“క్యాస్ట్” వైరస్ భారత్ పరువు తీస్తోంది..!

బ్రిటన్ ఆర్థిక మంత్రిగా రిషి సునఖ్ అనే వ్యక్తి పదవీ బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఆయన ఇన్ఫోసిస్ నారాయణమూర్తి , సుధామూర్తిల అల్లుడు. వేరే దేశానికి ప్రధానమంత్రి తర్వాత అంత గొప్ప పదవిని పొందబోతున్న ఆయనకు.. భారతదేశం నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. 39 ఏళ్లకే అంతెత్తు ఎదిగిన ఆయన ఎలా సాధించారనేది.. చాలా మందికి స్ఫూర్తి. అది బయట వాళ్లకే. ఇండియా వాళ్లకు మాత్రం ముందుగా ఆయనలో కావాల్సింది .. ఆయన కులం. గూగుల్‌లో రిషి సునఖ్ కులం ఏమిటంటూ.. సెర్చ్ చేశారు ఇండియన్స్. ఆ వివరాలను గూగుల్ బయట పెట్టింది.

బ్రిటన్‌లో ప్రధాని పదవి తర్వాత ఆర్థిక మంత్రి పదవి అంత కీలకం. బ్రెగ్జిట్ తర్వాత అది మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. కొంత మంది ఆ పదవిని చేపట్టడానికి కూడా సిద్ధపడలేదు. అలాంటిది సవాల్ తీసుకునేందుకు రిషి బ్రిటన్ ఆర్థిక మంత్రి అవుతుంటే.. అతని కులం ఏమిటా అని గూగుల్ చేస్తున్నారు భారతీయ నెటిజన్లు. రిషి సునఖ్ ఏం సాధించాడన్న దాని కన్నా.. అతని కులం ఏంటనేదే భారతీయులకు ముఖ్యమైనదిగా కనిపిస్తుందని గూగుల్ వ్యాఖ్యానించించింది.ఈ విషయంపై రిషి సునఖ్ కూడా స్పందించారు. తాను హిందూనే అయినప్పటికీ.. చర్చికు కూడా వెళతానని ప్రకటించారు.

భారతీయుల్లో పెరిగిపోతున్న కులభావనను రాజకీయ పార్టీలు.. అంతే బాగా ఉపయోగించుకుంటున్నాయి. ఓ రకంగా చెప్పాలంటే.. రాజకీయాల కోసం పెంచి పోషిస్తున్నాయి. ఓ కులంపై ద్వేషం..మరో కులంపై… విద్వేషం.. తమ కులంపై సానుకూలత చూపి ప్రజల్ని విడగొట్టేస్తున్నాయి. ఆ పరిణామం.. ప్రపంచదేశాల ముందు భారత్ పరువు తీస్తోంది. దానికి రిషి సునఖ్ వ్యవహారామే ఉదాహరణ.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close