చైతన్య : మీ వాళ్ల నుంచి మీ కుటుంబ ఆడవాళ్ల గౌరవాన్నైనా కాపాడుకోవాలి జగనన్నా !

వైఎస్ సునీతను నారా సునీతగా అభివర్ణిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా ఇంచార్జ్ గా పని చేసి ప్రస్తుతం అడవుల కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్న గుర్రంపాటి దేవేందర్ రెడ్డి ఓ పోస్టు పెట్టారు. ఈయన ఇంతకు ముందు చంద్రబాబు, పవన్ కల్యాణ్ , రఘురామకృష్ణరాజు వంటి వారి కుటుంబాలను.. వారి ఇంట్లో ఆడవాళ్లను అత్యంత అసభ్యకరంగా తిట్టేవారు. ఆ పార్టీ సంస్కృతి, సంప్రదాయాలు ఆ స్థాయే కాబట్టి ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు ఏకంగా వైఎస్ కుటుంబంపైనే అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. దీన్ని వైసీపీ కార్యకర్తలు వంత పలుకుతున్నారు

ఆమె తండ్రిని చంపి ఆమెపైనే హత్యానేరం మోపే కుట్ర – సునీతను ఇంకా ఎంత వేధిస్తారు ?

వైఎస్ సునీతా రెడ్డి.. తన తండ్రిని దారుణంగా హత్య చేసిన తర్వాత కూడా జగన్ వెంట నిలబడ్డారు. ఎన్నికల సమయంలో .. . ఆయన చెప్పినట్లుగానే మాట్లాడారు. ఏమైనా తేడాగా మాట్లాడితే ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని ఓడిపోతామని చెబితే… గెలిచిన తర్వాత హంతకులకు శిక్ష విదిస్తామని నమ్మబలకడంతో చెప్పినట్లుగా చెప్పారు. తీరా గెలిచాక.. నిందితుల్ని శిక్షించకపోగా.. వారికే అండగా నిలుస్తూ.. ఏంతకైనా తెగిస్తున్న వ్యవహారం కళ్ల ముందు కనిపిస్తోంది. అంతే కాదు.. ఆ హత్యానేరం స్వయంగా ఆమె మీద.. ఆమె భర్త మీద వేయడానికి పెద్ద స్కెచ్ వేసినట్లుగా తెలిసిన తర్వాత ఎవరైనా కామ్ గా ఎలా ఉండగలరు ?

మరి ఇంత దారుణంగా తన తండ్రిని హత్య చేసి.. ఆ హత్యను తనపై వేసేందుకు కుట్ర చేస్తే ఆమె పోరాడకూడదా ?

నారా సునీత అని అంటే ఎవర్ని నిందించినట్లో తెలియదా ?

నారా సునీత అంటే.. ఎవర్ని నిందించినట్లు. వైఎస్ కుటుంబం ఆడపడుచుని నిందించినట్లు. ఆమె తల్లి క్యారెక్టర్ పై ఊహించని నింద మోపినట్లు. సునీత తల్లి ఎవరు..? . వైఎస్ కుటుంబ పరువు ప్రతిష్టలను ఇలా వైసీపీ కాలకేయులు అడ్డగోలుగా సోషల్ మీడియాలో పడేస్తూంటే… దాన్ని ఆహో ఓహో అని ప్రచారం చేసుకుటున్నారు.. వైసీపీ కార్యకర్తలు. ఇక్కడ అసలు టీడీపీ ఎందుకు వస్తుందో ఎవరికీ తెలియదు. ఆమె తండ్రిని చంపిన హంతకులపై పోరాడుతోంది. వారు కుటుంబంలోని వారే. బాధితులు. హంతకులు అంతా కుటుంబంలోని వారే అయినప్పుడు ఇక టీడీపీ ప్రస్తావన ఎందుకు వస్తుంది.. టీడీపీని అడ్డం పెట్టుకుని సునీతను కించ పరిచేందుకు చేసే ప్రయత్నాలన్నీ వైఎస్ కుటుంబాన్ని నవ్వుల పాలు చేస్తున్నట్లుగా కాదా ?

కుటుంబ గౌరవాన్ని కాపాడుకోలేకపోతే ఏం వారసులు ?

సునీత పోరాటంపై టీడీపీ ముద్ర వేసి ఏదో చేయాలనుకుంటే చేయవచ్చు. ఆమె న్యాయపోరాటం చేస్తున్నారు. న్యాయం గెలుస్తుందో లేదో .. న్యాయస్థానంలో తేలుతుంది. కానీ ఇప్పుడు ఆమెపై.. ఆమె తల్లిపై.. ఆమె కుటుంబ వారసత్వంపై … క్యారెక్టర్ పై నిందలేయడం మాత్రం సముచితమైన పని కాదు. అది వైఎస్ కుటుంబం మొత్తం పై వేస్తున్న నింద. ఇలా సొంతకుటుంబాన్ని సొంత వాళ్లు అత్యంత నీచంగా కించ పరుస్తున్నా.. చూసి ఆనందిస్తే… ఏ విధంగా నూ వారసులయ్యే అవకాశం లేదు. ఈ విషయం తెలుసుకుంటారో లేదో మరి !

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

43వేల కోట్లతో రోడ్లేశాం కానీ వర్షాలకు కొట్టుకుపోయాయి : జగన్

జగన్మోహన్ రెడ్డి నోటికొచ్చింది చెప్పరు.. రాసుకొచ్చిందే చెబుతారు. రాసిచ్చే వారు ఏమి రాసిచ్చారో.. ఆయన ఏమి చదివారో కానీ.. మేనిఫెస్టోను రిలీజ్ చేసేటప్పుడు రోడ్ల ప్రస్తావన తెచ్చారు. టీడీపీ హయాం కన్నా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close