తెలంగాణలో పెరుగుతున్న ఐటీ దాడులు – రాజకీయం ఉందా ?

తెలంగాణలో ఐటీ అధికారుల కదలికలు ప్రారంభమయ్యాయి. వరుసగా ఐటీ దాడులు జరుగుతున్నాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ కంపెనీలను టార్గెట్ చేసుకుని ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. గతలో పలు కంపెనీలపై ఇలా సోదాలు జరిగాయి. ఇప్పుడు మరో బడా కంపెనీ వాసవి గ్రూప్‌పై ఎటాక్స్ చేశారు. పదుల సంఖ్యలో బృందాలతో ఒక్క సారిగా విరుచుపడిన ఐటీ అధికారులు విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నారు. దాదాపుగా ఇరవై కంపెనీల పేర్లతో వాసవి గ్రూప్ వ్యాపారాలు చేస్తోంది. అనేక ఇతర రియల్ ఎస్టేట్ కంపెనీలతో కలిసి జాయింట్ వెంచర్లను ఏర్పాటు చేసింది.

వీరి లావాదేవీలు వేల కోట్లలోనే ఉంటాయి. అయితే దానికి తగ్గట్లుగా పన్నులు చెల్లించడం లేదని.. అందుకే ఐటీ దాడులు జరుగుతున్నాయని అంటున్నారు. కానీ బడా రియల్ ఎస్టేట్ కంపెనీ అంటే.. ఎన్నో లింకులు ఉండాలి. ముఖ్యంగా రాజకీయ నేతల లింకులు లేకుండా అది రియల్ ఎస్టేట్ కంపెనీ కాలేదు. ఎందుకంటే బ్లాక్ మనీ అంతా పోగుపడేది రియల్ ఎస్టేట్‌లోనే. అలా సంపాదించుకునేది రాజకీయ నేతలే. వారి సొమ్మే వివిధ రూపాల్లో రియల్ ఎస్టేట్ కంపెనీల్లోకి పంపుతూ ఉంటారు. అయితే ఇదెక్కడా రికార్డుల పరంగా ఉండదు. పలుమార్లు ఆ నేత బినామీ ఆస్తులు.. ఫలానా కంపెనీల్లో ఉన్నాయని చెప్పుకుంటూ ఉంటారు.

దర్యాప్తు సంస్థలు చేతుల్లో ఉన్న వారికి వీటిపై అవగాహన ఉంటుంది. అందుకే టార్గెట్ చేయాలనుకున్న వారిని సాలిడ్‌గా ఆయా కంపెనీలపై దాడులు చేయడం ద్వారా చేస్తారు. తెలంగాణలో జరుగుతున్న ఐటీ దాడులు కూడా ఆ కోణంలోనివేనా అన్న చర్చ జరుగుతోంది. వేల కోట్ల వ్యాపారాలు చేసే బడా రియల్ ఎస్టేట్ సంస్థలకు రాజకీయ సంబంధాలు లేకుండా ఉండవు. అందుకే తెలంగాణలో ఎప్పుడు ఐటీ దాడులు జరిగినా.. ఆ సంస్థలు ఎవరివి.. వారు ఎవరికి సన్నిహితులన్న గుసగుసలు వినిపిస్తూంటాయి. మరి తాజాగా ఐటీ దాడులు జరుగుతున్న వాసవి గ్రూప్‌ లింకులు ఉన్నది ఏ పార్టీకో ?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

బిగ్ బ్రేకింగ్ – షాద్ నగర్ లో ఘోర అగ్ని ప్రమాదం

షాద్ నగర్ లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. నందిగామ శివార్ సమీపంలోని అలెన్ హోమియో , హెర్బల్ కంపెనీలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి....

HOT NEWS

css.php
[X] Close
[X] Close