నవరత్నాలకు ప్రజలకు చేరేలా జగన్ “యాక్షన్ ప్లాన్” అదుర్స్..!

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నవరత్నాల పేరుతో అమలు చేయనున్న సంక్షేమ పథకాలను.. పకడ్బందీగా ప్రజలకు చేరేలా.. ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇందుకోసం.. గ్రామ వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేస్తున్న ఆయన… వీరి సేవలను లాంఛనంగా.. స్వాతంత్ర దినోత్సవం రోజున ప్రారంభించనున్నారు. పథకాల అమలుకు ఓ ప్రత్యేకమైన క్యాలెండర్ కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు. దీనికి సంబంధించిన యాక్షన్ ప్లాన్ ను ప్రకటించారు. ఈనెల 15న గ్రామ, వార్డు వాలంటీర్ల వ్యవస్థను సీఎం జగన్మోహన్ రెడ్డి విజయవాడలో ప్రారంభించారు. వాలంటీర్లు అందరూ.. పరిస్థితులపై అవగాహన తెచ్చుకున్న తర్వాత ఈనెల 26-30 తేదీల మధ్య ఇళ్ల పట్టాలు లేని వారి కోసం సర్వే నిర్వహిస్తారు. అందరి వివరాలు సేకరిస్తారు.

సెప్టెంబర్‌ 1నుంచి శ్రీకాకుళంలో నాణ్యమైన రేషన్‌ బియ్యం డోర్‌ డెలివరీ చేస్తారు. దీన్ని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నారు. శ్రీకాకుళంలో వచ్చే ఫలితాలను బట్టి రాష్ట్రమంతా అమలు చేస్తారు. అలాగే.. రాష్ట్రమంతటా.. సెప్టెంబర్‌ 1నుంచి 10వరకు పెన్షన్‌ డోర్‌ డెలివరీ చేస్తారు. వృద్ధులు ఇక పెన్షన్ కోసం పడిగాపులు పడాల్సిన పని లేకుండా.. గ్రామ వలంటీర్లు ఇంటికే వచ్చి పెన్షన్ ఇస్తారు. పదో తేదీ లోపు పెన్షన్ల పంపిణీని పూర్తి చేస్తారు. సెప్టెంబర్‌ 11 నుంచి 15వరకు కొత్త పెన్షన్లు, రేషన్‌కార్డులు జారీ చేస్తారు. సెప్టెంబర్‌ 15 నుంచి 30వరకు పథకాల అమలు ఎలా జరిగిందనేదానిపై…ప్రభుత్వం సమీక్ష చేస్తుంది.

వాలంటీర్ల వ్యవస్థలో మెరుగుపరచాల్సిన అంశాలపై సమీక్షిస్తారు. అలాగే.. అక్టోబరు 15న రైతు భరోసా పథకాన్ని ప్రారంభించాలని జగన్ నిర్ణయంచారు. రైతు భరోసా పథకం ప్రారంభానికి ప్రధాని మోదీని ఆహ్వానించారు. 11 నెలల కాలానికి గ్రామ సచివాలయం నుంచి కౌలురైతులకు కార్డులు అందిస్తారు. కౌలు రైతులకు కార్డులు అందగానే వారందరికీ రైతు భరోసా కింద నగదు అందిస్తారు. వచ్చే ఏడాది నుంచి రైతు భరోసాను మేలోనే అందిస్తామని జగన్ ప్రకటించారు. పథకాల అమలు పూర్తి స్థాయిలో ప్రారంభమైన తర్వాత సెప్టెంబర్ నుంచి జిల్లాల్లో పర్యటించాలని జగన్ నిర్ణయించుకున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ స్థానాల్లో ఇద్దరేసి అభ్యర్థులకు బీజేపీ బీ ఫాం..!?

పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది.పోటీ చేసే అభ్యర్థులకు గెలుపు వ్యూహాలను చేరవేస్తూనే..మరోవైపు పార్టీ పరంగా ఎలాంటి వ్యూహాలను అనుసరించాలో అన్నింటిని పక్కా ప్లాన్ తో అమలు చేస్తోంది....

కేసీఆర్ బస్సులో లిఫ్ట్.. ఎంట్రీ వేరే లెవల్..!!

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వినియోగిస్తోన్న బస్సు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కేసీఆర్ సౌలభ్యం కోసం బస్సును కొత్త టెక్నాలజీతో అప్డేట్ చేయడంతో బస్సు డిజైన్ ఆకట్టుకుంటోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసాక కేసీఆర్...

రియల్లీ గ్రేట్..50 మందిని కాపాడిన బాలుడు

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని ఫార్మా కంపెనీ అగ్ని ప్రమాద ఘటనలో ఓ బాలుడి సాహసం 50మందిని ప్రాణాపాయం నుంచి కాపాడింది. భారీగా మంటలు ఎగిసిపడటంతో ప్రమాదంలో చిక్కుకొని ఆపన్నహస్తం కోసం...

పిఠాపురంపైకి అసాంఘిక శక్తుల దండయాత్ర !

ఒక్కడిని ఒక్కరంటే ఒక్కర్ని ఓడించడానికి అన్ని రకాల మాఫియాల్ని రంగంలోకి దించుతోంది వైసీపీ. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెట్టడమే కాదు.. నకిలీ మద్యంతో ముంచెత్తుతున్నారు. బయట నుంచి ఎర్ర చందనం స్మగ్లర్లు,...

HOT NEWS

css.php
[X] Close
[X] Close