సుబ్రహ్మణ్యం మర్డర్ కేసు.. పోలీసులపై మాయని మచ్చ !

వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు దళిత యువకుడు సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి డోర్ డెలివరీ చేసిన వ్యవహారంలో పోలీసులు చేస్తున్న దర్యాప్తు హైకోర్టును సైతం ఆశ్చర్య పరుస్తోంది. కనీసం సీసీ టీవీ ఫుటేజీలో ఎవరున్నారో కూడా తెలుసుకోకుండా దర్యాప్తు చేస్తున్నట్లుగా స్పష్టమయింది. దీనపైనే పోలీసులుకు నోటీసులు జారీ చేసింది.

ఎమ్మెల్సీ అనంతబాబు హత్య చేస్తే.. ఆయనను కాపాడటానికి పోలీసులు చేయని ప్రయత్నాలు అంటూ లేవు. ఆయనకు బెయిల్ తెప్పించడానికి రౌడీషీట్ లేదని కూడా చెప్పుకొచ్చిన పరిస్తితులు. సరైన సమయానికి చార్జిషీట్ వేయలేదు. ఈ కారణంగానే ఆయనకు సుప్రీంకోర్టులో బెయిల్ లభించింది. అప్పట్నుంచి మరింతగా రెచ్చిపోతున్నారు. పోలీసు పరేడ్ గ్రౌండ్లలోనే రాజకీయ సభలు పెట్టి ప్రతిపక్షాలకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

తాను సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసినట్లుగా ఆయన అంగీకరించారు. ఆ హత్య ఒక్కరే చేసింది కాదని ఇంకా చాలా మంది ప్రమేయం ఉందని అనుమానిస్తున్నారు. అదే సమయంలో ఆవేశంలో ఓ సారి నెడితే గేటుపై పడి చనిపోయారని.. తప్పేం లేదని . ..తీవ్రత తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ కాల్ డేటాలు..సాక్ష్యాలు సేకరించి.. ఎమ్మెల్సీతో పాటు.. హత్యలో పాల్గొన్న నిందితులందర్నీ అరెస్ట్ చేయాలన్న ఆలోచన పోలీసులు చేయడం లేదు. ఇతర కేసుల సంగతేమో కానీ.. ఓ దళిత యవకుడి హత్య కేసులో పోలీసులు ఇలా వ్యవహరించడం.. పోలీసు వ్యవస్థపై ప్రజల్లో నమ్మకాన్ని తగ్గిస్తుంది. అది ఎవరికి మంచిది ?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఢిల్లీకి చిరు.. రేపే ప‌ద్మ ప్ర‌దానం

మెగాస్టార్‌ చిరంజీవిని ఇటీవ‌ల ప‌ద్మ విభూష‌ణ్ పుర‌స్కారం వ‌రించిన సంగ‌తి తెలిసిందే. ఈ పుర‌స్కార ప్ర‌దానోత్స‌వం రేపు ఢిల్లీలో జ‌ర‌గ‌బోతోంది. ఈ సంద‌ర్భంగా చిరు ఢిల్లీ బ‌య‌ల్దేరారు. ఆయ‌న‌తో పాటుగా సురేఖ‌, రామ్...

విదేశాలకు వెళ్తా… కోర్టు అనుమతి కోరిన జగన్

విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ కోర్టును కోరారు ఏపీ సీఎం జగన్. లండన్ వెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వాలని కోరారు. ఈ నెల 17 నుంచి జూన్ 1 మధ్య విదేశాలకు వెళ్లేందుకు...

వైన్స్ బంద్… ఆ ఒక్క షాప్ మాత్రం ఓపెన్

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోరు తుది అంకానికి చేరుకుంది. మరో మూడు రోజుల్లో ప్రచార పర్వం ముగియనున్న నేపథ్యంలో రాష్ట్రమంతటా మద్యం దుకాణాలు రెండు రోజులపాటు మూతబడనున్నాయి. ఈ నెల 11న...

పోలింగ్ ముగిసిన తర్వాత ఫ్యామిలీతో విదేశాలకు జగన్

పోలింగ్ ముగిసిన వెంటనే విదేశీ పర్యటనకు వెళ్లాలని జగన్ నిర్ణయించుకున్నారు. పదమూడో తేదీన పోలింగ్ ముగుస్తుంది. ఆ తర్వాత లెక్కలు చూసుకుని పదిహేడో తేదీన విమానం ఎక్కాలనుకుంటున్నారు. ఈ మేరకు ఇప్పటికే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close