“ఐప్యాక్ టీం”పై అభిమానం చాటుకున్న జగన్..!

తన వారి కోసం ఎంత దూరమైనా వెళ్తారనేది వైఎస్‌ రాజశేఖర్ రెడ్డికి ఉన్న పేరు. దీన్ని ఆయన కుమారుడు కూడా ఫాలో అవుతున్నారు. వైసీపీ కోసం ఎన్నికల్లో పని చేసిన ఐ ప్యాక్ టీం మెంబర్ పెళ్లి కోసం.. ఆయన కుటుంబసమేతంగా.. లక్నో వెళ్లారు. తీరిక లేని షెడ్యూల్‌లో కూడా.. తీరిక చేసుకున్నారు. ఆదివారం లక్నోలో రిషి అనే యువకుడి పెళ్లికి హాజరయ్యారు. ఉత్తరాది యువకుడి పెళ్లికి ఆంధ్ర సీఎం ఏమిటా అని అక్కడా చాలా మంది ఆశ్చర్యపోయారు. కానీ.. వైసీపీ గెలుపులో ఆ రిషి పాత్ర కూడా కీలకం. అందుకే జగన్మోహన్ రెడ్డి గు‌ర్తు పెట్టుకున్నారు. పెళ్లి అని ఆహ్వానం ఇవ్వగానే కుటుంబసమేతంగా వెళ్లారు.

రిషి ప్రశాంత్ కిషోర్ టీం మెంబర్ రిషి . ఎన్నికల్లో గెలుపొందడానికి జగన్మోహన్ రెడ్డి ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ .. ఐ ప్యాక్‌ తో ఒప్పందం చేసుకున్నారు. ప్రశాంత్ కిషోర్ దీన్ని లీడ్ చేస్తారు. ఈ ఐ ప్యాక్ టీంలో… రిషి కూడా కీలక వ్యక్తి. ప్రశాంత్ కిషోర్ ఎన్నికల సమయంలో… రాజకీయాల్లోకి వెళ్లారు. బీహార్‌లోని జేడీయూ పార్టీలో చేరి ఉపాధ్యక్ష పదవిని చేపట్టారు. అందుకే ప్రత్యక్షంగా ఆయన పెద్దగా వ్యూహరచనలో పెద్దగా పాల్గొనలేదు. ఆయన ఆలోచనలు మాత్రం ఎప్పటికప్పుడు పీకే టీంకి అందేవి. పీకే ఆలోచనలు రిషి పక్కాగా అమలు చేస్తారు.

జగన్మోహన్ రెడ్డికి ఐ ప్యాక్ టీం పనితీరు బాగా నచ్చింది. అందుకే ఐ ప్యాక్ టీంపై..జగన్మోహన్ రెడ్డి మంచి అభిమానాన్ని చూపిస్తూంటారు. కొద్ది రోజుల కిందట… ఐ ప్యాక్ టీంలోనే పని చేసిన బ్రహ్మానంద పాత్ర అనే మరో వ్యక్తికి.. ఏపీ చీఫ్ డిజిటల్ డైరక్టర్‌గా పదవి కూడా ఇచ్చారు. పార్టీ కోసం పని చేసిన వారిని జగన్మోహన్ రెడ్డి మర్చిపోరని వైసీపీ నేతలు చెబుతూంటారు. ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి మరోసారి నిరూపించారు. జగన్ ఆదరాభిమానాలతో పీకే టీం కూడా హ్యాపీగా ఉందంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...
video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

HOT NEWS

css.php
[X] Close
[X] Close