తెలంగాణలో బట్టల దుకాణాలనూ వదలని ఇన్‌కంట్యాక్స్ !

తెలంగాణను కేంద్ర దర్యాప్తు సంస్థలు జల్లెడ పడుతున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కాం పేరుతో ఇప్పటికే సీబీఐ, ఈడీలు సోదాలు చేశాయి. అరెస్టులు ప్రారంభించాయి. ఇప్పుడు రంగంలోకి ఐటీ దిగింది. పెద్ద ఎత్తున ఐటీ బృందాలు ఒక్క సారిగా హైదరాబాద్‌లో సోదాలు చేశాయి. ఈ సారి వారి టార్గెట్ పెద్ద పెద్ద కంపెనీలు కాదు. ఆర్ఎస్ బ్రదర్స్ , సౌత్ ఇండియా షాపింగ్ మాల్, లాట్ మొబైల్స్ వంటి దుకాణాల్లో సోదాలు చేశారు. దుకాణాలతో పాటు గోడౌన్లలో కూడా సోదాలు చేశారు. లోపల సిబ్బందిని బయటకి…బయట సిబ్బంది లోపలకి అనుమతించలేదు. ఏ కేసులో సోదాలు చేస్తున్నరో కూడా ఎవరికీ తెలియదు.

తెలంగాణలో అధికార పార్టీకి చెందిన కొంత మంది పెద్ద ఎత్తున హవాలా నగదు తరలించడానికి ఇలాంటి వ్యాపార సంస్తలను ఉపయోగించుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో ఐటీ అధికారులు ఆధారాలు లభించడంతోనే దాడులు చేసినట్లుగా చెబుతున్నారు. గతంలో ప్రభుత్వ పెద్దలకు సన్నిహితమైన వారి రియల్ ఎస్టేట్ కంపెనీల్లో సోదాలు నిర్వహించారు. ఇప్పుడు బట్టలు, నగల దుకాణాలు.. సెల్ ఫోన్ దుకాణాల్లో సోదాలు చేస్తున్నారు.

ఇటీవల తెలంగాణ పర్యటనకు వచ్చినప్పుడు అమిత్ షా ఆదాయపు పన్ను శాఖ అధికారులతో సమావేశమయ్యారు. ఆ తర్వాత పలువురు ఐటీ అధికారుల బదిలీలు జరిగాయి. కొత్తగా వచ్చిన అధికారులు చార్జ్ తీుకుని.. సోదాలు ప్రారంభించారు. మొత్తంగా దర్యాప్తు సంస్థలన్నీ వరుసగా జరుపుతున్న దాడులు ఒకదానితో ఒకటి లింకప్ అయి ఉన్నాయని.. అతి పెద్ద స్కాం బయటపడుతుందన్న ప్రచారం మాత్రం జోరుగా సాగుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

తెలంగాణలో కనిపించని ఎన్నికల హడావుడి – ఖర్చు భయమే !

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీడియాలో తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఎన్నికల ప్రచార హడావుడి కనిపించడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉద్ధృతం చేయలేదు. మరో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close