అవమానించడానికే ఇతర పార్టీల్ని ఆహ్వానించారా !?

భీమవరంలో అల్లూరి సీతారారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమం పార్టీలకు అతీతంగా నిర్వహిస్తామని చెప్పి ..ఈ కార్యక్రమాన్ని రాజకీయ ప్రత్యర్థులను అవమానించేందుకు ఉపయోగించుకున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కార్యక్రమంలో ఇతర పార్టీల వారెవరూ కనిపించలేదు. అయితే బీజేపీ నేతలు లేకపోతే వైసీపీ నేతలు. టీడీపీ అధినేతకు ఆహ్వానం పంపామని.. అచ్చెన్నాయుడు కార్యక్రమం ఆద్యంతం పాల్గొంటారని చెప్పారు. కానీ చివరికి జాబితాలో అచ్చెన్న పేరు లేదు.

కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారికంగా ఆహ్వానం లేఖ వచ్చినా ఆయన పేరు లేదని కలెక్టర్ చెప్పడంతో ఆయన ఆగిపోయారు. పిలిచి అవమానించారని వారు మండిపడ్డారు. జనసేన పరిస్థితి అదే. బీజేపీకి చెందిన చోటా నేతలు.. జిల్లా అధ్యక్షుల పేర్లు కూడా కనించాయి కానీ.. ఇతర పార్టీల నేతల పేర్లు మాత్రం కనిపించలేదు. వచ్చినా ఘోరంగా అవమానించి పంపేసి ఉండేవారే.

ఈ మాత్రం దానికి ఎందుకు పార్టీలకు అతీతంగా నిర్వహిస్తున్న కార్యక్రమంగా ప్రచారం చేశారన్నది అర్థం కాని ప్రశ్న. ఈ అంశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పూర్తిగా పట్టు కోల్పోయారని.. చివరికి వచ్చే సరికి రాష్ట్ర అధికారులు మొత్తం కలగాపులగం చేశారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ మాత్రం దానికి పార్టీలకు అతీతం చెప్పి ఆహ్వానం పేరుతో హడావుడి చేయడమేమిటన్న విమర్శలు ఇతరుల నుంచి వస్తున్నాయి.

రఘురామకూ అదే పరిస్థితి. అయితే రఘురామ , అచ్చెన్న లాంటి వాళ్లు హాజరయితే తమకు ఇబ్బందని పట్టుబట్టి వారి పేర్లను తొలగింప చేశారన్న ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించిన రియాక్షన్స్ ఉంటాయన్న అభిప్రాయం వినిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ విషయంలో కేసీఆర్‌కే క్లారిటీ ఉంటే ఇన్ని కష్టాలు వచ్చేవి కావేమో ?

కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ ప్రజల నమ్మకాన్ని మళ్లీ పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో బస్సు యాత్ర చేస్తున్నారు. అందులో ఆయన ఒకటే ప్రధానంగా చెబుతున్నారు. అదేమిటంటే దేవుడు తనను తెలంగాణ కోసమే పుట్టించారని...

అవన్నీ వైసీపీ దింపుడు కళ్లెం ప్రయత్నాలే !

ఓటమి తప్పదని తెలిశాకా గెలవడానికి సిల్లీ ఆలోచనలు చేస్తూంటారు రాజకీయ నేతలు. వైసీపీ నేతలకు ఇలాంటివి కొన్ని ఎక్కువే వస్తూంటాయి. వాటిని అమలు చేసేందుకు చేసిన ప్రయత్నాలు కూడా అంతే...

ఆఖరి రాగం పాడేసిన వల్లభనేని వంశీ !

వల్లభనేని వంశీ ఆఖరి రాగం పాడేశారు. ఇవే తనకు చివరి ఎన్నికలని అనేశారు. అయితే అది గన్నవరంలో . మరో చోట పోటీ చేస్తారా లేదా అన్నది చెప్పలేదు కానీ.....

ప్రారంభమైన రెండో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖులు వీరే

సార్వత్రిక ఎన్నికల రెండో దశ పోలింగ్ ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా శుక్రవారం 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికలు జరగుతున్నాయి. 89లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరగాల్సి ఉండగా...మధ్యప్రదేశ్ బైతూల్ లో బీఎస్పీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close