ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజున ప్రజలు తనకు వెన్నుపోటు పొడిచారని … వెన్నుపోటు దినోత్సవం జరపాలని జగన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆయన పార్టీ నేతలు రెడీ అవుతున్నారు. ఎంత మంది చేస్తారో ఎలా చేస్తారో కానీ.. జగన్ రెడ్డి వెన్నుపోటుకు కూటమి పార్టీలు రివర్స్ కౌంటర్ రెడీ చేశాయి. నాలుగో తేదీన జగన్ నుంచి విముక్తికి ఏడాది, పీడ విరగడం అయి ఏడాది పేరుతో టీడీపీ, జనసేన క్యాడర్ కార్యక్రమాలు నిర్వహించనున్నాయి.
జగన్ రెడ్డి ఓడిపోయి ఏడాది అయినా ఆయన ఐదు సంవత్సరాల పాటు చేసిన పాలనా నిర్వాకాలు తల్చుకుంటే సామాన్య ప్రజలకు ఇంకా భయం భయంగా ఉంటుంది. చివరికి ఇందిరాగాంధీ హయాంలో ఇళ్లు పొందిన పేదలను వదలకుండా వన్ టైం సెటిల్మెంట్ పేరుతో … ఇళ్ల మీదకు వాలంటీర్లు, ఇతరులను పంపించి డబ్బులు వసూలు చేశారు. మద్యం విధానంతో లక్షల మంది ప్రాణాలను రిస్క్ లో పెట్టారు. అలాంటి పాలన మరోసారి వద్ద బాబోయ్ అని ప్రజలు ఇప్పటికీ ఉలిక్కి పడుతున్నారు.
ఓ ఏడాది తర్వాత కూడా ఆ షాకులు మర్చిపోలేనంతగా ఉన్నాయి . అందుకే ప్రజలు తనకు వెన్నుపోటు పొడిచారని జగన్ అనుకుంటున్నారు. ప్రజాతీర్పును ఏ మాత్రం గౌరవించని జగన్ పై .. కూటమి పార్టీలు అదే విధంగా అదే విధంగా ఎటాక్ చేస్తున్నాయి. జగన్ పీడ విరగడ అయి ఏడాది అయిందని సంబరాలు చేస్తున్నాయి. రాజకీయాల్లో వ్యతిరేకత ఉటుంది కానీ జగన్ రెడ్డి తాను చేసిన శత్రుత్వ రాజకీయాలు.. ఇప్పటికీ అదే పద్దతి కొనసాగిస్తూ.. ఇతరులంతా అసహ్యించుకునేలా చేసుకుంటున్నారు.