లండన్‌లో సీఎం జగన్ – ఏపీలో ఐపీఎస్‌ల బదిలీలు

విశాఖ సీపీగా పోస్టింగ్ ఇచ్చి ఆరు నెలలు కాక ముందే త్రివిక్రమ వర్మను సాగనంపేసింది జగన్ రెడ్డి సర్కార్. ఆయన స్థానంలో రవిశంకర్ అయ్యన్నార్ ను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. త్రివిక్రమ్ వర్మను స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఐజీగా నియమించారు. మరో పది మంది ఐపీఎస్ ఆఫీసర్లను బదిలీ చేశారు. ఇందులో కడప ఎస్పీ అన్బురాజన్ కూడా ఉన్నారు. వివేకా హత్య కేసు విషయంలో.. ఆయన తీరు వివాదాస్పదం అయింది. సీబీఐని వేధించడంలో … నిందితులపై ఈగ వాలకుండా చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే చాలా కాలంగా కడపలోనే ఉండటంతో ఎన్నికల సమయంలో బదిలీ తప్పదు కాబట్టి.. పక్కనే ఉన్న అనంతపురంకు బదిలీ చేసినట్లుగా తెలుస్తోది.

విశాఖ సీపీగా త్రివిక్రమ్ వర్మను తప్పించడం మాత్రం చర్చనీయాంశమవుతోంది. ఆయనను గత ఏప్రిల్ లోనే విశాఖ సీపీగా నియమించారు. ఆరు నెలల వ్యవధిలోనే ఆయనను బదిలీ చేయడం చర్చనీయాంశం అవుతోంది. బదిలీకి ప్రధాన కారణం.. విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఇంట్లో జరిగిన కిడ్నాప్ వ్యవహారంగా భావిస్తున్నారు. ఈ అంశం విషయంలో ప్రభుత్వ పెద్దల్ని ఆయన సంతృప్తి పరచలేకపోయారని.. అప్పుడే అసంతృప్తి వ్యక్తం చేశారని ప్రచారం జరిగింది.

అయితే కీలకమైన ఈ బదిలీలు చేసే సమయంలో ముఖ్యమంత్రి జగన్ ఇండియాలో లేరు. ఆయన వ్యక్తిగత పని మీద లండన్ వెళ్లారు. ఈ సమయంలో ఇలాంటి బదిలీల ఉత్తర్వులు బయటకు రావడం అధికార వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

తెలంగాణలో కనిపించని ఎన్నికల హడావుడి – ఖర్చు భయమే !

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీడియాలో తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఎన్నికల ప్రచార హడావుడి కనిపించడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉద్ధృతం చేయలేదు. మరో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close