దేశంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో మళ్లీ మునుపటి పరిస్థితులు ఉత్పన్నం అవుతాయోమోననే ఆందోళన వ్యక్తం అవుతోంది. నాటి కోవిడ్ పరిస్థితులను గుర్తు చేసుకుంటేనే జనం ఉలిక్కిపడుతున్నారు. మరోసారి అలాంటి పరిస్థితులు రావొద్దని కోరుకుంటున్నారు. ఇక కరోనా భయం పోయినట్లేనని రిలాక్స్ అవుతుండగా కరోనా మళ్లీ బుసలు కొడుతోంది.
దేశవ్యాప్తంగా కరోనా కేసులుపెరుగుతుండటంతో మళ్లీ లాక్ డౌన్ విధించే పరిస్థితులు వస్తాయా? అని ప్రజలు అప్పుడే చర్చలు మొదలు పెట్టేశారు. కేసుల పెరుగుదలపై హైరానా పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఐసీఎంఆర్ కీలక ప్రకటన చేసింది. కొత్త వేరియంట్ పై ప్రజలు భయాందోళనకు గురి కావద్దని , అలాగని నిర్లక్ష్యంగా ఉండవద్దని సూచించింది. తప్పకుండా జాగ్రత్తలు పాటించాలని కోరింది.
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతుండటంతో కేంద్రం ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తుందని ఐసీఎంఆర్ డైరెక్టర్ డాక్టర్ రాజీవ్ బహళ్ వెల్లడించారు. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారు, వృద్దులు కరోనా నిబంధనలను పాటించాలన్నారు.