రియాక్షన్.. ఆంధ్రజ్యోతి గోడౌన్ కూల్చివేత..!

వైఎస్ కుటుంబంలో జరుగుతున్న విషయాలను “కొత్తపలుకు” ద్వారా బయటపెడుతున్న ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణపై కొద్దిరోజులుగా వైసీపీ పెద్దలు అసహనంతో ఉన్నారు. ఎప్పుడూ అసహనంతోనే ఉంటారు. కానీ ఢిల్లీలో వైఎస్ సునీత ప్రెస్ మీట్ .. ఆ తదనంతర వార్తల నేపధ్యంలో తక్షణం ఏదో ఒకటి చేయాలన్న అసహనంతో ఊగిపోయారు. ఆ విషయం వైఎస్ విజయా రాజశేఖర్ రెడ్డి పేరుతో రిలీజైన లేఖలో ఆంధ్రజ్యోతిపై ఉన్న పదజాలంతోనే తేలిపోయింది. చివరికి వారికి విశాఖలోనే ఓ గోడౌన్ కనిపించింది. ఆ గోడౌన్‌ను కూల్చేశారు. ఆ ప్రైవేటు గోడౌన్‌లోనే ఆంధ్రజ్యోతి పత్రిక ప్రింటింగ్ ప్రెస్ ఉంది. దాన్ని టార్గెట్ చేసుకున్నారు. ముందస్తు నోటీసుల్లేవు.. వీకెండ్ కూడా చూసుకోలేదు. రంగంలోకి దిగిపోయారు.

కోర్టుకెళ్లి ఉత్తర్వులు తెచ్చుకునేలోపు.. కూల్చివేయగలిగినన్ని జేసీబీలు ముందుగానే తీసుకెళ్లడంతో… కూల్చివేత పని దాదాపుగా పూర్తి చేసుకున్నారు. చివరికి ప్రైవేటు గోడౌన్ యాజమాన్యం హుటాహుటిన హైకోర్టుకు వెళ్లి…మధ్యాహ్నం తర్వాత స్టేటస్ కో ఉత్తర్వులు తెచ్చుకోగలిగింది. అయితే అప్పటికే దాదాపుగా కూల్చివేత పూర్తయింది. ఇప్పుడు ఆ కూల్చివేత శిధిలాలు అలాగే ఉంటాయి. ప్రభుత్వ పెద్దల పంతం నెరవేరింది. ఏపీఐఐసీ భూముల్లో ఆ గోడౌన్లను నిర్మించారు. అయితే అనుమతించినదాని కంటే ఎక్కువగా కట్టారంటూ.. వాటిని ఏపీఐఐసీ అధికారులు.. రెవిన్యూ అధికారులు కలిసి కూల్చేశారు. నిబంధనలకు విరుద్ధమో.. అనుకూలమో.. ఏదో ఒకటి.. ఏం చేసినా నిబంధనల ప్రకారం చేయడం అనేది ఇప్పటి వరకూ ప్రభుత్వాలు చేస్తూ ఉంటాయి. నోటీసులు ఇచ్చి.. వివరణ తీసుకుని ఆ తర్వాత స్పందన లేకపోతే కూల్చివేతల దగ్గరకు వెళ్తాయి.

ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న గోడౌన్లకు అనుమతుల్లేవంటూ ఇప్పుడు కూల్చడం ఖచ్చితంగా కక్ష సాధింపేనన్న విమర్శలు సహజంగానే వస్తాయి. వస్తున్నాయి కూడా. అయితే ప్రభుత్వం .. పెద్దలు ఇలాంటి విమర్శలను పొగడ్తలుగా భావించే పరిస్థితి ఉంది. పైగా ఇప్పుడు… ఏదో ఒకటి చేయాల్సిందేనన్న పట్టుదల. దాంతో పని పూర్తి చేసుకున్నారు. గతంలోనే విశాఖలో ఆంధ్రజ్యోతికి ఇచ్చిన ఓ స్థలాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. దానిపై కోర్టుకెళ్లి ఆంధ్రజ్యోతి యాజమాన్యం స్టే తెచ్చుకుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కాంగ్రెస్ కు అడ్వాంటేజ్ గా హరీష్ రావు సవాళ్ళు..!?

బీఆర్ఎస్ అధికారం కోల్పోయాక అటు కేసీఆర్, ఇటు హరీష్ రావు రాజకీయ వ్యూహాలు తేలిపోతున్నాయి. ప్రత్యర్ధులను కట్టడి చేసేందుకు చేస్తోన్న వ్యాఖ్యలు బీఆర్ఎస్ కు మేలు చేయకపోగా...అధికార కాంగ్రెస్ కు ఫేవర్ చేసేలా...

ఎడిటర్స్ కామెంట్ : ఆన్ లైన్ ఎలక్షన్స్ !

ఇండియాలో కేజీ బియ్యం రూ. వంద పలుకుతుంది కానీ ఒక్క జీబీ డేటా మాత్రం ఐదు రూపాయలకే వస్తుంది. మీరు సమయం అంతా యూట్యూబ్ వీడియోలు.. సోషల్ మీడియా మీదే గడపుతామంటే...

కేసీఆర్, హరీష్ రావులకు నోటిసులు..?

కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటు చేసిన జ్యుడిషియల్ కమిషన్ వర్క్ స్టార్ట్ చేసింది. గురువారం మొదటిసారి రాష్ట్రానికి వచ్చిన జస్టిస్ పినాకి చంద్రఘోష్ టీం బీఆర్కేఆర్ భవన్ లో ఇరిగేషన్...

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close