“వెయిటింగ్‌ లిస్టు”తోనే జగన్ ఢిల్లీ టూర్లు ..!

వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వ్యవహారాలను చక్కబెట్టేందుకు పెట్టుకున్న వారు.. సమర్థంగా విధులు నిర్వహించలేకపోతున్నారు. అటు విజయసాయిరెడ్డి అయినా.. ఇటు.. ప్రవీణ్ ప్రకాష్ అయినా… ఇద్దరూ.. తమ తమ ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల జగన్ మోహన్ రెడ్డిని ఢిల్లీలో ప్రముఖుల ఇంటి ముందు వెయిటింగ్‌ లిస్టులోనే ఉంచుతున్నారు. అమిత్ షా అపాయింట్‌మెంట్ ఖరారయిందని… తక్షణం బయలుదేరి రావాలని.. జగన్‌కు.. నిన్న ఉదయం.. ఢిల్లీ నుంచి సమాచారం వచ్చింది. అనంతపురం కియా పరిశ్రమ రీ ఓపెనింగ్ కు వెళ్లిన జగన్.. అక్కడ్నుంచి హడావుడిగా అమరావతి వచ్చేసి.. ఢిల్లీ బయలుదేరారు. తీరా.. ఢిల్లీ వెళ్లిన తర్వాత అక్కడ…. ఎవరి అపాయింట్‌మెంట్ ఖరారు కాలేదు. పది గంటలకు.. జగన్మోహన్ రెడ్డి అమిత్ షాతో భేటీ అవుతారని.. మీడియాకు సమాచారం ఇచ్చారు. దాంతో మీడియా ప్రతినిధులందరూ.. అమిత్ షా ఇంటి వద్దకు చేరుకున్నారు.

పది గంటలకు.. సీఎంవోలో చక్రం తిప్పుతున్న అధికారి ప్రవీణ్ ప్రకాష్.. అమిత్ షా ఇంటి వద్దకు వచ్చారు. ఆ సమయం అలా గడిచిపోతూనే ఉంది. కానీ ముఖ్యమంత్రి మాత్రం రాలేదు. కారణం.. అమిత్ షా.. సమయం ఇవ్వకపోవడమే. తర్వాత ప్రవీణ్ ప్రకాష్ కూడా వెళ్లిపోయారు. పన్నెండు గంటల వరకూ భేటీ జరగలేదు. నిజానికి అమిత్ షా… రాత్రి తొమ్మిది గంటల తర్వాత.. ఎంతో ముఖ్యమైతే తప్ప.. ఎవరికీ అపాయింట్‌మెంట్ ఇవ్వరని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. అలాంటిది.. జగన్మోహన్ రెడ్డికి పన్నెండు గంటలకు ఎలా ఇస్తారని.. భావించారని… మీడియా ప్రతినిధులు కూడా సెటైర్లు వేశారు.

జగన్మోహన్ రెడ్డిని గతంలో కూడా.. విజయసాయిరెడ్డి ఇలాగే.. అపాయింట్‌మెంట్లు ఖరారరయ్యాయని ఢిల్లీకి పిలిపించి.. అభాసుపాలు చేశారు. ఎదురు చూసి.. చూసి.. ఆయన అమరావతి వచ్చేశారు. ఆ తర్వాత… మరోసారి అపాయింట్‌మెంట్ ఖరారు చే్శారు కానీ.. ఆ రోజు.. అమిత్ షా పుట్టిన రోజు. శుభాకాంక్షలు చెప్పే వారి జాబితాలో జగన్ పేరును చేర్చి.. అదే అపాయింట్‌మెంట్‌గా చెప్పుకుని సంతోషపడ్డారు. ఇప్పుడు.. మళ్లీ అదే పునరావృతం అయింది. అమిత్ షాతో భేటీ సంగతి ఏమీ తేలలేదు కానీ..నేడు మోడీతో మాత్రం.. అధికారిక సమావేశం ఖరారైనట్లుగా చెబుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

లోక్ సభ ఎన్నికలు…ఏ పార్టీ ఏ అంశాన్ని హైలెట్ చేసిందంటే..?

ఎంపీ ఎన్నికలను తెలంగాణలో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ లు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.మెజార్టీ సీట్లే లక్ష్యంగా నెల రోజులుగా తీరిక లేకుండా ప్రచారాన్ని పరుగులు పెట్టించాయి. ప్రత్యర్ధి పార్టీలపై అనేక ఆరోపణలు,...

ఓటేస్తున్నారా ? : క్రిమినల్ ఎప్పుడూ హీరో కాదని గుర్తుంచుకోండి !

" ఓ చిన్న దొంగను చూస్తే దొంగ దొంగ అని అరిచి పట్టుకుని చెట్టుకు కట్టేసి కొడతాం. కానీ అదేపెద్ద దొంగ వందలు, వేల కోట్లు దోచిన వాడు కనిపిస్తే.. ఎక్కడా...

పబ్లిక్ డిబేట్… మోడీ భయపడుతున్నారా..!?

అరవై ఏళ్లలో కాంగ్రెస్ ఏం చేసిందని, బీజేపీ అధికారంలోకి వచ్చాకే దేశంలో నిజమైన అభివృద్ధి ప్రారంభమైందని ప్రధాని నరేంద్ర మోడీ సహా ఆ పార్టీ నేతలంతా ఎన్నికల ప్రచారంలో చెప్తున్నారు. కాంగ్రెస్ గెలిస్తే...

ఖాతాల్లో డబ్బులేయలేదు ..డ్రామాలే !

ఓటర్ల ఖాతాల్లో పధ్నాలుగు వేల కోట్లు జమ చేస్తున్నట్లుగా వైసీపీ చేసిన డ్రామాలు తేలిపోయాయి. అంతా ఉత్తదేనని తేలిపోయింది. హైకోర్టు శుక్రవారం ఒక్క రోజు నగదు జమ చేయడానికి చాన్సిచ్చింది. బ్యాంకులు ప్రారంభం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close