తెలంగాణలో “గుర్తు”ను కోల్పోయిన జనసేన..!

జనసేన పార్టీకి.. ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌కు ఏదీ కలసి రావడం లేదు. బీజేపీతో స్నేహం కోసం గ్రేటర్ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండటంతో తెలంగాణలో జనసేన పార్టీ తన గుర్తు అయిన గాజు గ్లాస్‌ను కోల్పోయింది. సాగర్ ఎన్నికల్లోనూ పోటీ చేయకుండా ఎవరికీ మద్దతు ప్రకటన చేయకండా జనసేన గడిపేసింది. అయితే తాజాగా వెలువడిన మినీ మున్సిపల్ ఎన్నిక సమరంలో అన్ని చోట్లా పోటీ చేయాలని నిర్ణయించుకుంది. ఐదు మున్సిపాల్టీలతో పాటు ఖమ్మం, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికలు 30వ తేదీన జరగనున్నాయి. ఆ ఎన్నికల్లో పోటీ చేయాలని జనసేన నిర్ణయించుకుంది. అందుకే ఉమ్మడి గుర్తును కేటాయించాలని రాష్ట్ర ఎన్నికల అధికారికి ఓ విజ్ఞాపనా పత్రం పెట్టుకున్నారు.

ఇంతకు ముందు జరిగిన ఎన్నికల్లో కనీసం పది శాతం సీట్లలో అయినా పోటీ చేసి ఉంటే నిబంధనల ప్రకారం కామన్ గుర్తు కేటాయిస్తారు. అయితే జనసేన పార్టీ ఇటీవలి గ్రేటర్ ఎన్నికల్లో పదిశాతం సీట్లలో పోటీ చేయలేదు. అసలు పోటీ చేయలేదు. దీనిపై… జనసేన.. ఎస్ఈసీకి వివరణ ఇచ్చింది. భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నందున పోటీ చేయలేకపోయామని… ఈసారి అన్ని చోట్లా పోటీ చేస్తామని కామన్ గుర్తు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. అయితే జనసేన వివరణపై తెలంగాణ ఎస్ఈసీ సంతృప్తి చెందలేదు. కామన్‌గా గాజు గ్లాస్ గుర్తు కేటాయించేందుకు అంగీకరించలేదు. దీంతో ఆ గుర్తు స్వతంత్రులకు కేటాయించనున్నారు.

జనసేన పార్టీ అభ్యర్థులు కూడా స్వతంత్రుల కిందనే వస్తారు కాబట్టి… వారు .. నామినేషన్లు వేసిన దగ్గరల్లా.. తమకు గాజు గ్లాస్ గుర్తు కేటాయించాలని విజ్ఞప్తి చేసుకోవాల్సి ఉంటుంది. నిబంధనలను బట్టి అధికారులు గాజు గ్లాస్ గుర్తును కేటాయిస్తారు. ఇప్పటికైతే తెలంగాణలో గుర్తును కోల్పోయినట్లయింది. ఏపీలో కూడా జనసేన పార్టీకి గుర్తు విషయంలో పక్కాగా ఉండకపోవడంతో… తిరుపతి ఉపఎన్నికల్లో పోటీ చేయకపోయినా… వేరే పార్టీ అభ్యర్థికి ఆ గుర్తును ఈసీ కేటాయించింది. దీంతో జనసేన వర్గాలకు షాక్ తగిలినట్లయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

ఐటెమ్ గాళ్‌…. పెద్ద స‌మ‌స్యే!

ఇది వ‌ర‌కు ఏ సినిమాలో ఏ హీరోయిన్‌ని తీసుకోవాలా? అని ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డేవారు. అనుకొన్నంత స్థాయిలో, సంఖ్య‌లో హీరోయిన్లు లేక‌పోవ‌డం, స్టార్ హీరోల క్రేజ్‌కు స‌రిప‌డా క‌థానాయిక‌లు దొర‌క్క‌పోవ‌డంతో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close