బీజేపీని వ్యతిరేకించే బాలీవుడ్ స్టార్లపై ఐటీ దాడులు..!

ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఎవరినీ ఉపేక్షించని అసహనం ఇటు రాష్ట్రం.. అటు కేంద్రంలోనూ కనిపిస్తోంది. తాజాగా.. బీజేపీ విధానాలను వ్యతిరేకించే వారిగా పేరున్న బాలీవుడ్ ప్రముఖులపై ఇన్‌కంట్యాక్స్ దాడులు చేసింది. ఐటీ కన్ను పడిన వారిలో అనురాగ్ కశ్యప్, తాప్సీ పన్ను, వికాస్ భల్ తో పాటు ుసైఫ్ అలీఖాన్‌కు చెందిన ఫాంటమ్ ఫిల్మ్స్ సంస్థకు సంబంధించిన వ్యక్తులపైనా ఐటీ సోదాలు జరుగుతున్నాయి. అనురాగ్ కశ్యప్, తాప్సీ పన్ను బీజేపీ విధానాలను వ్యతిరేకించే విషయంలో తమను తాము కంట్రోల్ చేసుకోరు. ధైర్యంగా విమర్శిస్తూనే ఉంటారు. అందుకే వీరిపై కంగనా రనౌత్ లాంటి వారు ఘాటు వ్యాఖ్యలతో విరుచుకుపడతారు. అనురాగ్ కశ్యప్ మరింత దూకుడుగా ఉంటారు. గతంలో అనురాగ్ కుమార్తెను అత్యాచారం చేస్తామని కొంత మంది బెదిరించారు కూడా అయినప్పటికీ.. ఆయన వెనక్కి తగ్గలేదు. తమ వాయిస్ వినిపిస్తూనే ఉన్నారు.

బీజేపీకి మద్దతుగా ఉండే బాలీవుడ్ సెలబ్రిటీల్లో ఒక్కరిపై కూడా ఐటీ దాడులు జరగలేదు. సెలక్టివ్ గా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండేవారిపైనా జరగడంతో పక్షపాతం స్పష్టంగా కనిపిస్తోంది…బీజేపీయేతర పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మహారాష్ట్ర ప్రభుత్వం ఐటీ దాడులను ఖండించింది. రాజకీయాలు.. కక్ష సాధింపుల కోసం చాలా కాలంగా సీబీఐ, ఐటీ, ఈడీలను బీజేపీ వాడుకుంటోందని మండిపడింది. బీహార్ నేత తేజస్వియాదవ్ కూడా అవే విమర్శలు చేశారు. దేశంలో కేంద్ర విచారణ సంస్థలు బీజేపీ అనుబంధ సంఘాలుగా మారిపోయాయని విపక్ష పార్టీలు చాలా కాలంగా ఆరోపిస్తున్నాయి. బీజేపీ వ్యతిరేక పార్టీల వారిని వెంటాడటం.. బీజేపీతో సన్నిహితంగా ఉన్న వారిని లైట్ తీసుకోవడం కామన్ గా మారుతోంది. తృణమూల్ నేతలపై సీబీఐ కేసులు ఉన్న వారు అందరూ బీజేపీలో చేరిపోయారు.

అలా.. దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ జరుగుతోంది. ఇప్పుడు సెలబ్రిటీలు తమకు వ్యతిరేకంగా నోరెత్తకుండా… కేంద్ర సంస్థల్ని వాడుకుంటున్నట్లుగా కనిపిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే బీజేపీ సర్కార్ తో గొడవలెందుకని.. అత్యధిక శాతం బాలీవుడ్ ప్రముఖులు.. అవసరం లేకపోయినా బీజేపీ సర్కార్ ను పొగుడుతూ వస్తున్నారు. పొగడటం ఇష్టం లేని వారు అభిప్రాయాలను వ్యక్తం చేయడం మానేశారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close