ప్రశ్నలన్నీ వైఎస్ విజయలక్ష్మికే..!

వైసీపీ గౌరవాధ్యక్షురాలికి కాలం అంతగా కలసి రావడం లేదు. వైసీపీకి గౌరవాధ్యక్షురాలిగా ఉండి.. మరో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడంపై వస్తున్న విమర్శలకు సమాధానం చెప్పుకోలేని పరిస్థితి ఉంటే.. తాజాగా షర్మిలపై తెలంగాణ పోలీసులు వ్యవహరించిన తీరును ఖండించిన వైనం విషయంలోనూ ఆమెపై విమర్శలు దూసుకొస్తున్నారు. విజయలక్ష్మి .. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి తల్లి అని.. గత ఏడాదిన్నరగా ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని మహిళా రైతులపై పోలీసులు జరుపుతున్న దాష్టీకాలు కనిపించలేదా అని అక్కడి రైతులు ప్రశ్నించడం ప్రారంభించారు. హైదరాబాద్‌లో పాదయాత్ర చేస్తూ వస్తున్న షర్మిలను పోలీసులు అడ్డుకున్నారు. అనుమతిలేదని.. చెప్పి బలవంతంగా పోలీస్ వాహనంలో తీసుకొచ్చి లోటస్ పాండ్‌లో వదిలి పెట్టారు. ఆ సమయంలో జరిగిన తోపులాటలో కింద పడ్డారు. జాకెట్ చినిగిపోయింది.

ఈ ఘటన చూసి తల్లి విజయలక్ష్మి ఆవేదన చెందారు. మీడియా ముందుకు వచ్చి తెలంగాణ పోలీసులపై మండిపడ్డారు. కేసీఆర్‌పైనా సీరియస్‌ అయ్యారు. ఆమె వ్యాఖ్యలు చేసిన సమయంలో.. ఏపీలో అందరికీ… అమరావతి మహిళా రైతులే గుర్తుకు వచ్చారు. అమరావతి కోసం పోరాడుతున్న మహిళా రైతులపై పోలీసులు జరిపి దాష్టీకాలు అన్నీ ఇన్నీ కావు. కొట్టారు.. తిట్టారు.. కేసులు పెట్టారు. అవి జాతీయ మానవహక్కుల సంస్థ వరకూ వెళ్లాయి. కానీ ఎప్పుడూ కూడా.. వారంతా ఆడవాళ్లే అని కానీ వారిలో చాలా మంది వైసీపీకి ఓట్లేసిన వాళ్లే అయినా కానీ.. పట్టించుకోలేదు. కనీసం పోలీసులు అలా చేయడం కరెక్ట్ కాదని ఎవరూ స్టేట్ మెంట్ ఇవ్వలేదు.

షర్మిల కూతురనే స్పందించారా.. ఆంధ్రప్రదేశ్ అమరావతి మహిళా రైతుల పట్ల కనీస బాధ్యత లేదా.. అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మహిళా రైతుల పట్ల వ్యవహరిస్తున్న తీరుపై ఒక్క సారైనా తమ కుమారుడికి చెప్పారా అన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తానికి రాజకీయాలకు సంబంధం లేకపోయినా పిల్లల కోసం.. రెండు పార్టీల కోసం పని చేస్తున్న విజయలక్ష్మికి సమాదానం చెప్పుకోలేని ప్రశ్నలు ఎదురొస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రియదర్శి తాటతీసే ‘డార్లింగ్’

హనుమాన్ విజయం తర్వాత నిర్మాత నిరంజన్ రెడ్డి కొత్త సినిమా ఖరారు చేశారు. ప్రియదర్శి హీరోగా ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి డార్లింగ్ అనే టైటిల్ పెట్టారు. అశ్విన్ రామ్ దర్శకుడు....

నినాదాలు చేస్తే సస్పెండ్ చేస్తారా..?

ఏపీ సీఎం జగన్ బస్సు యాత్రలో జై పవన్ కళ్యాణ్ అంటూ నినాదాలు చేసిన విద్యార్థులను సస్పెండ్ చేసింది ఆదిత్య విశ్వవిద్యాలయం. ఈమేరకు సర్క్యులర్ జారీ చేసిన వర్సిటీ అధికారులు.. సీఎం...

మార్గదర్శిపై జగన్ ప్రచారాన్ని రోజా కూడా నమ్మలేదే !

మార్గదర్శి నిండా మునిగిపోయిందని చిట్స్ పాడుకున్న వారికి డబ్బులు ఇవ్వడం లేదని జగన్ రెడ్డి అండ్ సీఐడీ కంపెనీ చేసిన ప్రచారం అంతా ఇంతా కాదు. కోర్టుల్లో చెప్పారు.. కేసుల్లో...

టీడీపీ కూటమికి వంగవీటి రాధా విస్తృత ప్రచారం !

ఎన్డీఏ కూటమి తరపున స్టార్‌ క్యాంపెయినర్‌ రంగంలోకి దిగారు వంగవీటి రాధా. గతంలో కాంగ్రెస్, PRP, వైసీపీ నుంచి పోటీ చేసిన ఆయన ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉన్నారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close