జగన్‌ చిర్రుబుర్రులు : నే వద్దన్నా కదా!

”వద్దని నేను ముందే చెప్పాను.. కానీ మీరు ఏదో కార్యం చక్కబెట్టేస్తాం అంటూ పూనుకుని బయల్దేరి వెళ్లారు. ఇప్పుడు ఏమైంది పరువుపోయింది తప్ప.. పని జరగలేదు” అంటూ వైఎస్‌ జగన్మోహనరెడ్డి చిర్రుబుర్రులాడుతున్నారుట. వైఎస్సార్‌ కాంగ్రెస్‌నుంచి తెలుగుదేశంలోకి ఫిరాయించేస్తున్న నాయకుల మీద పార్టీ అధినేత తొలినుంచి ఉపేక్ష ధోరణినే అనుసరిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. వారి గురించి మాట్లాడడమే అనవసరం అంటూ ఛీత్కరించుకుంటూ జగన్‌ వారిని మరింత దూరం చేసుకున్నారు. దమ్ముంటే రాజీనామాలు చేసి గెలవాలనే డిమాండ్‌ ఒక్కటీ తప్ప.. ఇతరత్రా వారి గురించి పట్టించుకుంటున్నది లేదు.

ఇలాంటి నేపథ్యంలో బొబ్బిలి రాజులు పార్టీ మారుతోంటే.. వారిని బుజ్జగించడానికి విజయసాయిరెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి మరికొందరు కీలక నేతలు వెళ్లడం జరిగింది. వారు తన బొబ్బిలి కోటకు వస్తున్నారని తెలిసినప్పటికీ, వారికి అందుబాటులో లేకుండా సుజయకృష్ణ మొహం చాటేసి బయటకు వెళ్లిపోవడం, వారు ఫోనులో మాట్లాడేందుకు ప్రయత్నించినా అందుబాటులోకి రాకపోవడం, వారు ఇంటి వద్ద కాసేపు నిరీక్షించి ఉత్తచేతుల్తో తిరిగి వచ్చేయడం జరిగింది. ఒక రకంగా ఇది వైకాపాకు పెద్ద అవమానం కిందే లెక్క.

ఈ అవమానాన్ని జగన్‌ సహించలేకపోతున్నారట. బుజ్జగింపులు వద్దని నేను ముందే చెప్పాను. కానీ మీరు విన్లేదు. ఇప్పుడు పరువునష్టం తెచ్చిపెట్టారు. అంటూ దూతలుగా వెళ్లిన వారిమీద కస్సుబుస్సు మంటున్నారట. వెళ్లిపోతున్నట్లు ప్రకటనలు చేసిన వారిని బుజ్జగించడానికి వెళ్లి పరువు పోగొట్టుకునే బదులుగా, ఇంకా పుకార్ల దశలో ఉన్న, వెళ్లాలని అనుకుంటున్న వారిని గుర్తించి వారు పార్టీలోనే ఉండేలా కాపాడుకోవాలని ఆయన పార్టీ వ్యూహకర్తలకు నిర్దేశిస్తున్నట్లుగా తెలుస్తున్నది. మరి రాజ్యసభ ఎంపీ ఎన్నికలు వచ్చేలోగా తమ బలం తగ్గిపోకుండా ఎలాంటి వ్యూహాలు చేస్తారో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఛోటా కె.నాయుడు Vs హ‌రీష్ శంక‌ర్‌… ఏం జ‌రిగింది?

'మ‌ళ్లీ నా జోలికొచ్చారో... చూసుకొందాం' అంటూ సినిమా ఫ‌క్కీలో కెమెరామెన్‌ ఛోటా కె.నాయుడుకు వార్నింగ్ ఇచ్చాడు హ‌రీష్ శంక‌ర్‌. వీరిద్ద‌రూ క‌లిసి 'రామ‌య్యా వ‌స్తావ‌య్యా' సినిమా చేశారు. అప్ప‌టి నుంచీ ఇద్ద‌రి మ‌ధ్యా...

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close