రాజధానిలో “ఇన్‌సైడ్ ట్రేడింగ్” సాక్ష్యాల కోసం సర్కార్ తిప్పలు..!

అమరావతిలో ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగింది. రాజధాని నిర్ణయాన్ని కొందరు టీడీపీ నేతలకు చంద్రబాబు ముందే చెప్పారు. వారు పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేశారు. రాజధాని ప్రకటన తర్వాత భారీ మొత్తానికి అమ్మారు. ఇది ఇన్ సైడ్ ట్రేడింగే. సీబీఐ విచారణ కావాలంటూ డిమాండ్ చేసిన వైసీపీ… అధికారంలోకి వచ్చిన తర్వాత సాక్ష్యాల కోసం.. వెదుకులాడుతోంది. రాజధాని భూ సమీకరణలో భాగంగా రైతులు ఇచ్చిన 33 వేల 567 ఎకరాల్లో… ప్రభుత్వ ఏర్పాటుకు.. రాజధాని ప్రకటనకు మధ్య జరిగిన లావాదేవీలు 170 ఎకరాలకు అటూ ఇటుగానే ఉన్నాయి.

రాష్ట్ర విభజన తర్వాత 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకొచ్చింది. తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల్లోని 29 గ్రామాల్లో రాజధానిని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు అసెంబ్లీలో 2014 డిసెంబర్ 8వ తేదీన తీర్మానం చేశారు. మొదట్లో మద్దతు పలికిన వైసీపీ… రెండేళ్ల తర్వాత అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజధాని భూసమీకరణలో భారీ కుంభకోణం జరిగిందని, ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిందంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు చేసింది. కోట్లాది రూపాయలు చేతులు మారాయని ఆరోపించింది. తన అనుచరులకు, పార్టీ నేతలకు లబ్ధి చేకూర్చేందుకు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధానిని తుళ్లూరులో ఏర్పాటు చేస్తున్నట్టు ముందుగానే తన అనుచరులకు చెప్పారని, వారు భూములను తక్కువ ధరకు కొనుగోలు చేసి. .. అమ్ముకున్నారని .. మరికొంతమంది వాటిని తమ పేరుపై రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని వైసీపీ ఆరోపించింది.

అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్షంలో ఉండగా చేసిన ఆరోపణలపై విచారించేందుకు కేబినెట్ సబ్ కమిటీని నియమించింది. ఈ కమిటీ ఆదేశాల మేరకు సీఆర్డీఏ అధికారులతోపాటు విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్, సీఐడీ అధికారులు రంగంలోకి దిగారు. రాజధానిలో చంద్రబాబు సీఎంగా ప్రమాణం స్వీకారం చేసిన నాటినుంచి ఆయన రాజధానిని ప్రకటించే వరకు ఆరు నెలల కాలంలో ఎంతవరకు కొనుగోళ్లు జరిగాయో లెక్కలన్నీ తీశారు. ఐదేళ్ల కాలంలో మొత్తంగా.. అమరావతిలో జరిగిన లావాదేవీలు 1170 ఎకరాలేనని అధికారవర్గాలు చెబుతున్నాయి. ఇక ఇన్ సైడ్ ట్రేడింగ్ జరగడానికి అవకాశం ఉన్న సమయంలో లావాదేవీలు 170 ఎకరాలు మాత్రమే. వీటిని ఎలా పెద్దగా చూపించాలన్నదానిపై.. సర్కార్ కసరత్తు చేస్తోందంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వేలంపాట మాదిరి వైసీపీ మేనిఫెస్టో..!?

వైసీపీ మేనిఫెస్టో చూసిన వారందరికీ వేలంపాట గుర్తుకు రాక మానదు. టీడీపీ ఒకటి అంటే...మేము రెండు అంటాం అనే తరహలో వైసీపీ మేనిఫెస్టోను రూపొందించినట్లుగా కనిపిస్తోంది. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను ఏమాత్రం అంచనా...

వైజాగ్ నుంచి పాలన… జగన్ ను జనం విశ్వసించేనా..?

మూడు రాజధానుల పేరుతో ఏపీకి రాజధాని లేకుండా చేసిన జగన్ రెడ్దికి ఎన్నికల్లో క్యాపిటల్ ఫియర్ పట్టుకున్నట్లు కనిపిస్తోంది. రెండో దఫా అధికారంలోకి వస్తే విశాఖ కేంద్రంగా పాలన కొనసాగుతోందని మేనిఫెస్టో విడుదల...

సేమ్ మేనిఫెస్టో : ఆశలు వదిలేసుకున్న జగన్ !

వైసీపీ అధినేత జగన్ ఈ ఎన్నికలపై ఆశలు వదిలేసుకున్నట్లుగా కనిపిస్తోంది. ఏ మాత్రం అమలు చేయలేపోయిన గత ఎన్నికల మేనిపెస్టోను మళ్లీ ప్రకటించారు. కాకపోతే గతం కన్నా కాస్తంత ఎక్కువ డబ్బులు ఇస్తానని...

ప్రజల ట్రోలింగ్ దెబ్బకు బ్యాండేజ్ మాయం..!!

ఏపీ సీఎం జగన్ రెడ్డి ఎట్టకేలకు బ్యాండేజ్ వదిలేశారు. జగన్ కనుబొమ్మపై రాయి దాడి జరిగి రెండు వారాలైనా బ్యాండేజ్ విప్పకపోవడంతో ఇదంతా సానుభూతి డ్రామా అనే చర్చ జరిగింది. జగన్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close