్ పటేల్ అనే యువకుడు పటేల్ సామాజిక వర్గాన్ని ఒక్కతాటిపైకి తీసుకొచ్చి తమ ఉద్యమంతో కేంద్రం, గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వాలను వణికించాడు. రెండునెలల క్రితందాకా ఆ ఉద్యమం జోరుగా సాగిందిగానీ ఈ మధ్య పెద్దగా వార్తల్లో లేదు. అయితే తాజాగా గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందిబెన్ పటేల్ వారి రిజర్వేషన్లపై స్పష్టీకరణ ఇచ్చారు. పాటీదార్(పటేల్) సామాజికవర్గాన్ని ఓబీసీ క్యాటగిరీలో చేర్చే సమస్యేలేదని నిన్న స్పష్టీకరించారు. పాటీదార్‌లను ఓబీసీలో చేర్చి మిగిలిన సామాజికవర్గాలను నష్టపరిచేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా లేదని అన్నారు. కేవలం 5% పాటీదార్‌లే రిజర్వేషన్లకోసం ఆందోళన చేస్తున్నారని చెప్పారు.

తమ సామాజికవర్గాన్ని ఓబీసీలో చేర్చమని పాటీదార్‌లు చేస్తున్న ఆందోళనపై ముఖ్యమంత్రి ఆనందిబెన్ ఇలా తేల్చిచెప్పటం గుజరాత్‌లో అన్నివర్గాలనూ ఆశ్చర్యానికి గురిచేసింది. ఒకవైపు పాటీదార్‌ల ఉద్యమంతో సౌరాష్ట్ర, ఉత్తర గుజరాత్ ప్రాంతాలలో కాంగ్రెస్ బలపడుతుండగా, మరోవైపు ఈ నెల 29నుంచి తాలూకా, జిల్లా పంచాయతీల ఎన్నికలు జరగబోతుండగా ముఖ్యమంత్రి ఇలా వ్యాఖ్యలు చేయటం అధికార బీజేపీలోనే కలకలం సృష్టిస్తోంది. మరోవైపు ఈ ఎన్నికలలో ఓబీసీ, ఇతర కులాలే కీలక పాత్ర పోషిస్తాయి కాబట్టే ముఖ్యమంత్రి ఇలా వ్యాఖ్యలు చేశారని మరో వాదన వినిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రఘురామకు ఇంకా కూటమి నుంచి టిక్కెట్ చాన్స్ ఉందా ? లేదా?

రఘురామకృష్ణరాజు పోటీ ఎక్కడ ?. ఈ ప్రశ్న ఇప్పుడు ఇటు కూటమి క్యాంప్‌తో పాటు అటు వైసీపీ క్యాంప్‌లోనూ హాట్ టాపిక్ గానే ఉంది. వైసీపీ క్యాంప్.. ఇదే ప్రశ్నతో ఆయనను...

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

మెకానిక్ గా మారిన మాస్ కా దాస్

ఈమ‌ధ్యే 'గామి'గా ద‌ర్శ‌న‌మిచ్చాడు విశ్వ‌క్‌సేన్‌. త‌న కెరీర్‌లో అదో వెరైటీ సినిమా. ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు, విమ‌ర్శ‌కుల మెచ్చుకోళ్లూ ద‌క్కాయి. త‌ను న‌టించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి' విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇప్పుడు మ‌రో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close