పవన్ కళ్యాణ్, ప్రజల్లో సింపతి క్రియేట్ చేసుకుంటున్నాడా?

పవన్ కళ్యాణ్ ఈరోజు రాయలసీమలో పర్యటన ప్రారంభించారు. కర్నూలులో తాను చేసిన భారీ రోడ్ షో లో జనాలు లక్షలాదిగా పాల్గొన్నారు. అయితే పవన్ కళ్యాణ్ పర్యటన సంబంధించిన వివరాలు ఒకటి రెండు చానల్లో తప్ప మరెక్కడా ప్రసారం కాలేదు. గత ఏడాది పవన్ కళ్యాణ్ టిడిపి మీద తిరగబడ్డ తర్వాత నుండి హఠాత్తుగా అన్ని ఛానళ్లలో పవన్ పర్యటనకు సంబంధించిన ప్రసారాలు ఆగిపోయిన సంగతి తెలిసిందే. పవన్ ఈ రోజు తన ప్రసంగంలో కూడా పరోక్షంగా ఈ అంశాన్ని ప్రస్తావించారు.

తాను మీడియా ని నమ్ముకుని రాజకీయాల్లోకి రాలేదని పవన్ కళ్యాణ్ కర్నూలు సభలో వ్యాఖ్యానించారు. తనకు కొంతమంది లాగా వేల కోట్లు లేవని అలాగే ఛానెళ్లు పేపర్లు కూడా లేవని కానీ తాను ప్రజలను నమ్ముకుని రాజకీయాల్లోకి వచ్చానని పవన్ అన్నారు. అయితే వచ్చిన జనంలో ఒక యువకుడు ” జన సైనికులైన మేమే మీ ఛానెల్స్” అని రాసి ఉన్న ప్లకార్డులను చూపించాడు . దీనిని గమనించిన పవన్ కళ్యాణ్ ఆ ప్లకార్డును వేదిక మీదికి తెప్పించుకుని మరీ సభ కి చూపించారు. తనకు మీడియా మద్దతు లేదన్న విషయాన్ని పవన్ కళ్యాణ్ ఇలా పరోక్షంగా ప్రస్తావించడం జనాలకు కూడా బాగా కనెక్ట్ అయ్యింది.

ఇప్పటికే ఇటు తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా గానీ అటు జగన్ అనుకూల మీడియా కానీ పవన్ కళ్యాణ్ వార్తలను పూర్తిగా మరుగు పరచిన నేపథ్యంలో ప్రజల్లో పవన్ పట్ల కాస్త సానుభూతి ఉంది. అందువల్లే ఏ ఛానల్ లో కూడా పవన్ కి సంబంధించిన వార్తలు రాకపోయినప్పటికీ పవన్ కళ్యాణ్ మీద, జనసేన మీద ఈ ఎన్నికల్లో అంచనాలు ఉన్నాయి.

మరి ఈ సింపతి ఆఖరి నిమిషంలో ఏ విధంగా వర్కవుట్ అవుతుందో, జనసేన కు ఏ విధంగా సహాయపడుతుందో వేచి చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

భయపెడుతోన్న ఎండలు…వాతావరణ శాఖ బిగ్ అలర్ట్

ఎండలతో తెలుగు రాష్ట్రాలు కుతకుత ఉడుకుతున్నాయి. బయటకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు. పగలూ, సాయంత్రం అనే తేడా లేకుండా ఉక్కపోత సెగలు పుట్టిస్తోంది.ఈ క్రమంలోనే వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. రానున్న...

ఈవీఎం, వీవీ ప్యాట్ పిటిషన్లపై సుప్రీం కీలక తీర్పు

లోక్ సభ ఎన్నికల వేళ ఈవీఎం-వీవీప్యాట్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. వీవీప్యాట్‌ స్లిప్పులతో ఈవీఎం ద్వారా పోలైన ఓట్లను వందశాతం సరిపోల్చాలనే పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. జస్టిస్...

పోలింగ్ ముగిసిన తర్వాత ట్యాపింగ్ కేసులో అసలైనఅరెస్టులు !

ఎన్నికల హడావుడి తగ్గిన తర్వాత ట్యాపింగ్ కేసులో ఎన్నో బ్రేక్ డాన్సులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా పనిచేసిన ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు...

ఆ విషయంలో కేసీఆర్‌కే క్లారిటీ ఉంటే ఇన్ని కష్టాలు వచ్చేవి కావేమో ?

కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ ప్రజల నమ్మకాన్ని మళ్లీ పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో బస్సు యాత్ర చేస్తున్నారు. అందులో ఆయన ఒకటే ప్రధానంగా చెబుతున్నారు. అదేమిటంటే దేవుడు తనను తెలంగాణ కోసమే పుట్టించారని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close