సింగపూర్ ప్రధానితో బాబు భేటీ:శంకుస్థాపనకు ఆహ్వానం

హైదరాబాద్: సింగపూర్ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇవాళ సింగపూర్ ప్రధానమంత్రి లీ సీన్ లూంగ్‌తో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి వచ్చేనెల 22న జరిగే శంకుస్థాపనకు రావలసిందిగా ఆహ్వానించారు. లీ సీన్ లూంగ్‌తో సమావేశమవటం సంతోషంగా ఉందని బాబు ట్వీట్ చేశారు. అంతకుముందు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సౌత్ ఏషియన్ స్టడీస్‌లో బాబు కీలక ప్రసంగం చేశారు. సభికులు ఏపీకి సంబంధించి వివిధ అంశాలపై అడిగిన ప్రశ్నలకు జవాబులిచ్చారు. భారత రాయబారి గోపీనాథ్ పిళ్ళై ఈ కార్యక్రమంలో మోడరేటర్‌గా వ్యవహరించారు. తర్వాత సింగపూర్ మంత్రి ఈశ్వరన్‌ ఇచ్చిన విందుకు చంద్రబాబు హాజరయ్యారు. అమరావతి మాస్టర్ ప్లాన్ అమలుచేయటం గురించి ఇరువురు నేతలూ చర్చించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కాళ్లు పట్టేసుకుంటున్న వైసీపీ నేతలు -ఎంత ఖర్మ !

కుప్పంలో ఓటేయడానికి వెళ్తున్న ఉద్యోగుల కాళ్లు పట్టేసుకుంటున్నారు వైసీపీ నేతలు. వారి తీరు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. కుప్పంలో ప్రభుత్వ ఉద్యోగులు ఓట్లు వేసేందుకు ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు...

‘పూరీ’ తమ్ముడికి ఓటమి భయం?

విశాఖపట్నం జిల్లాలో ఉన్న నర్సీపట్నం నియోజకవర్గానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. విశాఖ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతానికి నర్సీపట్నం 'హార్ట్' లాంటిది, ఇక్కడ రాజకీయాలు చాలా విచిత్రంగా ఉంటాయి. తెలుగుదేశం పార్టీ సీనియర్...

మదర్స్ డే @ 200 సంవత్సరాలు

ప్రతి ఏడాది మే రెండో ఆదివారం మదర్స్ డే గా జరుపుకుంటారని మనకు తెలుసు.. అయితే ఈ ప్రతిపాదన మొదలై 200 సంవత్సరాలు అయిందనే విషయం మీకు తెలుసా? వాస్తవానికి 'మదర్స్ డే వేడుకలు'...

కోమటిరెడ్డికి హైకమాండ్ వద్ద రిమార్క్స్

కోమటిరెడ్డి వెంకటరెడ్డి కి ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉందని రేవంత్ రెడ్డి ఉబ్బేస్తున్నారు కానీ ఆయన పనితీరుపై హైకమాండ్ తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లుగా కనిపిస్తోంది. చెప్పిన పని చేయకుండా నల్లగొండ పార్లమెంట్ పరిధిలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close