విద్యుత్ ఉద్యోగుల సమస్య పరిష్కారం అయినట్లేనా?

తెలంగాణా విద్యుత్ సంస్థల నుండి తొలగింపబడ్డ 1200మంది విద్యుత్ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట లభించింది. వారి కేసును ఈరోజు విచారణకు చేప్పట్టిన హైకోర్టు తీర్పు ఇచ్చింది. వారందరూ తెలంగాణా ప్రభుత్వానికే చెందుతారని నిర్ద్వందంగా ప్రకటించింది. కనుక వారిని తెలంగాణా విద్యుత్ సంస్థలు విధులలోకి తీసుకోవాలని ఆదేశించింది. కానీ వారందరూ ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారు కనుక ఆంద్ర, తెలంగాణా ప్రభుత్వాలు కలిసి వారికి 58:42నిష్పత్తిలో జీతాలు చేల్లిస్తుండాలని ఆదేశించింది. నాలుగు వారాలలోగా వారి వేతన బకాయిలను కూడా అదే నిష్పత్తిలో చెల్లించాలని హైకోర్టు రెండు ప్రభుత్వాలను ఆదేశించింది. తుది తీర్పు వెలువడేవరకు ఇదే పద్దతిని అమలు చేయాలని ఆదేశించింది.

హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ఈ సమస్య పరిష్కారం అయినట్లు కనిపిస్తున్నప్పటికీ, ఒకవేళ ఇప్పుడు కూడా తెలంగాణా ప్రభుత్వం తన వాదనకే కట్టుబడి తను తొలగించిన ఉద్యోగులను విధుల్లోకి తీసుకొనేందుకు అంగీకరించకపోతే సమస్య మళ్ళీ మొదటికి వస్తుంది. ఒకవేళ ఆంద్రప్రదేశ్ హైకోర్టు తీర్పుని మన్నించి ఆ 1200మంది ఉద్యోగులకు తన వాటాగా 58 శాతం జీతాలు చెల్లించడానికి అంగీకరిస్తే, ఇకపై వివిధ తెలంగాణా ప్రభుత్వ శాఖలలో లేదా సంస్థలలో పనిచేస్తున్న ఆంధ్రా ఉద్యోగులకి అదే విధంగా చెల్లించాల్సి వస్తుంది. కనుక ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం కూడా వెనకాడవచ్చును. కానీ ఉద్యోగుల పరిస్థితిని తమ బాధ్యతని దృష్ట్యా రెండు ప్రభుత్వాలు హైకోర్టు తీర్పుకి కట్టుబదేందుకు అంగీకరిస్తే ఎటువంటి సమస్య ఉండదు. అది సాధ్యమో కాదో త్వరలోనే తేలిపోతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close